breaking news
saakshara bharath
-
సందిగ్ధంలో సాక్షరభారత్
కొత్తగూడెం : జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా చేపట్టిన ‘సాక్షరభారత్’ మిషన్ లక్ష్యం నెరవేరకుండానే సందిగ్ధంలో పడింది. గడువు ముగిసి 20 రోజులు గడిచినా ఇంకా అయోమయమే నెలకొంది. 2010 సెప్టెంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ మిషన్ గడువు 2017 డిసెంబర్ 31తో ముగిసింది. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ఈ మిషన్.. మున్ముందు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా కొనసాగుతుందా.. లేక ప్రభుత్వం దీనికి ముగింపు పలుకుతుందా అనేది అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా నడిచిన ఈ మిషన్లో పనిచేసిన గ్రామ, మండల కోఆర్డినేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందడం లేదు. అంతేగాక ప్రభుత్వం కూడా దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడుతూ.. లేస్తూ ముందుకు.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన సాక్షరభారత్ మిషన్లో ప్రతి గ్రామపంచాయతీ కేంద్రంగా వయోజన విద్యా కేంద్రం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభంలో 710 పంచాయతీల్లో ప్రారంభమై.. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 631 గ్రామాల్లో నడుస్తోంది. మండలానికి ఒకరు, గ్రామానికి ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మిషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 దశలు పూర్తయ్యాయి. ఇందులో 1,09, 573 మంది నిరక్షరాసులు నమోదు కాగా, 66, 696 మంది పేర్లు రాయటం, తెలుగు చదవటం, రాయటం నేర్చుకుని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి గుర్తింపు పత్రాలను పొందారు. వీరిలో పురుషులు 13,770 మంది, మహిళలు 52,917 మంది ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నప్పటికీ ఈ కేంద్రాలు మొక్కుబడిగా నడిచాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఈ మిషన్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. లక్ష్యం నెరవేరినట్లేనా..? రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం, ప్రతి ఒక్కరూ కనీసం సంతకం పెట్టే వరకైనా అక్షరజ్ఞానం పొందాలనే లక్ష్యంతో ప్రారంభించిన సాక్షరభారత్ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 66.40 అక్షరాస్యత శాతంతో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో, 65.87 శాతంతో ఖమ్మం జిల్లా 7వ స్థానంలో నిలిచాయి. కాగా అధికారుల లెక్కల ప్రకారం 15 ఏళ్లకు పైబడిన నిరక్షరాస్యులు రెండు జిల్లాల్లో కలిపి ఇంకా 3, 99,153 మంది ఉండటం శోచనీయం. మూడు నెలలు పొడిగించినా ఫలితం శూన్యమే..! వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ 30తోనే సాక్షరభారత్ గడువు ముగిసింది. అయితే మిషన్ లక్ష్యం పూర్తి కాలేదనే ఉద్దేశ్యంతో మరో మూడు నెలలు (డిసెంబర్ 31 వరకు) గడువు పొడిగించారు. అయితే దీనికి సంబంధించిన కార్యకలాపాలు మాత్రం ఏమీ నడవలేదు. జిల్లాలో ఈ మూడు నెలల్లో వయోజన విద్యా కేంద్రాలు తెరుచుకోలేదు, నిరక్షరాస్యులకు పుస్తకాలు పంపిణీ చేయలేదు. కోఆర్డినేటర్లకు వేతనాలు అందకపోవడంతో కొంత మంది విధులకు హాజరు కావటం లేదు. వేతనాల కోసం ఎదురుచూపులు... జిల్లాలో మండల, గ్రామస్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు నియమించిన మండల, గ్రామ కోఆర్డినేటర్ల వేతనాలు 15 నెలలుగా అందడం లేదు. మండల కోఆర్డినేటర్కు రూ.6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేల చొప్పున చెల్లించేవారు. తమకు వేతనాలు అందించాలని 18 వేల మంది కోఆర్డినేటర్లు ఇటీవల కరీంనగర్లో జరిగిన మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా.. సమస్య పరిష్కారం కాలేదు. -
‘సాక్షర భారత్’లో వింతపోకడ
నిరక్షరాస్యత నిర్మూలన కోసం అమలు చేస్తున్న సాక్షర భారత్ విషయంలో ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. సాక్షర భారత్లో ఇప్పటికే పని చేస్తున్న కోఆర్డినేటర్లకు నెలలుగా వేతనాలివ్వని ప్రభుత్వం.. కొత్తగా బోధకులను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది విమర్శలకు తావిస్తోంది. మోర్తాడ్, న్యూస్లైన్ : జిల్లాలోని 36 మండలాలకుగాను 27 మండలాల్లో మహిళల అక్షరాస్యత 50 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా మండలాల్లో అక్షరాస్యత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరు నెలల్లో అక్షరాస్యత పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సాక్షర భారత్కు అనుబంధంగా ఆయా మండలాల్లో బోధకులను నియమించాలని నిర్ణయించింది. అసలుకు లేదు.. సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్లకు ప్రతి నెల రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు నెలకు రూ 2 వేల చొప్పున ప్రభుత్వం వేతనాలను చెల్లించాల్సి ఉంది. అయితే నెలలుగా ఈ వేతనా లు చెల్లించడం లేదు. దసరా, దీపావళి పండుగల సందర్భం గా మూడు నెలల వేతనాలు చెల్లించారు. ఇప్పటికీ మండల కోఆర్డినేటర్లకు ఏడు నెలలు, గ్రామ కోఆర్డినేటర్లకు పది నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారి కి ఉత్తి చెయ్యి చూపుతూ గ్రామాలలో కొత్తగా బోధకులను నియమించాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. బకాయిలను చెల్లించాలని కోఆర్డినేటర్లు కోరుతున్నారు. 534 గ్రామాలలో.. జిల్లాలో నిజామాబాద్, భీమ్గల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, ఎడపల్లి, రెంజల్, బాన్సువాడ మండలాల్లోని 184 గ్రామాలు మినహాయించి మిగిలిన 27 మండలా ల్లో ఉన్న 534 గ్రామాలలో బోధకులను నియమిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఇద్దరేసి బోధకులను నియమించి నిరక్షరాస్యులకు పాఠాలు చెప్పిస్తారు. పాఠాలు చెప్పినందుకు బోధకులకు నెలకు రూ వెయ్యి చొప్పున వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఇందుకు అర్హులు. ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గం బోధకుల పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాయి. ఈ వారంలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నా రు. అక్షరాస్యత శాతం పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం బోధకులను నియమిస్తోందని సాక్షర భారత్ ప్రాజెక్టు అధికారి వీరేశం తెలిపారు. ఈనెలలో బోధకులతో పని చేయిస్తామని, ఒక్కొక్కరు ఆరు నెలల్లో 30 మందిని అక్షరాస్యులను చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.