-
ఏ వయసులో మోకాళ్ళ సర్జరీ చేసుకుంటే త్వరగా కోలుకుంటారు ..!
-
గాంధీ వైద్యుల ‘ఆరు’దైన సర్జరీలు
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆరు గంటల వ్యవధిలో ఆరుగురు రోగులకు మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వివరాలు వెల్లడించారు. గాంధీ ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ వాల్యా నేతృత్వంలో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, బీహెచ్ఈఎల్ లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా హయత్నగర్, కర్నూలు జిల్లా కొత్తకోట, హైదరాబాద్ జిల్లా అంబర్పేట, సూర్యాపేట జిల్లాకు చెందిన నాగమునీంద్ర(63), నాగమణి (40), మంగమ్మ (55), రామాచారి (56), విజయలక్ష్మి (69), పున్నమ్మ (68)లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో పెద్దసంఖ్యలో మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు చేపట్టారు. ఒకేరోజు ఆరు గంటల్లో ఆరు సర్జరీలు సక్సెస్ కావడం అరుదైన విషయమని డాక్టర్ రాజారావు అన్నారు. మోకాలిచిప్ప మార్పిడి సర్జరీలు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ పథకాల ద్వారా వీటిని ఉచితంగా నిర్వహించామని వివరించారు. సర్జరీల్లో పాల్గొన్న వైద్యులకు డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీలు నర్సింహరావునేత, శోభన్బాబు అభినందించారు. -
కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్తో మోకీళ్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: మోకీళ్ల మార్పిడి చికిత్సకు హైటిబియల్ అస్టియోటొమి (హెచ్టీఓ), మెనిస్కస్ రూట్ రిపేర్, కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ ప్రత్యామ్నాయమని సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ఆర్థోస్కోపీ (సీసా) ఆసుపత్రి సీనియర్ షోల్డర్ అండ్ నీ సర్జన్ డాక్టర్ రఘువీర్రెడ్డి అభిప్రాయపడ్డారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు క్రీడల్లో గాయాలు, రోడ్డు ప్రమాదాలతో చిన్న వయసులోనే అనేక మంది మోకీళ్ల నొప్పుల బారిన పడుతున్నారన్నారు. ఇలాంటి వారికి ఇప్పటి వరకు మోకీళ్ల మార్పిడి సంప్రదాయంగా వస్తుందని, ప్రస్తుతం వీటికి ప్రత్యాయ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీసా ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ‘అడ్వాన్స్డ్ నీ కోర్స్–2018’లైవ్ సర్జరీ వర్క్షాప్ నిర్వహించారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 200 మంది ఆర్థోపెడిక్ వైద్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రాన్స్కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ పాస్కల్ క్రిస్టల్ సహా పలువురు వైద్య నిపుణులు.. మోకీలు మార్పిడి చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సలో అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. ఈ సందర్భంగా రఘువీర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 55 ఏళ్లలోపు బాధితులకు మోకీలు మార్పిడి చికిత్సలు నష్టం చేకూర్చుతున్నాయని, ఇలాంటి వారికి నొప్పి తక్కువగా ఉండే హెచ్టీఓ ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పారు. కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పద్ధతిలో కత్తిగాటుతో పని లేకుండా మోకీళ్లను యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. -
సహజసిద్ధమైన మోకాలుకు ప్రత్యామ్నాయం ‘అట్యూన్’
తాడేపల్లి రూరల్, న్యూస్లైన్: జాయింటు రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు అవసరమయ్యే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి ‘అట్యూన్’ ద్వారా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో తాడేపల్లి మణిపాల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి ఒక విప్లవాత్మకమైన విధానానికి నాంది పలికిందని మణిపాల్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణుడు నల్లమోతు జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం మణిపాల్ ఆసుపత్రిలో ‘అట్యూన్’ ఇంప్లాంట్ను ఉపయోగించి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘అట్యూన్’ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన విధానమని, దీని ద్వారా ముఖ్యమైన, సహజసిద్ధమైన ఎముకలోని చాలా భాగాన్ని, లిగ్మెంట్స్, కణజాలాన్ని అందేలా ఉంచడం జరుగుతుందని, దాని వలన ఎముకలు దీర్ఘకాలం ఇబ్బందికి గురికాకుండా ఉంటాయని తెలిపారు. సాధారణ మోకాలు జాయింటు లాగా అట్యూన్ అదనపు ఎముక నష్టం లేకుండా 140 నుంచి 150 డిగ్రీలలో మడవ వచ్చని తెలిపారు. గతంలో మోకాలు శస్త్రచికిత్స కోసం వినియోగించిన ఇంప్లాంట్స్ కేవలం 8 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే పని చేసేవని, కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రూపొందించిన అట్యూన్ 30 సంవత్సరాలు పని చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో యువకులు సైతం మోకాలు నొప్పులతో ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ఆ కంపెనీ 30 సంవత్సరాలపాటు మనగలిగే ఈ అట్యూన్ను రూపొందించిందన్నారు. అట్యూన్ను కేవలం ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులకు మాత్రమే జాన్సన్ కంపెనీ సరఫరా చేస్తుందని, మొదటి దశలో దేశవ్యాప్తంగా కేవలం అట్యూన్ శస్త్ర చికిత్స నిమిత్తం 12 మంది వైద్యులకు మాత్రమే శిక్షణ ఇచ్చారని, వారిలో ఆంధ్రప్రదేశ్ నుండి తాను శిక్షణ పొందినట్టు డాక్టర్ జగదీష్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement