breaking news
Prime Now service
-
‘అమెజాన్ నౌ’ ఇప్పుడు ‘ప్రైమ్ నౌ’
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ తన గ్రోసరీ విభాగంపై అధికంగా ఫోకస్ చేస్తోంది. స్పీడ్ డెలివరీ అంశానికి ప్రాధాన్యమిస్తోంది. అందుకే తాజాగా తన ‘అమెజాన్ నౌ’ సర్వీస్ను ‘ప్రైమ్ నౌ’గా రీబ్రాండ్ చేసింది. గ్రోసరీ విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు.. బిగ్బాస్కెట్, గ్రోఫర్స్ సంస్థలను ఎదుర్కొనేందుకు తాజా పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్టుల కోసం చిల్ చైన్లో పెట్టుబడులు కూడా పెట్టింది. మరొకవైపు ఫ్లిప్కార్ట్ కూడా గ్రోసరీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది. అమెజాన్ తన ‘ప్రైమ్ నౌ’ సేవలను (యాప్ ఆధారిత సర్వీస్) ఇప్పుడు బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ప్రైమ్ నౌలో 10,000కుపైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచాం. ఇందులో పండ్లు, కూరగాయలు, గ్రోసరీ, మాంసం వంటి వివిధ కేటగిరీలుంటాయి’ అని అమెజాన్.ఇన్ పేర్కొంది. ప్రైమ్ సభ్యులకు రెండు గంటల ఎక్స్ప్రెస్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉందని తెలియజేసింది. ఇతర కస్టమర్లు అదే రోజు లేదా తర్వాతి రోజున డెలివరీ పొందొచ్చని తెలిపింది. -
ఇక గంటలో అమెజాన్ మందు సేవలు
న్యూఢిల్లీ: ఇప్పటికే వేగవంతమైన సేవలను అందిస్తూ ప్రపంచంలోనే దూసుకెళ్తున్న ఈ వాణిజ్య సంస్థ అమెజాన్ మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్డర్ చేసిన గంటలోపే ఇంటి ముందుకు బీరు, వైన్, లిక్కర్లాంటి మత్తుపానియాలు అందించనుంది. ప్రైం నౌ సర్వీస్ పేరిట ఈ సర్వీసులను అమెజాన్ కొత్తగా ప్రారంభించింది. ఇప్పటికే ఈ పద్ధతిని ప్రారంభించిన అమెజాన్ తాజాగా అమెరికాలో ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రారంభించిన క్షణాల్లోనే ఈ విధానానికి ఆధరణ పెరిగిందని, ఈ కామర్స్ ద్వారా మద్యం కొనుగోలుచేసేవారి సంఖ్య అమాంతం పెరిగిందని అమెజాన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఒక్కొక్కటిగా వివిధ దేశాలకు ఈ సర్వీసులను విస్తరింపజేయాలనుకుంటున్నారు.