breaking news
k.kanta reddy
-
ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
రాజ్యాంగ ప్రవేశిక -భారత రాజ్యాంగ లక్షణాలు రాజ్యాంగ ప్రవేశిక ఉత్తమ రాజ్యాంగ లక్షణం. ప్రవేశికలో రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు సంక్షిప్తంగా ఉంటాయి. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, మూలతత్వమని పేర్కొంటారు. జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు మూలం. ప్రవేశిక ప్రధానంగా 4 అంశాలను తెలుపుతుంది.. 1. అధికారానికి మూలం 2. రాజకీయ స్వభావం 3. రాజ్యాంగ ఆశయాలు 4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది ప్రవేశికలోని ‘భారత ప్రజలమైన మేము’ అనే పదం రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెలుపుతుంది. ‘శాసనం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అనే భావన రాజ్యాంగ పరిషత్తు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరిస్తుంది. సర్వసత్తాక దేశం అంటే సార్వభౌమాధికార దేశం. ఇతర దేశాల ఆధిపత్యం, నియంత్రణకు గురికాకుండా, దేశంలోని సంస్థలపై, వ్యక్తులపై అపరిమిత అధికారం ఉండడం. లౌకిక రాజ్యం: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా గుర్తించని రాజ్యం. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది. ఈ పదాన్ని ప్రవేశికలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. పజాస్వామ్యం: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తికీ భాగస్వామ్యం ఉండడం. వయోజన ఓటింగ్ ద్వారా పాలకులను నిర్ణీత కాలానికి ప్రజలే ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రజాస్వామ్య ఆశయాలు. గణతంత్ర దేశం: దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నుకుంటారు. రాజకీయ న్యాయం: రాజ్యపాలనలో పౌరులందరికీ అవకాశాన్ని కల్పించడం. సమాన రాజకీయ హక్కుల కల్పన ద్వారా రాజకీయ న్యాయాన్ని కల్పించవచ్చు. ఉదాహరణ: ఓటుహక్కు, పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు. ఆర్థిక న్యాయం: సంపదను వికేంద్రీకరించి పేదరికాన్ని నిర్మూలించడం. వృత్తి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించడం. సామ్యవాదం: సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ సమసమాజ నిర్మాణానికి తోడ్పడే విధానం. ఈ పదాన్ని ప్రవేశికలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సామ్యవాద సాధనకై 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు, 1951లో భూ సంస్కరణల చట్టం రూపకల్పన, 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ, 1971లో రాజభరణాల రద్దు, 1975లో 20 సూత్రాల పథకం, 1978లో ఆస్తి హక్కు తొలగింపు, 1980లో ఆరు బ్యాంకుల జాతీయీకరణ మొదలైనవి చేపట్టారు. సాంఘిక న్యాయం: పౌరులందరూ సమానులే. కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హోదాను కల్పించడం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం. స్వేచ్ఛ: ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, స్వేచ్ఛాయుత నాగరిక జీవితం గడపడానికి అందరికీ ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, ఆరాధనలకు హామీ ఇచ్చారు. సమానత్వం: అన్ని రకాలైన అసమానతలను వివక్షతలను రద్దు చేసి ప్రతీ వ్యక్తి తనకు తాను పూర్తిగా అభివృద్ధి చేసుకొనేందుకు సమాన అవకాశాలను, హోదాను కల్పించడం. సౌభ్రాతృత్వం: సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం. దేశ సమగ్రతకు, ప్రజల ఐక్యతకు సోదరభావం తప్పనిసరి. ఐక్యత, సమగ్రత: ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించి వారిలో ఐక్యతకు దోహదపడడం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు. {పవేశికకు చేసిన ఏకైక సవరణ: కేశవానంద భారతి కేసు నేపథ్యంలో స్వరణ్సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను చేర్చారు. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా? కాదా? అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 1960 బెరుబారి యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది. 1973 కేశవానంద భారతి కేసులో, 1980 మినర్వా మిల్స్ కేసులో అంతర్భాగమని తీర్పునిచ్చింది. రాజ్యాంగ లక్షణాలు: సుధీర్ఘ లిఖిత రాజ్యాంగం: మన రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం. ప్రభుత్వాల నిర్మాణం, విధులు, అధికారాలు, ప్రాథమిక హక్కులు, దేశ వైవిధ్యం, చారిత్రక అవసరాలు, సమాఖ్య వ్యవస్థ మొదలైన అంశాలను వివరంగా చర్చించారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం 461 అధికరణలు 25 భాగాలు 12 షెడ్యూళ్లు ఉన్నాయి. దృఢ, అదృఢ రాజ్యాంగం: మన భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం మాదిరిగా దృఢమైంది కాదు. బ్రిటన్ రాజ్యాంగం మాదిరిగా అదృఢమైందీ కాదు. ఇది దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం. సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు: రాజ్యాంగంలోని అధికరణం 1 ప్రకారం రాష్ట్రాల సమ్మేళనం అయినప్పటికీ సమాఖ్య ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణాలు కనిపిస్తాయి. సమాఖ్య లక్షణాలు అయిన అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ ఉన్నాయి. ఏకకేంద్ర లక్షణాలు అయిన ఒకే రాజ్యాంగం, ఏక పౌరసత్వం ఏకీకృత న్యాయవ్యవస్థ ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని అత్యంత కేంద్రీకృత సమాఖ్య రాజ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రభుత్వం: బ్రిటన్ను అనుసరించి కేంద్ర, రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. రెండు స్థాయిల్లో శాసన నిర్మాణ శాఖకు కార్య నిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది. రెండు స్థాయిల్లో రాజ్యాంగ అధినేత, ప్రభుత్వ అధినేత వేర్వేరుగా ఉంటారు. బ్రిటన్ పార్లమెంట్ను ‘పార్లమెంట్లకు మాత’ అని పిలుస్తారు. ఏక పౌరసత్వం: పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని అంటే దేశ పౌరసత్వాన్ని మాత్రమే కల్పించారు. పౌరులకు అన్ని రకాల హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అమెరికా, స్విట్జర్లాండ్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది. మన దేశంలో జమ్మూకాశ్మీర్లో మాత్రమే ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ: మన రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వయం ప్రతిపత్తి న్యాయశాఖ అంటే శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించకుండా స్వతంత్రంగా పనిచేయడం. ఈ తరహా న్యాయ వ్యవస్థకే న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు కారణాలు: 1. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం 2. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం 3. రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ 4. {పాథమిక హక్కుల పరిరక్షణ సార్వజనీన వయోజన ఓటుహక్కు: భారత పౌరులందరికీ నిబంధన 326 ప్రకారం కుల, మత, లింగ, ప్రాంత, ఆస్తి, భాష మొదలైన ఎలాంటి విభేదాలు లేకుండా నిర్ణీత వయసు దాటిన వారందరికీ ఓటుహక్కును కల్పించారు. ఓటింగ్ వయోపరిమితిని 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ప్రాథమిక హక్కులు: వ్యక్తి పరిపూర్ణ వికాసానికి తోడ్పడే అవకాశాలే హక్కులు. ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించి, ఐఐఐవ భాగంలో చేర్చారు. 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు వీటి గురించి వివరిస్తున్నాయి. మొదట 7 ప్రాథమిక హక్కులు కల్పించారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. ఆదేశిక సూత్రాలు: భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, ఉత్తమ రాజ్యంగా నిర్మించేందుకు రాజ్యాంగంలోని ఐగవ భాగంలో ఆదేశిక సూత్రాలను చేర్చారు. 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు వీటి గురించి తెలియజేస్తాయి. వీటిని అమలు చేయాలని రాజ్యాంగం ప్రభుత్వాలను ఆజ్ఞాపిస్తుంది. ప్రాథమిక విధులు: స్వరణ్సింగ్ కమిటీ సిఫారసు మేరకు 10 ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐగ(అ)లో చేర్చారు. వీటి గురించి నిబంధన 51 (అ) తెలుపుతుంది. 2002లో 86వ సవరణ ద్వారా పదకొండో ప్రాథమిక విధిని చేర్చారు. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు 1. {పభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు? 1) ఆదేశిక సూత్రాలు 2) ప్రాథమిక హక్కులు 3) మానవ హక్కులు 4) శాసన సూత్రాలు 2. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో చేర్చినవి? 1) సామ్యవాద, లౌకిక 2) ప్రజాస్వామిక 3) సార్వభౌమ 4) రిపబ్లిక్ 3. కొత్త రాష్ర్టం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ను సవరించాలి? 1) గ 2) ఐఐ 3) ఐ 4) ఐఐఐ 4. భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్నిచ్చింది? 1) ఆర్టికల్ - 356 2) ఆర్టికల్ - 368 3) ఆర్టికల్ - 359 4) ఆర్టికల్ - 357 5. భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అనే భావనని ఎక్కడ పొందుపర్చారు? 1) ప్రాథమిక హక్కులు 2) పీఠిక 3) రాజ్యవిధానం ఆదేశిక సూత్రాలు 4) నాలుగో షెడ్యూల్ 6. కిందివాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు? ఎ) కఠిన రాజ్యాంగం బి) ద్వీసభ విధానం సి) సి.ఎ.జి. కార్యాలయం డి) సమష్టి బాధ్యత 1) ఎ, బి, సి 2) ఎ, డి 3) ఎ, బి, సి, డి 4) ఎ, బి సమాధానాలు 1) 1; 2) 1; 3) 3; 4) 2; 5) 3; 6) 4. మాదిరి ప్రశ్నలు 1. పవేశికను రాజ్యాంగానికి ఒక ఆభరణంగా వర్ణించింది ఎవరు? 1) జస్టిస్ హిదయతుల్లా 2) అంబేద్కర్ 3) మహాత్మాగాంధీ 4) ఠాకూర్ దాస్ భార్గవ 2. పవేశిక ప్రకారం అధికారానికి మూలం ఎవరు? 1) పార్లమెంట్ 2) ప్రజలు 3) రాష్ర్టపతి 4) సుప్రీంకోర్టు 3. పవేశికకు సంబంధించి సరికానివి? 1) ప్రజాస్వామ్యం - అమెరికా 2) గణతంత్ర - ఫ్రాన్స 3) సామ్యవాదం - రష్యా 4) లౌకిక - బ్రిటన్ 4. పవేశిక ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది? 1) 15-8-1947 2) 26-11-1949 3) 26-1-1950 4) 24-1-1950 5. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) అమెరికా 2) ఆస్ట్రేలియా 3) ఫ్రాన్స 4) దక్షిణాఫ్రికా 6. రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలు? 1) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం 2) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం 3) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం 4) సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం సమాధానాలు 1) 4; 2) 2; 3) 4; 4) 2; 5) 1; 6) 3. -
ప్రత్యేక నియోజకవర్గాల పితామహుడెవరు?
రాజ్యాంగం అనేది ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని తెలియజేసే ఒక మౌలిక శాసనం. ఇదే దేశ పరిపాలనా విధానానికి, రాజకీయ స్వరూపానికి మూలాధారం. రాజ్యాంగం భావన, దీని సర్వోన్నతి గురించి మొదటగా అరిస్టాటిల్ శాస్త్రీయంగా వివరించారు. ఈయనను రాజకీయశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. రాజ్యాధికారాన్ని నియంత్రించి, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటం రాజ్యాంగం ప్రధాన కర్తవ్యం. భారత రాజ్యాంగ అభివృద్ధి భారత రాజ్యాంగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎందరో ప్రముఖుల ఆలోచనలు, నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విదేశీ రాజ్యాంగాల ఆధారంగా మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అనేక బ్రిటిష్ చట్టాలు కూడా దీని నిర్మాణంపై ప్రభావం చూపాయి. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాణానికి ఆధారమైన వివిధ చట్టాలు, వాటి నుంచి గ్రహించిన అంశాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధీకరిస్తూ ఈ చట్టాన్ని చేశారు. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని ఏర్పాటు చేసి, మొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్సను నియమించారు. సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రతిపాదించారు. 1774లో ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1784 పిట్ ఇండియా చట్టం రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవ రిస్తూ దీన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా బోర్డ ఆఫ్ కంట్రోల్, బోర్డ ఆఫ్ డెరైక్టర్స విధానాన్ని ఏర్పాటు చేసి, ద్వంద్వ పాలనకు నాంది పలికారు. కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు. 1793 చార్టర్ చట్టం గవర్నర్ జనరల్ అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీ ఉద్యోగులకు భారతదేశ ఆదా యం నుంచి జీతభత్యాలు చెల్లించడం ప్రారం భించారు. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో విద్యాపరమైన అధ్యయ నం కోసం బడ్జెట్లో లక్షరూపాయలు కేటాయించారు. క్రిస్టియన్ మిషనరీలకు భారతదేశంలో ప్రవేశం కల్పించారు.వ్యాపారం చేసుకునేందుకు మరికొన్ని సంస్థలకు అవకాశం కల్పించారు. 1833 చార్టర్ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ను ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. మొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటింక్ను నియమించారు. శాసనాలను క్రోఢీకరించడానికి లార్డ మెకాలె అధ్యక్షతన మొదటి ‘లా’ కమిషన్ను నియమించారు. ఇది రూపొందించిన సీపీసీ 1859 నుంచి, ఐపీసీ 1860 నుంచి, సీఆర్పీసీ 1861 నుంచి అమల్లోకి వచ్చాయి. 1853 - చార్టర్ చట్టం దీని ఆధారంగా సివిల్ సర్వీసుల నియామకాల్లో బహిరంగ పోటీ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. 1858 - విక్టోరియా మహారాణి ప్రకటన (భారత రాజ్యాంగ చట్టం) 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. దీని ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను‘వైస్రాయ్ ఆఫ్ ఇండియా’ గా మార్చి, మొదటి వైస్రాయ్గా లార్డ కానింగ్ను నియమించారు. బ్రిటిష్ మహారాణి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శిగా చార్లెస్ ఉడ్ను నియమించారు. ద్వంద్వ పాలన విధానాన్ని రద్దు చేశారు. 1861- కౌన్సిల్ చట్టం పరిపాలన సౌలభ్యంకోసం పోర్టుపోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు. వైస్రాయ్కి అవసరాన్ని బట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే, ఆర్డినెన్సలను జారీ చేసే అధికారాలను కల్పించారు. 1892- కౌన్సిల్ చట్టం 1861 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సరిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి లోనై దీన్ని రూపొందించారు. కేంద్ర శాసన సభలో అనధి కార సభ్యుల సంఖ్య 10 నుంచి 16కు మధ్య, రాష్ర్ట శాసనసభలో 8 నుంచి 20 మధ్య నిర్ణయించారు. బడ్జెట్పై చర్చించే అధికారం కల్పించారు. కొన్ని అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించారు. 1909 మింటో- మార్లే సంస్కరణల చట్టం 1892 చట్టంలోని లోపాలను సరిచేస్తూ, మితవాదులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చట్టాన్ని చేశారు. దీని ద్వారా కేంద్ర, రాష్ర్ట శాసన మండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలోకి ఒక భార తీయుడిని సభ్యునిగా తీసుకున్నారు. కేంద్ర, రాష్ర్ట శాసనమండళ్లలో కొన్ని పరిమిత అంశా లపై ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించారు. శాసన మండళ్లకు పోటీచేసే అభ్యర్థులకు అర్హతలను నిర్ణయించారు. 1919 మాంటెక్-ఛెమ్స్ఫర్డ సంస్కరణల చట్టం ఈ చట్టం భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాదులు వేసింది. దీని ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ర్ట బడ్జెట్ను వేరుచేశారు. సిక్కులకు మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. పోటీ పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు. 1935 భారత ప్రభుత్వ చట్టం లార్డ లిన్ లిత్గో నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది అతిపెద్ద చట్టం. దీంట్లో 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి. ఈ చట్టమే మన రాజ్యాంగానికి మూలాధారం. ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ముఖ్య అంశాలు: 1. పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం 2. కేంద్రంలో ద్వంద్వ పాలన 3. సమాఖ్య ప్రభుత్వం 4. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన (కేంద్ర జాబితా 59 అంశాలు, రాష్ర్ట జాబి తా - 54 అంశాలు, ఉమ్మడి జాబితా-36 అంశాలు) 5. 6 రాష్ట్రాల్లో (అప్పటి వరకు ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్య 11) ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. 6. షెడ్యూల్ కులాలవారికి ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు. 7. ఓటు హక్కును విస్త ృత పరిచి, 10 శాతం జనాభాకు ఓటు హక్కు కల్పించారు. 8. ఇండియా నుంచి బర్మాను వేరుచేశారు. 9. ఆర్థిక అంశాలను క్రమబద్ధీకరించడానికి రిజర్వు బ్యాంక్ను స్థాపించారు. 10. అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు చేశారు. 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్తో పాటు భారత్ కూడా పాల్గొంటుందని ప్రకటించగా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 1940లో ఆగస్టు ప్రతిపాదన చేశారు. దీనిపైనా తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో 1942 క్రిప్స్ ప్రతిపాదనలు వెలువడ్డాయి. ఇది కూడా భారతీయుల ఆగ్రహానికి గురైంది. వేవెల్ ప్రకటన- 1945 దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని అంశాలపై అధికారాలను భారతీయులకు బదిలీ చేస్తామని, బ్రిటిషర్ల ప్రయోజనాలను కాపాడేందుకు హై కమిషనర్ను నియమిస్తామని పేర్కొన్నారు. ై వైస్రాయ్ కార్య నిర్వాహక వర్గం జాతీయ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని ప్రకటించారు. 1946- క్యాబినెట్ మిషన్ బ్రిటన్ ప్రధాని అట్లి ప్రకటన మేరకు 1946 మార్చిలో ముగ్గురు సభ్యులతో ‘క్యాబినెట్ మిషన్’ను ఏర్పాటు చేశారు. దీని సిఫారసుల ఆధారంగా 1946 నవంబర్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. ఇది సుమారుగా మూడేళ్లు శ్రమించి భారత రాజ్యాంగాన్ని నిర్మించింది.