మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్‌ఐటీ యూనిఫాం’ | - | Sakshi
Sakshi News home page

మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్‌ఐటీ యూనిఫాం’

Jun 11 2025 8:43 AM | Updated on Jun 11 2025 8:43 AM

మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్‌ఐటీ యూనిఫాం’

మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్‌ఐటీ యూనిఫాం’

నిర్మల్‌: రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ సేవలతో దూసుకుపోతున్న జిల్లా మహిళా సమాఖ్య మరో గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికే స్కూల్‌ యూనిఫాంలను కుడుతున్న సమాఖ్య తాజాగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా గుర్తింపు ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల యూనిఫాంలనూ కుట్టించి ఇచ్చే పనిని దక్కించుకుంది. వేలాదిమంది విద్యార్థులుండే ట్రిపుల్‌ఐటీకి సంబంధించి రూ.54 లక్షల విలువైన యూనిఫాం కాంట్రాక్టు జిల్లా మహిళా సమాఖ్యకు దక్కడంపై డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి హర్షం వ్యక్తంచేశారు. కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, ట్రిపుల్‌ఐటీ వీసీ గోవర్ధన్‌ సహకారంతో మహిళా సమాఖ్యకు ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement