పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Jun 19 2025 4:30 AM | Updated on Jun 19 2025 4:30 AM

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

● యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి

కైలాస్‌నగర్‌: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. యూత్‌కాంగ్రెస్‌ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్య త ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్‌ అహ్మద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాజిద్‌ఖాన్‌, ఎర్రమళ్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి అల్మాస్‌ఖాన్‌, జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్‌గౌడ్‌, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి, నాయకులు శాంతన్‌రావు, అర్ఫాత్‌ఖాన్‌, నాహిద్‌, పోతారెడ్డి, అనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement