breaking news
Jai bholo telangana
-
గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?
ప్రజా గాయకుడు గద్దర్(74) కన్నుమూశారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మాజీ నక్సలైట్, రాజకీయ నాయకుడు అయిన గద్దర్.. ఇప్పటి జనరేషన్కు తెల్లని జుట్టు, భుజంపై కండువాతో కనిపించే ఓ వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఈవెంట్ ఏదైనా గానీ దాదాపు ఇదే గెటప్లో కనిపించేవారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్? గద్దర్ పాటల్లో 'బండెనక బండి కట్టి', 'మల్లె తీగకు', 'పొడుస్తున్న పొద్దుమీద' గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే ఇవన్నీ సూపర్హిట్స్. వీటితోపాటు గద్దర్ చాలా పాటలు ఆలపించారు. ఈ సాంగ్స్ ప్రతిదానిలోనూ ఉండే సాహిత్యం.. సామాన్యుడికి అర్థమవుతూనే, మంచి ఊపు తీసుకొచ్చేలా ఉంటుంది. అందుకే ఎన్నేళ్లయినా సరే గద్దర్ పాటలు బోర్ కొట్టవు. అవి మన నుంచి దూరం కావు. (ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!) గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి..' అనే పాట చాలా స్పెషల్. ఎందుకంటే 1979లో అంటే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి కొన్నాళ్లు ఉందనగా ఈ పాట పాడారు. 'మా భూమి' సినిమలోని ఈ సాంగ్.. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఇక 1995లో స్వయంగా రాసిన 'మల్లె తీగకు..' సాంగ్ అయితే ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని తెచ్చిపెట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా) ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 'పొడుస్తున్న పొద్దుమీద..' అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కూడా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్గా ఈయన నంది అవార్డ్ అందుకోవడం విశేషం. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. గద్దర్ పాటల్లో ఈ మూడు చాలా స్పెషల్. వీటితో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది మాత్రమే నిజం. (ఇదీ చదవండి: హీరోయిన్గా మారిన ‘రాజన్న’ చైల్డ్ ఆర్టిస్ట్) -
వెండితెరపై నా తెలంగాణ
ఎన్.శంకర్... తెలంగాణ సినీ దర్శకుడు. ఎన్కౌంటర్ వంటి సూపర్ హిట్ సినిమాతో మొద లైన ఆయన ప్రస్థానం...విభిన్న చిత్రాలతో ఉవ్వెత్తుకు ఎగసింది. ‘జైబోలో తెలంగాణ’తో లబ్దప్రతిష్టుడైన ఆయన వెండితెరపై నవ తెలంగాణ ఎలా ఉండాలో ఇలా విశ్లేషిస్తున్నారు... తెలుగు జాతి రెండుగా విడిపోయినా సినిమా రంగం మాత్రం ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని సినీ నిర్మాతలు భావిస్తున్నారు. ఒకప్పుడు మద్రాసు నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినీ పరిశ్రమ నడిచింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినా పరిశ్రమ మాత్రం హైదరాబాద్ నుంచే కొనసాగుతుందని నిర్మాతలు, కళాకా రులు భావిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, కళలను, భాషను, వ్యక్తిత్వాన్ని గౌరవించే సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణకు చెందిన చాలామంది కళాకారులకు అలాంటి అవకాశాలు రాలేదన్న భావన ఉంది. తరగని సాహిత్య సంపదకు నిలయం తెలంగాణలో కథలు, కథాంశాలు కోకొల్లలు. సాంస్కృతిక చరిత్ర అధికం. వీరగాధలు చాలా ఉన్నాయి. కథలకు ఉపయోగపడే ముడిసరుకు తెలంగాణలో ఎక్కువగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అనేక కథాంశాలను తీసుకుని సినిమాలు నిర్మించే వీలుంది. ఇప్పటివరకు రాయలసీమ ఫ్యాక్షన్, కోస్తాంధ్ర కథాంశాలతోనే సినిమాలు వచ్చాయి. తెలంగాణ పోరాటం నేపథ్యంతో వచ్చిన సినిమాలు పెద్దగా లేవు. తెలంగాణలో సాహిత్య చైతన్యం, రచయితల సృజనాత్మకత అద్భు తం. హాస్యం, డ్రామా, ఉద్వేగం, చరిత్ర, సమ్మక్క-సారక్క, రుద్రమదేవి వీరగాధలు ఉన్నాయి. వందల సినిమాలకు ఉపయోగపడే కళా సంపద ఇక్కడ ఉంది. 120 రకాల కళలు తెలంగాణలో ఉన్నాయి. అందులో 25 కళలు ఇంకా బతికున్నాయి. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకమైన కళా సంస్కృతి ఉంది. వాటన్నింటినీ సినిమాగా రూపొందించే కార్యాచరణ జరగాలి. మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలి ప్రస్తుత సినిమా భవిష్యత్ దళారుల చేతుల్లో చిక్కుకుపోయింది. సినిమా ఎన్ని రోజులు ఆడాలో కూడా వారే నిర్ణయిస్తున్నారు. కొన్ని సినిమాలకు మొదట్లో పెద్దగా ఓపెనింగ్స్ లేకున్నా టాక్ను బట్టి క్రమంగా కలెక్షన్లు పెరుగుతాయి. కానీ దళారులు మాత్రం మొదట్లో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా హాలు అద్దె వృథా అని ఆ సినిమాను ఎత్తివేస్తున్నారు. ఇది చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోంది. సినిమా హాళ్లను దళారులకు లీజుకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సినిమా భవితవ్యాన్ని దళారులు నిర్ణయించడం తగ దు. సినిమా తలరాత వారి చేతుల్లో ఉండడం పరిశ్రమకు మంచిది కాదు. కాబట్టి పాత విధానంలోలా మూడంచెల వ్యవస్థ రావాలి. అప్పుడే తెలంగాణ సినిమాకు భవిష్యత్ ఉంటుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చాక తామూ హీరో, హీరోయిన్లు అవ్వొచ్చని, సాంకేతిక నిపుణులుగా ఎదగొచ్చని యువతీ యువకులు కలలు కంటున్నారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణానికి ముందు నిర్వహించిన ఆడిషన్ టెస్ట్కు పదివేల మందికిపైగా వచ్చారు. ఆడిషన్కే మూడు నెలలు పట్టింది. దీనిని బట్టి ఎంతమంది ఔత్సాహికులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతటి కళాకారుడైనా శిక్షణ లేనిదే రాణించలేడు. కాబట్టి ప్రభుత్వమే హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలి. చెన్నై, పుణెల్లో ప్రభుత్వ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లున్నాయి. చెన్నై ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలు శిక్షణ తీసుకున్నారు. ఇక తెలంగాణ కళాకారులు తీసే సినిమాలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు కల్పించాలి. ఒకప్పుడు లండన్లో సినిమా షూటింగ్ జరిగినా రాయితీ ఇచ్చేవారు. అలాగే గుజరాతీ, భోజ్పురి భాషల్లో తీసే సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రాయితీలు ఇచ్చేవారు. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళ టైటిల్ పెట్టిన సినిమాలకు పన్ను రాయితీ కల్పించారు. అగ్రహీరో రజనీకాంత్ సినిమా ‘రోబో’ను తమిళ పేరు ‘ఎందిరన్’ (యంత్రం) అని తమిళ టైటిల్ పెట్టినందుకే కరుణానిధి పన్ను రాయితీ కల్పించారు. సబ్సిడీ, పన్ను రాయితీ ఇస్తే సినిమాలు తీసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. నవ తెలంగాణ: పోల్కేక టీకొట్టు వ్యాఖ్య ఎండలకు జనం ఫ్యాన్గాలిని కోరుకుంటున్నారు. కొత్త సామెత కొట్టక్కరలేదు, తిట్టక్కరలేదు కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాడే కాలిపోతాడు. మాటకు మాట కొత్తవారికి పగ్గాలిస్తాం - రఘువీరారెడ్డి పగ్గాలు సరే, గుర్రమెక్కడిది? మాజీ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన టైర్లు, గేర్లు లేని బస్సులో యాత్రకు బయలుదేరింది మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన పాటలు అయ్యయ్యో చేతిలో పవర్ పోయెనే అయ్యయ్యో పార్టీ ఖాళీ ఆయెనే ఢిల్లీయే మాయ, సోనియానే మాయ కాంగ్రెస్లో సారమింతేనయా! సమైక్యాంధ్ర పార్టీ నినాదం పోటీచే స్తే పోయేదేమీ లేదు డిపాజిట్లు తప్ప పిట్ట కథ ఒక ముసలిపులి ‘పథకాలు’ అనే చంద్రహారాన్ని చేతిలో పట్టుకుని దారిన పోతున్న ఓటర్ని పిలిచింది. ‘నా దగ్గరికి వస్తే ఈ హారం నీదే’ అని చెప్పింది. ‘అయ్యా, చంద్రపులి, హారానికి ఆశపడితే నీకు ఆహారంగా మారుతానని నాకు తెలుసు’ అని వెళ్లిపోయాడు. నీతి: పథకాలు కూడా ఒక పథకమే - జి.ఆర్.మహర్షి