చినుకులా కురిశావే...
శివాజి నటిస్తున్న క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చినుకులా కురిశావే’. అనీషాసింగ్ కథానాయిక. కూతాని వెంకట నారాయణ దర్శకత్వంలో మల్లిపూడి బాబా మెహెర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే కులుమనాలిలోని అందమైన ప్రాంతాల్లో ప్రదీప్ ఆంటోని నృత్య దర్శకత్వంలో హీరో హీరోయిన్లపై రెండు పాటలు చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో శివాజి పాత్రచిత్రణ చాలా విభిన్నంగా ఉంటుంది. పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నవంబర్ 6 నుంచి రెండో షెడ్యూల్ని కాకినాడ, కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. పృధ్వీ, నాగినీడు, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కొల్లి ప్రసాద్, కథ-మాటలు: జి.రామాంజనేయులు.