యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Jun 26 2025 6:33 AM | Updated on Jun 26 2025 6:33 AM

యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

సాత్నాల: మానసిక స్థితి సరిగాలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని జామ్ని గ్రామానికి చెందిన సోయం సతీశ్‌(23) జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా రాత్రి జామ్ని, మేడిగూడ మధ్యలో పంట పొలాల్లో పురుగుల మందు తాగి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి సోయం తులసీరామ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement