breaking news
Petrol and diesel quality
-
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
‘చిల్లర’ దోపిడీ
* పెట్రో బంకుల సిబ్బంది ఇష్టారాజ్యం * మోసపోతున్న వినియోగదారులు * పట్టించుకోని అధికారులు సిద్దిపేట అర్బన్ : పెట్రోల్, డీజిల్ నాణ్యత, కొలతల్లో తీవ్ర వ్యత్యాసం చూపుతూ బంకు నిర్వాహకులు ‘చిల్లర’ను వెనుకేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో బిజీబిజీగా ఉండే వివిధ వర్గాల ప్రజలు ఈ దోపిడీని చూసీ, చూడనట్లు వదిలేస్తున్నారు. కొందరైతే ఈ వ్యవహారంపై సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. మరి కొన్ని బంకుల్లో కొందరు వినియోగదారులు ఈ ‘చిల్లర’పై వాగ్వాదాలకు దిగిన సందర్భాలూ లేకపోలేదు. ఈ తేడాలను అరికట్టాల్సిన తూనికలు కొలతల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. సిద్దిపేట పట్టణంలో సుమారు 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో నిత్యం సుమారు 20 వేల లీటర్ల పెట్రోల్, 80 వేల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం సుమారు రూ. 6 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతుంది. రూ. 50లకు గాను రూ. 49.61పెసలకే పెట్రోల్ మాత్రమే పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దబాయిస్తారు. ఇక్కడే 39 పైసలు ‘చిల్లర’ మిగిలిస్తారు. ఇలా 1000 మిల్లీ లీటర్లు పెట్రోల్ పోయాల్సిన చోట 850 మిల్లీ లీటర్లకు మించి రావడం లేదు. దీనికి ఎలక్ట్రానిక్ మిషన్ల లోపాలుగా చెబుతూ బంక్ నిర్వాహకులు పబ్బంగడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.72.43 ఉంది. రూ. 100 పెట్రోల్ పోస్తే 1.40 లీటర్ల పెట్రోల్ రావాలి. కానీ 1.10 నుంచి 1.20 లీటర్లు మాత్రమే వస్తుంది. బంకుల నిర్వాహకులు ముట్టజెప్పే ముడుపులు తీసుకుని అధికారులు బంకులపై కన్నెత్తి చూడడం లేదని వాటిని తనిఖీలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో నాణ్యత, పరిమాణంలో తేడాలున్నా, ఇన్వాయిస్కు, స్టాక్కు వ్యత్యాసం కనిపించినా సెక్షన్ - 6ఏ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ అలా జరగడం లేదు. అదేవిధంగా బంకు పరిసరాల్లో నిర్వాహకులు పాటిస్తున్నారా..? ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నారా..? వాహనాలకు సరిపడా పార్కింగ్ చోటు ఉందా..? అనే వాటి ని పరిశీలించాల్సిన తూనికలు, కొలతల అధికారులు ఏటా పంపింగ్ సామర్థ్యాన్ని కూడా పరిశీలించి ముద్రలు వేయాల్సి ఉన్నా అలా జర గడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.