breaking news
grains marketing
-
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
ప్రా‘ధాన్య’మొచ్చే !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటకు తెగుళ్లు, దిగుబడి తగ్గిన కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ నామమాత్రంగానే ఉంటుందనుకున్నప్పటికీ..ఊహించని విధంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతేడాది కంటే అధికంగా కొనుగోలు చేసి..మరింత ముమ్మరంగా సేకరిస్తుండడం విశేషం. జిల్లాలో పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతుల సరుకుతో కళకళలాడుతున్నాయి. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి 48వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు తొలుత 91 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఈసారి దిగుబడి పడిపోయిందనే భావనతో మొత్తం 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలు 51 ఉండగా, ఐకేపీ కేంద్రాలు తొమ్మిది ఉన్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,323మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. గతేడాది 34,835మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గ్రేడ్– ఏ రకం క్వింటా ధర రూ.1590, కామన్ రకానికి రూ.1540గా నిర్ణయించారు. సుడిదోమ దెబ్బతో తగ్గిన దిగుబడి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖమ్మంజిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 60వేల హెక్టార్లలో వరిని సాగు చేశారు. ప్రతి ఏడాది ఎకరానికి 30నుంచి 32 బస్తాల దిగుబడి వచ్చేది. అయితే రైతులను ఈ ఏడాది సుడిదోమ దెబ్బతీయడంతో ఎకరానికి 6 నుంచి 8బస్తాల దిగుబడి తగ్గింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలను కూడా తగ్గించారు. కానీ..సేకరణ ఆశాజనకంగా ఉండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముందు నుంచే సన్నద్ధం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆ శాఖాధికారులు ముందు నుంచే దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం రైతులను చైతన్యపరిచారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా..1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అప్పుడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించగా గతేడాది కంటే ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నుల «ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 4,416మంది రైతుల నుంచి మొత్తం 39,323.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లయింది. అందులో గ్రేడ్ ఏ రకం– 32,103.760మెట్రిక్ టన్నులు, కామన్ రకం 7,219.280మెట్రిక్ టన్నుల «ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.62,23,48,624 చెల్లించాల్సి ఉంది. ఇందులో 4,259మంది రైతులకు రూ.61,80,86,124లు చెల్లింపులు చేయగా..157మంది రైతులకు సంబంధించిన రూ.42,62,500లు చెల్లించాల్సి ఉంది. 2016–17 వివరాలు ఇలా.. కొనుకోలు కేంద్రాలు 49 రైతులు 4,536 గ్రేడ్ ఏ రకం 24,955.903 మెట్రిక్ టన్నులు కామన్ రకం 9879.706 మెట్రిక్ టన్నులు మొత్తం కొనుగోళ్లు 34,835.609 గ్రేడ్ ఏ రకం క్వింటా ధర రూ.1,510 కామన్ రకం ధర రూ.1,470 చెల్లింపులు రూ. 52,20,65,813.50 -
ధాన్యం.. దైన్యం
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: అష్టకష్టాలు పడి రైతాంగం పండించిన ధాన్యం మార్కెటింగ్ సంక్షోభం అంచున నిలబడింది. గత ఖరీఫ్తో పోలిస్తే ఈ సీజన్లో రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి ధాన్యం వారం రోజుల్లో వెల్లువలా రానుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లకు ఏర్పాట్లు ఇంకా పూర్తి చేయలేదు. పైగా మద్దతు ధరపై సందిగ్ధం నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చే బాయిల్డ్(కామన్) ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం క్వింటాల్కు రూ. 1,315 గా, ఎ గ్రేడ్ ధాన్యం (సన్న రకం )కు రూ. 1,340 గా మద్దతు ధరను ప్రకటించింది. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో వరి పంట జోరుమీద ఉంది. సిద్దిపేటలోని మార్కెట్ జిల్లాలోనే అతి పెద్దది కావడం.. జిల్లాలోని 50 గ్రామాలతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం సిద్దిపేటకు రానుంది. ఈ క్రమంలో వ్యాపారులు ధాన్యం ధరలను క్రమంగా తగ్గిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా ఎఫ్సీఐ కామన్ రకాన్ని మాత్రమే ఖరీదు చేయాలని, సివిల్ సప్లయిస్ సంస్థ సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేయాలని ప్రభుత్వం కొత్తగా నిర్ణయించింది. ఇక ఐకేపీ కొనుగోలు కేంద్రాలు సన్నరకం ధాన్యాన్ని ఖరీదు చేసి కస్టమ్ మిల్లింగ్కు పంపాలని అధికారులు నిర్ణయించారు. ఏర్పాట్లు ఏవీ? సిద్దిపేట మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలు ధాన్యం ఖరీదు చేయడానికి ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదు. బార్దాన్, సుతిలీ సిద్ధం చేసుకోవడంతో పాటు హమాలీలను, రవాణా ఏర్పాట్లను, గ్రేడింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాలోస్తే టార్పాలిన్లు సైతం సిద్ధం చేసుకోవాలి. కాని అధికార యంత్రాంగం ఇందుకు సిద్ధం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపారులకు పరీక్షే.. ఈ ఖరీఫ్ సీజన్లో మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు ధాన్యం భారీగా దిగుమతి కానుంది. ఆయా రాష్ట్రాల్లో మద్దతు ధర నిబంధనలు లేకపోవడంతో తక్కువ ధరలకే ధాన్యం ఇక్కడికి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఈ నేఫథ్యంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర లభించడం కష్టం. రైతులు రోడ్డెక్కడం అనివార్యం. వెల్లువెత్తిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇప్పించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో వరి ధాన్యం సిద్దిపేట మార్కెట్ను ముంచెత్తే అవకాశాలు పొంచి ఉన్నాయి