breaking news
old price
-
డీఏపీపై సబ్సిడీ పెంపునకు కేంద్రం కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) బస్తా పాత ధరకే లభించనుంది. డీఏపీ బస్తాకు రూ.700 చొప్పున సబ్సిడీని పెంచుతూ గత నెలలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఏడాది డీఏపీ బస్తా ధర రూ. 1,700 ఉండగా, కేంద్రం రూ. 500 సబ్సిడీ ఇవ్వడంతో కంపెనీలు రూ. 1,200కు బస్తా చొప్పున విక్రయించాయి. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల కారణంగా డీఏపీ బస్తా రూ. 2,400 లకు చేరుకుంది. రైతులకు పాత ధరకే డీఏపీ బస్తా లభించేలా కేంద్రం తాజాగా సబ్సిడీని రూ. 1,200లకు పెంచింది. డీప్ ఓషియన్ మిషన్కు ఓకే సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి వీలుగా రానున్న ఐదేళ్లలో రూ. 4,077 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన అయిన ‘డీప్ ఓషియన్ మిషన్’కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ప్రధానంగా ఆరు భాగాలుగా ఉంటుంది. డీప్ సీ మైనింగ్లో భాగంగా సముద్రంలో 6 వేల మీటర్ల అడుగున ఖనిజాల అన్వేషణకు వీలుగా శాస్త్రీయ సెన్సార్లు, పరికరాల సహితంగా ముగ్గురు మనుషులను తీసుకెళ్లగలిగే ఒక సబ్మెర్సిబుల్ను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి సామర్థ్యం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విభజన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఏడు ప్రభుత్వరంగ సంస్థలుగా విభజించింది. కేబినెట్ దీనికి బుధవారం ఆమోదముద్ర వేసింది. జవాబుదారీతనం, పోటీతత్వం, పనితీరును మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని 41 ఆయుధ కర్మాగారాలు, సైనిక ఉత్పత్తుల సంస్థలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద ఉన్నాయి. -
డబుల్ బెడ్రూంకు పాత ధరలే..
ఉత్తర్వు జారీ చేసిన గృహ నిర్మాణ శాఖ సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం యూనిట్కాస్ట్ విషయంలో తర్జనభర్జన పడ్డ ప్రభుత్వం చివరికి పాత ధరనే ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 ల క్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7 లక్షలుగా ధరలను ఖరారు చేసింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు, జిల్లాల్లో మరో లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటితోపాటు గత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 60 వేల ఇళ్లను కూడా ప్రారంభించాల్సి ఉంది. వీటన్నింటికీ ఈ యూనిట్కాస్టే వర్తించనుంది. టెండర్లకు సరైన స్పందన రాకపోవడంతో యూనిట్ ధరను పెంచాలని అధికారులు ప్రతిపాదించినా.. సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. ఈ పథకం కింద నిర్మించే ప్రతి ఇంటికీ రహదారి, మంచినీరు, విద్యుత్తు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇల్లు ఒక్కో చోట ఉంటే వీటి కల్పన సాధ్యం కానందున కాలనీలుగా ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఆ రూపంలో అయ్యే ఖర్చును ఒక్కో ఇంటి వారీగా విభజించి చివరకు ప్రతి ఇంటికి గ్రామ ప్రాంతాల్లో రూ.1.25 ల క్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు అవసరమవుతాయని నిర్ధారించింది.