breaking news
kolhapuri
-
ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్వే లుక్లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్కతాకు వెళ్లి లాహోర్కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్జోన్గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
షాకింగ్.. టాయిలెట్ వాటర్తో పానీపూరి
ముంబై: ‘పానీ పూరి’ దేశవ్యాప్తంగా అందరికి ఇష్టమైన చిరుతిండి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ స్నాక్ ఐటం ప్రస్తుతం గ్రామాల్లో కూడా లభిస్తుంది. కరోనాతో ప్రస్తుతం చాలా మంది జనాలు బయటి ఆహారం తీసుకోవాలంటనే ఒణుకుతున్నారు. దాంతో ఇప్పుడు పానీపూరికి గిరాకి బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు రోడ్డుకు ఇరువైపులా పానీపూరి బళ్లు.. దాని చుట్టూ జనాలు కిక్కిరిసి ఉండేవారు. మధ్యాహ్నం మొదలయ్యే ఈ వ్యాపారం రాత్రి పది వరకు కూడా నడిచేది. ఇక చిన్న పిల్లలు మొదలు.. ముసలి వారు వరకు ఇష్టంగా తినేవారు. మరో విశేషం ఏంటంటే పానీపూరి వ్యాపారంలో కల్తీకి సంబంధించి ఎన్ని వార్తలు వచ్చిన గిరాకీ మాత్రం తగ్గేది కాదు. మరి ఇప్పుడు ఈ వార్త చదివిన తర్వత అయినా జనాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. తాజాగా ఓ పానీ పూరీ బండి వ్యక్తి టాయిలెట్ వినియోగం కోసం ఉంచిన నీటిని తెచ్చి.. పానీపూరికి వాడే రసంలో కలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు అతడిని చితకబాదారు. (చదవండి: ప్రాణం తీసిన గప్చుప్) ఈ ఘటన కొల్హాపూర్లో చోటు చేసుకుంది. పట్టణంలోని రంకాల లేక్ సమీపంలో ‘ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా’ పేరుతో నడిచే ఈ పానీ పూరి బండి ఆ ప్రాంతంలో తెగ ఫెమస్. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పానీ పూరి కోసం జనాలు బండి దగ్గర క్యూ కడతారు. ఈ క్రమంలో ఓ రోజు సదరు పానీ పూరి బండి వ్యక్తి రోడ్డు పక్కన టాయిలెట్ బయట ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో మిక్స్ చేశాడు. అయితే అతడి నిర్వకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో అతడి బండిని కిందపడేసి.. వస్తువులను నాశనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచిగా చేసిపెట్టినప్పటికి కొందరికి మాత్రం బయటి తిండే రుచిగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇది చదివాకైనా మారితే మంచిది. -
కొల్హాపురి చెప్పులకు అరుదైన ఘనత
ముంబై : సాంప్రదాయ పాదరక్షలు అనగానే గుర్తొచ్చేది కొల్హాపురి చెప్పులు. దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్కు తాజాగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించింది. జీఐ ట్యాగ్ లభించడం ద్వారా కొల్హాపురి చెప్పుల మార్కెట్ మరింతగా పెరగనుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్, షోలాపూర్, సంగ్లీ, సతారా, కర్ణాటకలోని ధార్వాడ్, బెల్గామ్, బగల్కోట్, బీజాపూర్ జిల్లాలను కొల్హాపురి చెప్పుల మూల స్థానంగా పేర్కొన్నారు. నిర్ధిష్ట భూగోళ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వాటికి ఈ జీఐ ట్యాగ్ని అందజేస్తారు. ఇది మరో చోట ఉత్పత్తి కాదని అర్థం. ఈ ట్యాగ్ క్వాలిటీని కూడా సూచిస్తుంది. ఈ జియో ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు లభిస్తోంది. -
త్వరలో అమ్మవారికి అష్టమాతృకల వెండి కవచం
హన్మకొండ కల్చరల్ : మహారాష్ట్రలోని కొల్హాపురి దేవాలయంలో కొలువుదీరిన అమ్మవారి మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి కూడా అష్టమాతృకల వెండికవచం ఏర్పాటు చేసేందుకు దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భద్రకాళి దేవాలయంలోని పలు పంచలోహ విగ్రహాలను రూపొందించిన తమిళనాడు కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పి స్థపతిశేఖర కవచం డిజైనింగ్ను అధికారులకు సమర్పించారు. అష్టమాతృకలకు 20 కిలోల వెండి కావాల్సి ఉండగా.. జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త టాటా సెలెక్ట్ మోటార్స్ అధినేత ముప్పిడి విజయ్కుమార్రెడ్డి 17 కిలోలు, సర్వస్వతీభట్ల రాజేశ్వరశర్మ 2 కిలోలు, డాక్టర్ ఉపేందర్ కిలో వెండిని సమకూర్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం వారు మొత్తం 20 కిలోల వెండిని దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు చేతుల మీదుగా స్థపతిశేఖరకు అం దజేశారు. ఈ సందర్భంగా స్థపతిశేఖర మాట్లాడుతూ కవచం తయారు చేసేందుకు 45 రోజుల సమయం పడుతుం దన్నారు. ఆశ్వయుజ మాసంలో జరిగే దేవీనవరాత్రుల్లోగా కవచం తయారు చేసి అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.