MLA paasam sunilkumar
-
పాశం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి
గూడూరు: ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి మారడం అనైతిక చర్యని, ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ తన శాసన సభ్యత్వానికి రాజీ నామా చేయాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ బాలచెన్నయ్య శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్న నియోజకవర్గ ప్రజలు సునీల్కుమార్కు ఓట్లేసి గెలిపిం చారని, ఇప్పుడు ఆయన పార్టీ మారడం అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంత ముఖ్యమో, ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కూడా నాయకులకు శిరోధార్యమన్నా రు. ఆయన పార్టీ మారాలంటే ముందుగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున పోటీ చేసి ఉంటే నియోజకవర్గ ప్రజలు హర్షించేవారన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. -
రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు
గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ చిట్టమూరు: కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని గునపాటిపాళెం నుంచి ఉప్పలమర్తి మీదుగా కొత్త చెరువుకట్ట లింకు రోడ్డు వరకు 3.8 కిలోమీటర్లకు గాను రూ.3.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. కోట మండ లం తిన్నెలపూడి పంచాయతీ లక్ష్మక్కకండ్రిగ నుంచి తూర్పుకండ్రిగ వరకు బీటీ రోడ్డుకు రూ.81 లక్షలు విడులయ్యాయన్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు చేపడుతారని పేర్కొన్నారు. చిట్టమూరు మండలంలో ఎస్టీపీ ద్వారా మెట్టు గిరిజన కాలనీ నుంచి జంగాలపల్లి బ్రిడ్జి వరకు నిర్మించే రోడ్డుకు రూ.1.18 కోట్లు మంజూరయ్యాయన్నారు. గొల్లపాళెం నుంచి కోటిగుంట గిరిజన కాలనీ వరకు రూ.34 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. అలాగే వాకాడు మండలం నిడుగుర్తి నుంచి చిన్నతోట మీదుగా పంట్రంగం శివాలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.03 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. అనుమతులు కోసం ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి తర్వలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.