breaking news
Updated data online
-
నవీకరణ.. నవ్విపోదురు గాక!
సరూర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మలయ్యకు అయిదుగురు సంతానం. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరి (పిల్లల) పేర్లు మాత్రమే ఉన్నాయి. అయిదేళ్ల క్రితం మిగిలిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల జాబితాలో మిగతావారి పేర్లు చేరలేదు. దీంతో నెలవారీ రేషన్ బియ్యంతో పాటు వివిధ రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. సాక్షి హైదరాబాద్: గత అయిదేళ్లుగా ఆహార భద్రత (రేషన్ ) కార్డులో నవీకరణ (మార్పులు, చేర్పులు) కోసం ఆన్లైన్ ద్వారా నమోదైన దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతూనే ఉన్నాయి. పౌరసరఫరా శాఖ అధికార లాగిన్లో కార్డులోని యూనిట్లు (పాత సభ్యులు) తొలగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్త యూనిట్ల (అదనపు సభ్యులు)ను ఆమోదించేందుకు అనుమతి లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కార్డుల్లో యూనిట్లు (సభ్యులు) పెరగకపోవడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆవిర్భావానంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా బదిలీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఏడాది పాటు కార్డులో చేర్పు లు, మార్పులు ప్రక్రియ సైతం కొనసాగించి అర్ధంతరంగా నిలిపివేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య మాత్రం కొనసాగిస్తోంది. దీంతో రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ధ్రువీకరణ పత్రాలకు తిప్పలు.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ ఉపకాల వేతనాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఉపకార వేతనాల కోసం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయ నిర్ధారణ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పేర్లు లేని కారణంగా ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా తయారైంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ ఉపకార వేతనాలకు అర్హత కోల్పోతున్నారు. అయిదేళ్ల వయసు దాటితే.. ఆహార భద్రత చట్టం ప్రకారం కుటుంబంలోని సభ్యుల వయసు అయిదేళ్లు పైబడితేనే యూనిట్గా పరిగణిస్తారు. కార్డులు మంజూరైన నాటికి అయిదేళ్లలోపు సభ్యులు అర్హత సాధించలేక పోయారు. ఆ తర్వాత సభ్యులుగా చేరి్పంచేందుకు దరఖాస్తు చేసుకుంటే నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కార్డు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డులో మాత్రం యూనిట్లుగా నమోదు కాని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమా రు 2.13 లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణలో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్వో లు, ఎమ్మార్వో లాగిన్లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్వో లాగి¯న్లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ నివేదిక స్పష్టం చేస్తోంది. (చదవండి: ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు) -
మీ ఆధార్ కార్డులో తప్పులున్నాయా?
మెదక్ డెస్క్: అన్ని ప్రభుత్వ పథకాలను ‘ఆధార్’కు అనుసంధానం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో అందరికీ ఆధార్ కీలకంగా మారనుంది. మరి అంత ప్రాధాన్యమున్న మీ ఆధార్ కార్డులో తప్పులేమైనా ఉన్నాయా..! అధార్లో నమోదు చేసిన మీ ఫోన్ నెంబర్ మారిందా..! మీ పుట్టిన తేదీ తప్పుగా నమోదయిందా..! సరిచేసుకోవాలంటే ఏం చేయాలి..! ►ఆధార్ కార్డ్లో మార్పులు, చేర్పులకు కొన్ని పరిమితులున్నాయి. ►కార్డ్లో ఫొటో మార్పు చేయలేము. ►ఆధార్ కార్డ్లో పేరు, లింగం (జెండర్), పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబర్లను మార్పు చేసుకునే అవకాశం ఉంది. ఆధార్లో మార్పులు చేసుకునేందుకు సందర్భాన్ని బట్టి రెండు (ఆన్లైన్, ఆఫ్లైన్) విధానాలున్నాయి. ఆన్లైన్ విధానంలో ఇలా.. ►ఇంటర్నెట్లో http://uidai.gov.in/updateyouraadhaardata.htmలింక్ను క్లిక్ చేయాలి. ►ఇక్కడ ‘అప్డేట్ డేటా ఆన్లైన్’ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ►ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు వస్తాయి. వాటిని చదవాలి. ►తర్వాత అప్డేట్, కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ►ఇక్కడ మీకిచ్చిన ఆప్షన్లో మీ ఆధార్ కార్డ్ నెంబరును ఎంటర్ చేయాలి. ►దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ను నమోదు చేయాలి. ►అప్పుడు మీ మొబైల్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ►ఈ పాస్వర్డ్ను ఎంటర్ చేయగా మీరు ఏది మార్పు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి. ►ఇక్కడ సంబంధిత ఫారమ్ వస్తుంది. ►ఈ ఫారమ్ను పూరించాక సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ను క్లిక్ చేయాలి. ►తర్వాత డాక్యుమెంటేషన్ ఆప్షన్లో మీరు ఏదైతే మార్పు కోరుతున్నారో దానికి సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. ►తర్వాత మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ను సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి. ►ఇప్పుడు మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబరు వస్తుంది. ►ఈ నెంబరుతో మీరు మీ ఆధార్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. సూచనలు: వన్ టైమ్ పాస్వర్డ్కు కేవలం 15 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ►ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్ను ఎంచుకోవాలి. ►ఫారమ్ పూరించేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్ను పెట్టి కీ బోర్డులోని ట్యాబ్ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో సరైంది సెలక్ట్ చేసుకోవాలి. ►5 ఏళ్ల లోపు పిల్లలకు పేరెంట్స్ సంతకం చేస్తే సరిపోతుంది. ►ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో రీఫ్రెష్ చేయకూడదు. ►మీరు దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దాని డాక్యుమెంట్ పంపితే సరిపోతుంది. అన్ని పత్రాలు పంపాల్సిన అవసరం లేదు. ►పేరుకు ముందు ఎలాంటి విషయాన్ని ప్రస్తావించకూడదు. ఉదా: డా, శ్రీ, శ్రీమతి... ►అడ్రస్ చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అప్డేట్ అయిన ఆధార్ను ఆ అడ్రస్కు పంపుతారు. ►డేట్ ఆఫ్ బర్త్ మార్పునకు మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది. ►మొబైల్ నెంబరు మార్పు మాత్రం మీ ఫోన్కు మెసేజ్ వస్తుంది. దీనికి ఎలాంటి పత్రాలు రావు. ఆఫ్ లైన్ విధానం (పోస్ట్ద్వారా...) ఇంటర్ నెట్లో http://uidai.gov.in /images/ applicationform11102012.pdf లింక్ను క్లిక్ చేస్తే మీకు సంబంధిత దరఖాస్తు వస్తుంది. ►అందులో మీ వివరాలు పూరించి, సంబంధిత దరఖాస్తులను జత చేయాలి. ►దరఖాస్తును నిర్దేశిత కాలమ్లలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ►ఒక ఎన్వలప్పై ‘రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్డేట్ అండ్ కరెక్షన్’ అని రాసి ప్రాంతీయ కార్యాలయానికి పోస్ట్లో పంపాలి. సూచన: ఆన్లైన్ విధానంలో ఫారమ్ నింపే సమయంలో కొన్ని ఆప్షన్స్లో కరెక్ట్ అయిన పిన్కోడ్, విలేజ్, టౌన్, సిటి, పోస్ట్ ఆఫీస్, జిల్లా, రాష్ట్రం రాకపోతేనే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ►అటెస్ట్ చేయాల్సిన పత్రాలు, పాటించాల్సిన నిబంధనలు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలకు ఒక్కటే.