-
అలహాబాద్ కోర్టు తీర్పు గుర్తులేదా?
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించింది. బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అలహాబాద్ కోర్టు తీర్పు గుర్తులేదా అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ( ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉండడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా పరిగణించి.... అధికారులు, రాజకీయ నేతల పిల్లలను తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.) తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది టీచర్లు ఉన్నారు.. ఎంతమంది పిల్లలున్నారు అనే దానిపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసులో భాగంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు పంపింది. తదుపరి విచారణను ఈనెల 30కు వాయిదా వేసింది. ఉపాధ్యాయుల గైర్హాజరుపై విసుగెత్తిన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. -
18న డీఎస్సీ ‘కీ’
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ కీ’ని ఈ నెల 18న విడుదల చేయనున్నారు. దీనికిగాను అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జూన్ 1న ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రసుతం పాఠశాలల్లో కొన్ని చోట్ల టీచర్లు అవసరానికి మించి ఎక్కువగా ఉండగా కొన్ని చోట్ల కొరత ఉంది. దీనికి సంబంధించి పూర్తి గణాంకాలను విద్యాశాఖ ఇంతకుముందే సిద్ధం చేసింది. దాదాపు 16 వేల మంది టీచర్లు ఆయా స్కూళ్లలో అవసరానికి మించి ఉన్నట్లు తేల్చింది. రేషనలైజేషన్, బదిలీలు పూర్తిచేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. రేషనలైజేషన్, బదిలీలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి కావడంతో విద్యాశాఖ.. ఆర్థిక శాఖ అనుమతిని కోరింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి దానికి డీకోడింగ్, కంప్యూటరీకరణ ప్రక్రియలను పూర్తిచేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement