breaking news
PRC recommendations
-
ఫిట్మెంట్ పెరెగేది ఎంత?
ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా ఫిట్మెంట్ను ఖరారు చేయడం ఆన వాయితీ. ఫిట్మెంట్ ఆధారంగానే వేతనాల పెరు గుదల ఉండనున్న నేపథ్యంలో పీఆర్సీ 25% వరకు ఫిట్మెంట్ను సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వేతన సవరణ సంఘం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను స్వీకరించింది. గత పీఆర్సీ 29% ఫిట్మెంట్ను సిఫారసు చేయగా తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు ఇస్తున్న మొదటి వేతన సవరణ అయినందున సీఎం కేసీఆర్ 43% ఫిట్మెంట్ ప్రకటించారు. అయితే ప్రస్తుత పీఆర్సీలో గత ఫిట్మెంట్కు అదనంగా 20% పెంచి 63% ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ చైర్మన్కు నివేదికలు అందజేశాయి. పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా ఆ పెంపు అవసరమని తమ సంఘాల తరఫున తెలియజేశాయి. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతమొత్తం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వేతన సవరణ సంఘం కూడా 25 శాతం వరకే ఫిట్మెంట్ను సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. ఆ వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగులతో సమావేశమై ఫిట్మెం ట్ను ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్సీ నివేది కను 10–12 రోజుల్లో సమర్పించాలంటూ పీఆర్సీ చైర్మన్ సి.ఆర్. బిస్వాల్ను సీఎం కేసీఆర్ ఈ నెల 10న ఆదేశించడంతో నివేదికను అందజేసేందుకు వేతన సవరణ సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేది కలో ఉండే అంశాల్లో ప్రధానమైన ఫిట్మెంట్పై ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. నిత్యావ సర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదలను ఖరారు చేయడమే ఫిట్మెంట్. ఫిట్మెంట్ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుండటంతో ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ సాధనకు సీఎంను ఒప్పించాలని ఉద్యో గులు ఆయా సంఘాల నేతలను కోరుతున్నారు. ఉద్యోగ సంఘాలు కోరుతున్నది.. 63% వేతన సవరణ సంఘం సిఫార్సు?.. 25% ఎంత ఫిట్మెంట్ ఇస్తే ఎంత భారం? రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి ఒక శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే ఏటా అదనంగా రూ. 225 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని పీఆర్సీ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇలా ఒక శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు కట్టాయి. దాని ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ. 4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ. 4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ. 5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ. 5,625 కోట్లు, రూ. 27 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ. 6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. అలాగే ప్రతి శాతానికి రూ. 225 కోట్ల చొప్పున లెక్కించి 35 శాతం ఇస్తే రూ. 7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. సీఎం సమక్షంలోనే పెంపు ఖరారు... పీఆర్సీ నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఫిట్మెంట్ను ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా ఫిట్మెంట్ను వీలైనంతగా ఎక్కువగా పొందేలా సీఎం కేసీఆర్ను ఒప్పించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇస్తారని, అంతకంటే ఎక్కువ సాధించుకోవాలన్న ఆలోచనల్లో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30 శాతం ఫిట్మెంట్ ఖరారు చేసేలా సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నాయి. ఒకవేళ 30 శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వం ఏటా రూ. 6,750 కోట్లు అదనంగా వెచ్చించాలి ఉంటుంది. ఇతర అంశాలపైనా పీఆర్సీ దృష్టి... ఉద్యోగులకు పీఆర్సీతోపాటు ప్రధాన డిమాండ్లు అయిన రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై కమిటీ ఏర్పాటు వంటి అంశాలపైనా వేతన సవరణ సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను ప్యాకేజీ రూపంలో అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశాలపైనా సీఎం సమక్షంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా, పీఆర్సీలో పొందుపర్చాల్సిన అంశాలపై పీఆర్సీ సభ్యులతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీ అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. -
పెన్షనర్లతో చెలగాటం!
పీఆర్సీ సిఫారసుల అమలుపై సర్కారు జాప్యం ⇒ ప్రసుత అదనపు పెన్షన్ విధానానికి గండి కొట్టే యత్నం ⇒ రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లింపులోనూ మీనమేషాలు ⇒ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కనికరించని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంది. పీఆర్సీ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించినా వాటి అమలు విషయంలో జాప్యం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పెరిగిన ఫిట్మెంట్తో పెన్షన్ పెరుగుతుందనుకొని సంబరపడ్డ రిటైర్డ్ ఉద్యోగులు డీలా పడ్డారు. మరోవైపు 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వీటిని చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయటంలోనూ జాప్యం చేస్తోంది. అదనపు పెన్షన్కు గండి... 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. పెన్షన్లో 15 శాతం అదనపు పెన్షన్గా చెల్లిస్తారు. పదో పీఆర్సీ సైతం 70-75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ కొన్నేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు అందే పెన్షన్లో భారీగా వ్యత్యాసముంటోందని తొమ్మిదో పీఆర్సీ గుర్తించింది. దీన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు 75 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచించటంతో ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానాన్ని 70 ఏళ్లకే కుదించాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. కానీ అందుకు సంబంధించిన వివరణను పొందుపరచలేదు. అదే సాకుగా అదనపు పెన్షన్ల విషయాన్ని ఆర్థికశాఖ దాటవేసింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తటంతో 70 ఏళ్ల వయసు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తే ఈ భారం మరింత పెరిగిపోతుందని.. పాత పద్ధతినే అనుసరించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఉత్తర్వులు వెలువడే వరకు అదనపు పెన్షన్ పీటముడి వీడేలా లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలపై మొండి వైఖరి... చివరి 10 నెలల వేతన సగటు ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందించే విధానం గతంలో అమల్లో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో ఆ విధానానికి స్వస్తి పలికింది. ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు అందుతున్న పెన్షన్కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్కు వ్యత్యాసముందని 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం లెక్కచేయకపోవటంతో 2003లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికీ సర్కారు మొండికేయటంతో రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. గత ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ వ్యత్యాసానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని.. ఇకపై కొత్త విధానంలోనే పెన్షన్ లెక్కించి ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ బకాయిల మొత్తం రూ. 900 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. తెలంగాణ వాటాగా రూ. 327 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 30 వేల మంది లబ్ధి పొందుతారు. ఇప్పట్నుంచి వీరికి కొత్త విధానంలో పెన్షన్ చెల్లించటం వల్ల ప్రతి నెలా మరో రూ.10 కోట్లు భారం పడుతుందని సర్కారు భావిస్తోంది. ఆరు నెలలుగా ఈ ఫైలు సీఎం దగ్గరే పెండింగ్లో ఉంది.