breaking news
justice bhosale
-
‘లోక్పాల్’ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్పాల్ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది. ప్రజా సేవకుల అవినీతి కేసులను విచారించేందుకు లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2019, మార్చిలో లోక్పాల్ మొదటి చైర్మన్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణం చేశారు. జస్టిస్ దిలీప్ బి.బొసాలేతో పాటు జస్టిస్ పీకే మహంతి, జస్టిస్ అభిలాష్ కుమారి, జస్టిస్ ఏకే త్రిపాఠి సభ్యులుగా నియమితులయ్యారు. తాజాగా జస్టిస్ దిలీప్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
దశాబ్దాల సంప్రదాయానికి హైకోర్టు ముగింపు
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న కాజ్లిస్ట్ (విచారణ కేసుల జాబితా) ముద్రణ సంప్రదాయానికి హైకోర్టు ముగింపు పలికింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కాజ్లిస్ట్ ముద్రణను ఈ నెల 13 నుంచి నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తద్వారా హైకోర్టుకు ఏటా కోట్ల రూపాయల మేర డబ్బు ఆదా కానున్నది. కాజ్లిస్ట్ కావాలనుకునే న్యాయవాదులు సంబంధిత ముద్రణ సంస్థను ఆశ్రయించి డబ్బు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు నుంచే హైకోర్టులో కాజ్లిస్ట్ ప్రచురణ ఉంది. ఏ న్యాయమూర్తి వద్ద ఈ కేసు ఉంది.. ఏ సీరియల్ నంబర్లో ఉంది.. తదితర వివరాలన్నీ కూడా ఈ కాజ్లిస్ట్లో ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత హైకోర్టు విస్తృతం కావడంతో ఆ మేర కాజ్లిస్ట్ల ముద్రణ కూడా పెరిగింది. అప్పటి నుంచి అవసరాలను బట్టి కాజ్లిస్ట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం హైకోర్టు 2,170 కాపీల కాజ్లిస్ట్లను ముద్రించి, వాటిని ఉచితంగా న్యాయవాదులకు అందజేస్తోంది. అయితే వాటిని న్యాయవాదులకు వారి వారి ఇళ్ల వద్ద అందజేసినందుకు నామమాత్రంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తోంది. నెలకు కాజ్లిస్ట్ ముద్రణ కోసం హైకోర్టు రూ.15 లక్షలు వెచ్చిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1.80 కోట్లు ముద్రణ సంస్థకు చెల్లిస్తోంది. ప్రతి ఏటా హైకోర్టులపై ఈ కాజ్లిస్ట్ల ముద్రణ వ్యయం భారం పెరుగుతూ ఉండటంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రత్యేకంగా చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం, దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండటంతో కాజ్లిస్ట్ల ముద్రణకు స్వస్తి పలకాలని మూడేళ్ల క్రితమే ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మన హైకోర్టులో సైతం కాజ్లిస్ట్ల ముద్రణ ఉపసంహరణ ప్రతిపాదనను రిజిస్ట్రీ వర్గాలు తీసుకురాగా న్యాయవాదులు వ్యతిరేకించారు. దీంతో కాజ్లిస్ట్ల ముద్రణ ఉపసంహరణ నిర్ణయం అమలు జరగలేదు. జస్టిస్ బొసాలే చొరవతో... అయితే జస్టిస్ దిలీప్ బి.బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ ఆ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. న్యాయవాద సంఘాలతో చర్చ జరిపిన జస్టిస్ బొసాలే చివరికి వారిని ఒప్పించారు. దీంతో ఈ నెల 13 నుంచి కాజ్లిస్ట్ల ముద్రణను నిలిపేస్తున్నట్లు హైకోర్టు అధికారిక ప్రకటన జారీ చేసింది. అయితే హైకోర్టు యథాతథంగా కాజ్లిస్ట్ను తయారు చేసి దానిని తన వెబ్సైట్లో ఉంచుతుంది. కక్షిదారులతో సహా ఎవరైనా కూడా ఆ కాజ్లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హైకోర్టు తన స్వీయ అవసరాల కోసం 230 కాజ్లిస్ట్ కాపీలను కాపీకి రూ.95 చొప్పున చెల్లించి ముద్రణ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. -
అలహాబాద్ సీజేగా జస్టిస్ బొసాలే బదిలీ
-
రోజా సస్పెన్షన్: మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ఎమ్మెల్యే రోజా విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సర్కారు తరఫున దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం తన నిర్ణయం వెలువరించింది. సింగిల్ బెంచ్ ఎదుట కౌంటర్ దాఖలు చేయాలని రోజాకు సూచించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం నాడు హైకోర్టులో రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, శాసన వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.పి.రావు 6 గంటల పాటు తమ వాదనలు వినిపించారు.