breaking news
Internet facilities
-
పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్ డివైడ్’
సాక్షి, హైదరాబాద్: భారత్లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్ డివైడ్ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్షనం అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. డిజిటల్ విప్లవం అనేది వివిధ రూపాల్లో విస్తరించడంతో అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు స్మార్ట్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఆధునిక సాంకేతికతను పట్టణ, గ్రామీణ తేడాలు లేకుండా ఉపయోగించుకోగలుగుతున్నారు. 95.1 శాతం కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతం, పట్టణాల్లో 97.1 శాతం) టెలిఫోన్/ మొబైల్ సౌకర్యాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంతో పోలి్చతే..ఇది మెరుగైన పరిస్థితి కాగా, మొబైల్ టెక్నాలజీ వినియోగంలో రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యఉన్న చిన్న వ్యత్యాసం కూడా చెరిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించిన కాంప్రహెన్సివ్ అన్యూవల్ మాడ్యువల్ సర్వేలో అనేక అంశాలు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్, నికోబార్లోని కొన్ని గ్రామాల్లో మినహా దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 3,02,086 కుటుంబాలను (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) కలిశారు. మొత్తంగా 12,99,988 (గ్రామాల్లో 7,85,246 మంది, పట్టణాల్లో 5,14,742 మంది) మంది నుంచి వివరాలు సేకరించారు.మొబైల్, ఇంటర్నెట్ వినియోగం, ఐసీటీ స్కిల్స్, ఔట్ ఆఫ్ ప్యాకేట్ మెడికల్ ఎక్స్పెండీచర్, విద్య తదితర అంశాలపై ఈ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా 95.7 శాతం గ్రామీణ యువత (పట్టణాల్లో 97 శాతం) మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. 15–25 ఏళ్ల మధ్యనున్న గ్రామీణ యువత 82 శాతం (పట్టణాల్లో 92 శాతం) ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు ⇒ 15–24 ఏజ్ గ్రూప్లో 78.4 శాతం యువత అటాచ్డ్ఫైల్స్తో మెసేజ్ పంపగలుగుతున్నారు. ఈ వయసులోని వారే 96.9 శాతం (వీరితో పురుషులు 97.8%, మహిళలు 95.9%) చదవడం, రాయడంతో పాటు సాధారణ ⇒ గణాంకాలు చేస్తున్నారు. 71.2 శాతం మంది కాపీ అండ్ పేస్ట్ టూల్స్ వినియోగిస్తున్నారు. 26.8 శాతం మాత్రమే ఆన్లైన్ సెర్చ్, ⇒ ఈ–మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంక్ నిర్వహణ చేయగలుగుతున్నారు. దేశంలో 9.9 శాతం కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 21.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం) డెస్్కటాప్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు కలిగి ఉన్నారు. ⇒ 18 ఏళ్లకు పైబడిన వారిలో 94.6 శాతం మందికి వ్యక్తిగత, ఉమ్మడి బ్యాంక్ ఖాతా, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్లో అకౌంట్, మొబైల్ మనీ సరీ్వస్ ప్రొవైడర్ ఖాతా కలిగి ఉన్నారు. ⇒ తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి 500 మీటర్లలోపు దూరంలోనే లోకెపాసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సు,కారు, టాక్సీ, ఆటో వంటివి) సౌకర్యాలు 93.7 శాతం పట్టణ ప్రాంత జనాభాకు అందుబాటులో ఉన్నాయి. -
నాలుగేళ్లలో నాలుగు రెట్లు
భారత్లో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరు ఆర్ఎన్సీఓఎస్ నివేదిక వెల్లడి గౌహతి: భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరుగా దూసుకుపోతోంది. నాలుగేళ్లలో ఈ మార్కెట్ నాలుగు రెట్ల వృద్ధిని సాధిస్తుందని రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ఆర్ఎన్సీఓఎస్ అంచనా వేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం..., భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ 2014-18 కాలానికి 40-45 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. ప్రస్తుతం 350 కోట్ల డాలర్లు (రూ.21,000 కోట్లు)గా ఉన్న ఈ మార్కెట్ 2018 నాటికి 1,450 కోట్ల డాలర్ల(రూ.88,000 కోట్లకు మించి)కు చేరుతుంది. డిజిటల్ విప్లవం కారణంగా భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్లోనే అన్లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడం, మొబైల్ ఇంటర్నెట్ విస్తరణ, సమయం కలసి వస్తుండడం, ఆన్లైన్లో షాపింగ్ చేయడం సులభంగా, సౌకర్యకరంగా ఉండడం, ఆన్లైన్లో భారీగా డిస్కౌంట్లు లభిస్తుండడం, స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్ షాపింగ్ సులభంగా చేసుకునే వీలుండడం, మహిళలు మరింతగా టెక్నాలజీని వినియోగిస్తుండడం, బ్రాండెడ్ ఉత్పత్తుల పట్ల మక్కువ పెరగడం, వంటి కారణాల ఈ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో దుస్తులు, పుస్తకాలు ఉన్నాయి. భవిష్యత్తులో దుస్తులు, సంబంధిత యాక్సెసరీలు అగ్రస్థానంలోకి వస్తాయి. ఇళ్ల అలంకరణ, ఫర్నీషింగ్స్ ఉత్పత్తుల విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి. చెల్లింపు విధానాలు, వస్తువులను రిటర్న్ చేసే విధానాలు సౌకర్యకరంగా ఉండడం వంటి అంశాల కారణంగా ఈ మార్కెట్ వృద్ధి మరింతగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం, ఆన్లైన్లో చెల్లింపు విధానాలపై కొంతమంది వినియోగదారులకు సందేహాలు తొలగకపోవడం వంటి సమస్యలున్నాయి.