breaking news
myskin
-
ఆ క్రేజీ డైరెక్టర్తో విజయ్ సేతుపతి మరోసారి
అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం విజయ్ సేతుపతి తెగ తిరిగాడు. ఇప్పుడు తమ సినిమాల్లో నటించాలని దర్శకులు అతడి చుట్టూ తిరుగుతున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తూ 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో 'పిశాచి 2'లోనూ విజయ్ లీడ్ రోల్ చేశాడు. ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్తో సినిమా చేయాలని మిస్కిన్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
పిల్లలు, మహిళలు నా సినిమాలు చూడకండి
సినిమా ప్రమోషన్ సమయంలో ఏ డైరెక్టర్ అయినా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సినిమాను చిన్న పిల్లలు, మహిళలు చూడొద్దంటూ తానే ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల 'తర్కపు' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పిశాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మిస్కిన్, ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో సంఛలనం సృష్టిస్తున్నాడు. సినిమా అంటేనే పెద్దలకోసం తీస్తారని, అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలనుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఒకవేళ మీరు మీ పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాకో లేక 'మై డియర్ కుట్టిచేతన్' లాంటి చిన్న పిల్లల సినిమాకో వెళ్లండి అంటూ ఘూటుగా స్పందించాడు. డైరెక్టర్ తాను అనుకున్న భావం తెర మీదకు రావటం కోసం కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడక తప్పదని చెప్పాడు మిస్కిన్. తన తదుపరి చిత్రానికి సెన్సార్ బోర్డ్ తప్పకుండా 'ఏ' సర్టిఫికేట్ ఇస్తుందన్న మిస్కిన్... పిల్లలు, మహిళలు మాత్రం ఆ సినిమాను చూడొద్దన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో మిస్కిన్ ధైర్యాన్నిమెచ్చుకున్నా, ప్రేక్షకుల్లో కేవలం ఒక వర్గం మాత్రమే చూస్తే సినిమా వసూళ్ల విషయంలో కష్టం అంటున్నారు సినీ జనాలు.