breaking news
Halting trains
-
చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
కాకినాడ: ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్ -
ఆదాయం ఉన్నా.. అభివృద్ధి శూన్యం
- ప్రధాన స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కరువు - వరంగల్,కాజీపేటలో లిఫ్టులు లేవు - డోర్నకల్లో వేధిస్తున్న ప్లాట్ఫాం సమస్య - హామీలకే పరిమితమవుతున్న రైళ్ల హాల్టింగ్ సాక్షి, హన్మకొండ :‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది దక్షిణ మధ్య రైల్వేకు మన జిల్లా. వివరాల్లోకెళితే.. దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. నిత్యం వరంగల్ జిల్లా నుంచి సగటున రైల్వేకు *20లక్షలవరకు ఆదాయం సమకూరుతోంది. కానీ జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన వరంగల్, కాజీపేట, డోర్నకల్ మహబూబాబాద్, జనగామలలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణీకులు అవాక్కవుతున్నారు. 40వేల మంది రాకపోకలు జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి సగటున 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటికి పోస్టాఫీసు రిజర్వేషన్లు, ఆన్లైన్ రిజర్వేషన్లు కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్లలో రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా డెబ్భైవేలుగా ఉంది. తద్వారా ప్రతిరోజు జిల్లాలో సగటున *20 లక్షల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కానీ రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇబ్బందుల్లో ప్రధాన స్టేషన్లు ప్రధాన రైల్వేస్టేషన్లయిన వరంగల్, కాజీపేటలలో ఆదాయానికి తగ్గ అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట స్టేషన్లో సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. మూడు ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్న ఈ స్టేషన్లో ఒక్కటంటే ఒక్కటే బ్రిటిష్ హయంలో నిర్మిం చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండురైళ్లు రెండు ప్లాట్ఫారాల మీదకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కిక్కిరిసిపోతుంది. ఒకటో నంబరు ఫ్లాట్ఫారమ్ మీద నుంచి రెండు, మూడుఫ్లాట్ఫారమ్లకు చేరుకునేలోపు రైళ్లు వెళ్లిపోతున్నాయి. ఈ హాడావుడిలో ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పట్టాలు దాటి రైళ్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రెండేళ్ల కిందే కాజీపేట స్టేషన్కు రెండో ఫుట్ ఓవర్బ్రిడ్జితో పాటు వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టులు సైతం మంజూరు అయ్యాయి. అమలుకు నోచుకోని లిఫ్టుల పనులు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వరంగల్ స్టేషన్కు లిఫ్టు లు రెండేళ్ల కిందే మంజూరయ్యాయి. కానీ వాటి పనులు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు డోర్నకల్ జంక్షన్ ఏర్పాటులో జరిగిన లోపం వల్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా నేరుగా ప్రయాణికు లు ప్లాట్ఫారమ్ మీదకు చేరుకోలేరు. దానితో ఈ సమస్య ను నివారించేందుకు రెండేళ్ల కిందే స్టేషన్లో లక్షలాది రూపాయల వ్యయంతో కొత్తగా ఫ్లాట్ఫారమ్లు నిర్మించారు. రెం డేళ్లు గడుస్తున్నా ఈ ఫ్లాట్ఫారమ్ను ప్రారంభించడం లేదు. ఈ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి పదేళ్ల క్రితం ప్రారంభించిన కాజీపేటటౌన్ స్టేషన్పై రైల్వే అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సింగరేణి పాస్ట్ప్యాసింజర్, పెద్దపల్లి ప్యాసింజర్లు తప్ప మరోరైలుకు ఇక్కడ హాల్టింగ్ కల్పించడం లేదు. నగరంలో కలిసిపోయినట్లుగా ఉన్న హసన్పర్తిలో రైల్వేస్టేషన్లో సైతం ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలంటూ అనేక సార్లు రైల్వేశాఖకు వినతిపత్రాలు సమర్పించారు. కనీసం కరీంనగర్-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డోర్నకల్లో పద్మావతి, మహబాద్లో హౌరా, జీటీ, రఫ్తీసాగర్కు హాల్టింగ్ ఇవ్వాలి డోర్నకల్ రైల్వేస్టేషన్లో పద్మావతి, హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లకు మహబూబాబాద్లో గ్రాండ్ట్రంక్, రఫ్తీసాగర్ రైళ్లకు హాల్టిం గ్ ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ స్టేష న్లో రెండు, మూడోనంబరు ప్లాట్ఫారమ్లపై కనీసం మూ త్రశాలలు లేకపోవడం వల్ల ప్రయాణికలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భువనగిరి-సికింద్రాబాద్ల నడుమ నడుస్తోన్న మెమూ రైళ్లను జనగామ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది. సరిపడా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి జిల్లాలో ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్ల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ సరిపడా ఫుట్ఓటర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయా ప్రాంతాల్లోని ప్రయాణీకులు కోరుతున్నారు. కొన్ని సమయాల్లో టీసీల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. వీటితో పాటు కాజీపేట స్టేషన్లో బోడగుట్టను కలుపు తూ మరో బైపాస్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మిం చాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నారు. పిట్లైన్, అదనపు ప్లాట్ఫాంపై మెలిక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై పెరిగిపోతున్న భారాన్ని తగ్గించేందుకు కాజీపేట స్టేషన్ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా కాజీపేటలో ప్రస్తుతం ఉన్న నాలుగు, ఐదు ప్లాట్ ఫారమ్లకు బదులుగా కొత్తగా మూడో నంబరు ప్లాట్ఫారమ్కు సమాంతరంగా మరో రెండు ప్లాట్ఫారమ్లు నిర్మించాలని నిర్ణయించారు. రైళ్ల మెయింటనెన్స్లో భాగంగా అదనపు పిట్లైన్లు సైతం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. ఈలోగా రైల్వే అధికారులు కొత్త మెలికలు పెడుతున్నారు. కాజీపేట స్టేషన్ కొత్తిపిట్లైన్లు నిర్మించేందుకు అనువుగా లేదంటూ సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి పిట్లైన్లతో పాటు అదనపు ప్లాట్ఫారమ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాజీపేటకు పీఓహెచ్ దక్కేనా? ఓకే అయితే మూడు వేలమందికి ఉపాధి కాజీపేట రూరల్ : కాజీపేటలోని డిజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) అనుమతి కోసం రైల్వే కార్మికులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న పార్లమెంట్లో రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వేబడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గౌడ బడ్జెట్లో కాజీపేట జంక్షన్కు న్యాయం జరుగుతుందని కార్మికులు కోటి ఆశలతో ఉన్నారు. కాజీపేట ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ ఏర్పాటు చేస్తే రైల్వేలకు లాభంతో పాటు సుమారు మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక్కడ పీఓహెచ్ షెడ్లు లేకపోవడంతో రైల్వే అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. డీజిల్ లోకోషెడ్.. డీజిల్ లోకోషెడ్లో 142 డీజిల్ ఇంజిన్ల నిర్వహణ జరుగుతోంది. ఇందులో 800 మంది ైరె ల్వే కార్మికులు పని చేస్తున్నారు. డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా తిరుగుతున్న రైలు ఇంజిన్లకు ప్రతీ ఆరేళ్లకు ఒకసారి లేదా 60వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పీఓహెచ్ చేయాలి. పీఓహె చ్ అంటే ఇంజిన్ టాప్ తప్ప అన్ని భాగాలు విప్పి సర్వీస్ చేసేవిధానం. డీజిల్ ఇంజిన్లకు తమిళనాడులో గోల్డెన్రాఖ్, ఒడిషాలో ఖరగ్పూర్, పంజాబ్లో పాఠియాలలో పీఓ హెచ్లున్నాయి. కాజీపేటలో పీఓహెచ్ లేక డీజిల్ ఇంజిన్లను ఈ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రిక్ లోకోషెడ్.. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్లో 143 ఇంజిన్ల నిర్వాహణ జరుగుతోంది. ఇందులో 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ జీవిత కాలం 36 ఏళ్లు. మహారాష్ట్రలో బుసావల్, పశ్చిమబెంగాల్లో కంచీరపార, చెన్నైలో పెరంబూర్లోని పీఓహెచ్కు ప్రతీ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్రిక్ ఇంజిన్ను తీసుకెళ్లాలి. ఇక్కడ ఇంజిన్ను విప్పి మేజర్ సర్వీస్ చేస్తారు. రైల్వేకు లాభం.. నిరుద్యోగులకు ఉపాధి దక్షిణ మధ్య రైల్వేలో వందల కొలది డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు తిరుగుతున్నాయి. మనదగ్గర పీఓహెచ్ లేకపోవడంతో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను తీసుకెళ్తే 30 రోజుల్లో పీఓహెచ్ చేసి ఇవ్వాలని కార్మికులు అంటున్నారు. అయితే ఇప్పడు 50 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్క రోజుకు ఒక ఇంజిన్ నడవకుంటే రైల్వేకు రూ.2 లక్షలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇంత పెద్ద సంఖ్యలో ఇంజిన్లు నడవకుంటే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుంది. మన వద్ద నుంచి పీఓహెచ్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు 10 రోజుల వరకు సమయం పడుతుంది. అదికూడా ఖాళీగానే వెళ్లి రావలసి ఉంటుంది. లక్నోలో మాదిరిగా కాజీపేటలో డీజిల్షెడ్, ఎలక్ట్రిక్ షెడ్లను పీఓహెచ్లుగా చేస్తే రైల్వేకు లాభంతో పాటు ఉద్యోగాల అవకాశాలు పెరగడంతోపాటు, ఇంజిన్లకు కావల్సిన కాంపోనెంట్లు, ఆక్సిలరీ భాగాలకు చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పడి వే లాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు. -
పట్టాలేక్కేనా?
- రైల్వే బడ్జెట్లో ప్రతిసారీ జిల్లాకు నిరాశే - ప్రతిపాదనలకే పరిమితమైన పలు లైన్లు - ప్రాజెక్టులకు నిధుల కొరత - రైళ్ల హాల్టింగ్పై ఊసెత్తని కేంద్రం - పాత ప్రాజెక్టులకే ప్రాధాన్యమన్న రైల్వే మంత్రి సాక్షి, కరీంనగర్:కేంద్ర రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రతిసారీ మొండిచేయే మిగులుతోంది. దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వేలైన్లు అంగుళం ముందుకు కదలడం లేదు. కొత్త లైన్ల ఏర్పాటుప్రతిపాదనలకే పరిమితమవుతోంది. సూపర్ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కోసం స్థానికులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనలోనూ జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. ప్రతిసారి రైల్వే బడ్జెట్కు ముందు జిల్లా ఎంపీలు భారీగా ప్రతిపాదనలు చేస్తున్నా.. వాటిలో ఒక్క దానికి కూడా పూర్తిస్థాయిలో ఆమోదం లభించడంలేదు. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ ఈనెల 8న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రేపటి బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు ఉండబోవని, పాత ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి సదానందగౌడ శనివారమే స్పష్టం చేశారు. దీంతో ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టులకు నిధులు విడుదల అవుతాయా? లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు లోక్సభ సభ్యులు ఇప్పటికే రైల్వే బోర్డుకు తమ ప్రతిపాదనలు అందజేశారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ సర్కారు జిల్లాకు ఎలాంటి వరాలు కురిపిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. మనోహరాబాద్ లైన్కు గ్రీన్సిగ్నల్ ఎప్పుడో? కొత్తపల్లి-మనోహరాబాద్ (కర్ణాటక) వయా మేడ్చల్ మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ఈ లైన్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ.50 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. కనీసం సర్వే పనులు కూడా నిర్వహించలేదు. ఈ లైన్ నిర్మాణానికి కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరముంది. ఈ లైను పూర్తయితే ప్రయాణికులకు, వాణిజ్య రంగానికి మేలు కలగడమే కాకుండా రైల్వేకు కూడా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాగే సిరిసిల్ల, సిద్దిపేట ప్రజల కు రైలు అందుబాటులోకి వస్తుంది. జిల్లాకేంద్రం నుంచి రాజధానికి ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు. ఇందూరు చేరేదెన్నడో? జిల్లాలో 22 ఏళ్ల క్రితం సాక్షాత్తు అప్పటి ప్రధాని పీవీ.నరసింహారావు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి-నిజామాబాద్ (ఇందూరు) రైలు మార్గానికి పట్టుకున్న గ్రహణం వీడడం లేదు. ఈ మార్గానికి 1993 సంవత్సరంలో రూ.925 కోట్లతో పరిపాలనాపరమైన మంజూరు లభించింది. ఇప్పటివరకు 134 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం పూర్తయింది. నిధుల కొరతతో పనులు నత్తకేనడక నేర్పుతున్నాయి. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం కరీంనగర్ జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్లో 56 కిలోమీటర్ల పొడవుంది. ఏళ్లకేళ్లుగా జాప్యం జరగడం వల్ల అంచనా వ్యయం రెట్టింపయ్యింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు.