
సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి
కైలాస్నగర్: చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ నాయబ్ తహసీల్దార్ రాథో డ్ బాబుసింగ్ కోరారు. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని శాంతినగర్, రాంనగర్ కాలనీల్లోని పలు చౌకదుకాణాలను ఆదివారం ఆయన పరిశీలించారు. బియ్యం పంపిణీపై ఆరా తీశారు. కార్డుదారులు ఈపీవోఎస్ మిషన్పై మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం పొందాలని సూచించారు. డీల ర్లు పొరపాట్లకు తావివ్వకుండా సకాలంలో పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం ఎంఎల్ఎస్ పాయింట్ను సందర్శించి చౌకదుకాణాలకు బియ్యం తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్అర్బన్లో 43 షాపులకుగాను 38 షాపులకు, మావలలో 10 షాపులకు గాను ఒకటి, రూరల్లో 25 షాపులకు గాను 12 షాపులకు ఇంకా బియ్యం చేరాల్సి ఉందని తెలిపారు. సకా లంలో బియ్యం ఆయా దుకాణాలకు చేరవేసేలా చూడాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి మెస్రం మధుకర్ను ఆదేశించారు.