-
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
కొత్త పాయింట్తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్తో కలిసి చిత్రాలయం స్టూడియోస్పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భీమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్
‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్లో మంచి వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్. మాళవికా శర్మ మాట్లాడారు. -
శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?
గోపీచంద్... కెరీర్ ప్రారంభంలో హిట్ల మీద హిట్లు కొట్టాడు. హీరోగా, విలన్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ రానురానూ ఈ హీరోకు అవకాశాలు తగ్గాయి. చేసిన నాలుగైదు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయితే ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ మాత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా పర్వాలేదనిపిస్తోంది. చూడగానే నచ్చేసింది తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ హీరో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనది ప్రేమ వివాహమని తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఒకసారి రేష్మ ఫోటో చూశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్సయ్యాను. తర్వాత ఆమె శ్రీకాంత్ మేనకోడలు అని తెలిసింది. అప్పటికే నాకు శ్రీకాంత్తో పరిచయం ఉంది కానీ ఈ విషయం డైరెక్ట్గా మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించింది. ఆయనే మధ్యవర్తిత్వం అందుకే నటుడు చలపతిరావు అంకుల్కు విషయం చెప్పాను. ఆయన మధ్యవర్తిత్వం చేశారు. శ్రీకాంత్తో మాట్లాడి పెళ్లి సెట్ చేశారు. ఆయనే పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకున్నారు. రేష్మ నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్.. టీషర్ట్' అని చెప్పుకొచ్చాడు. కాగా 2013లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీతారలతో పాటు రాజకీయప్రముఖులు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం గోపీచంద్- రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆమె ఎక్కడుంటే అక్కడ నాశనమే.. రెండో పెళ్లితో సంతోషంగా ఉన్నా.. -
క్లాప్స్.. విజిల్స్ పడుతూనే ఉన్నాయి
‘‘భీమా’ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ఎమోషన్ని అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ డిజైన్ చేశారు రామ్–లక్ష్మణ్ మాస్టర్స్. చివరి అరగంట థియేటర్స్లో ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్ పడుతూనే ఉన్నాయి. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరో గోపీచంద్. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ–‘భీమా’ లాంటి మంచి మూవీతో ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకునేలా చేసిన హర్షకి ధన్యవాదాలు. రాజీ పడకుండా సినిమాని గ్రాండ్గా నిర్మించిన రాధామోహన్, శ్రీధర్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మా భీమా’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘భీమా’లో ఇంటర్వెల్, క్లైమాక్స్లో ప్రేక్షకుల కేరింతలు చూసి సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఎ. హర్ష. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్ (ఫోటోలు)
-
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్కుమార్తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
గోపీచంద్ 'భీమా' టాక్ ఎలా ఉందంటే..
గోపీచంద్ హీరోగా నటించిన భీమా నేడు (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. భీమా భారీ యాక్షన్ మూవీ అని ఓవర్సీస్ ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ అవతారంలో గోపీచంద్ మెప్పించాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్కు ఈ సినిమా కాస్త రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్ కటౌట్గా తగ్ కథ భీమాతో కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లోగోపీచంద్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్లో గోపీచంద్ శివతాండవం చేశాడని నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్కు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత మేరకు తోడు కావడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. భీమా సినిమాకు ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్లు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ రేంజ్లో ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ పీక్స్కు వెళ్తుందని ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్కు ఆయన ఇచ్చిన ఎలివేషన్ బీజీఎమ్తోనే సినిమాకు మేజర్ ప్లస్ అయిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా రికార్డుకెక్కింది. భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఫ్యాన్స్కు మాత్రం భీమాతో బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చాడని తెలుపుతున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని గ్యారెంటీగా భీమా మెప్పిస్తుందని కామెంట్ల చేస్తున్నారు. @YoursGopichand Nee Cutout Ki Padalsina Cinema Ani Strong Feeling 🔥 Expecting Macho Star Mass Blockbuster#BHIMAA #BhimaaFromToday pic.twitter.com/tqV9dTnFLS — ST (@Iconic_Powerism) March 7, 2024 INSIDE INFO : #BHIMAA - INTERVAL IS GOOD & CLIMAX IS MAJOR HIGHLIGHT OF THE FILM 🔥🔥🔥🔥🔥#Gopichandh pic.twitter.com/CFKRcFYn6X — GetsCinema (@GetsCinema) March 7, 2024 interval ❌ climax🥵🥵🥵#BhimaaFromToday #BHIMAA pic.twitter.com/0Bo9uiZVoA — Santhosh (@Santhosh_offl8) March 8, 2024 The Backbone Of The Film @RaviBasrur .... You're One Of The Reason To Witness #BHIMAA .... Definitely Your Music Gonna Resound More 🔥❤️🔥💥🔥❤️🔥💥 declaring MASSive Blockbuster in advance #BHIMAA#Gopichand #BHIMAA @BhimaaMovie pic.twitter.com/TjajnXcVR1 — Surya Sujith (@ntrfansujith) March 7, 2024 Telugu audience always failed to encourage our gem of actors like #gopichand films like sahasam, okkadunnadu & Gautham nanda deserved so much love. Unfortunately Telugu audience were busy praising other language films. #bhimaa #Gaami pic.twitter.com/EIVkV0TtBH — Theinfiniteview (@theinfiniteview) March 8, 2024 -
Bhimaa: ఎమోషన్.. ఎలివేషన్.. ఎంటర్టైన్మెంట్తో పాటు సందేశం
‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా సరే థియేటర్స్లో ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. సో... ఆడియన్స్ను ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎలివేషన్.. ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్ వేవ్ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్లైన్లో గోపీచంద్గారికి ‘భీమా’ స్టోరీలైన్ చెప్పాను. ఆ తర్వాత ఫుల్ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్పైకి వెళ్లాం. గోపీచంద్గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రాధామోహన్గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’కు కొరియోగ్రాఫర్గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు. -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు: గోపీచంద్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'భీమా'. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో వరంగల్లోని హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. అందులో డౌటే లేదు ప్రీరిలీజ్ ఈవెంట్లో గోపీచంద్ మాట్లాడుతూ.. 'ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షను పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పను... కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు' అని చెప్పారు. ఆయన నవ్వుతోనే ఎనర్జీ.. దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. 'భీమాలో ఎనర్జీ పవర్ వుంది. గోపిచంద్ గారు ఎంతో అద్భుతమైన వ్యక్తి. చాలా హంబుల్గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి 8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. థియేటర్స్లో హై ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది' అన్నారు. రఘు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రమణ లంక, కళ్యాణ్ చక్రవర్తితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. చదవండి: సడన్గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. మరోవైపు పాత హీరోయిన్లు మెల్లమెల్లగా కనుమరుగు అవుతూనే ఉంటారు. ఫ్లాప్స్ పడ్డోళ్లు వెళ్లపోయారంటే ఓ అర్థముంది. కానీ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కొందరు బ్యూటీస్ సైడ్ అయిపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి స్టోరీనే. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల్నే పక్కనబెట్టేసింది. మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మూన్ మూన్ బెనర్జీ. కనీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన్నట్లు లేదే అని అనుకుంటున్నారా? కంగారూ పడకుండి. గోపీచంద్కి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'యజ్ఞం' గుర్తుందా? అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. కోల్కతాకు చెందిన మూన్ మూన్ బెనర్జీ.. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో తెలుగులో మూవీ చేసింది. మరి ఏమైందో ఏమో గానీ 'యజ్ఞం' తర్వాత తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ సినిమా చేయలేదు. సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా 'దోరీ' అనే సీరియల్లో నటిస్తోంది. అయితే టాలీవుడ్లో చేస్తున్నప్పుడు యుక్త వయసులో ఉంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనిపించలేదు. తాజాగా వయసు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇకపోతే 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Moon banerrjee (@moonbanerrjee) -
ప్రభాస్తో సినిమా? క్లారిటీ ఇచ్చిన మ్యాచో స్టార్
ఒకప్పుడు విలన్.. తర్వాత హీరో.. ఎన్నో సూపర్ హిట్స్ చూసిన గోపీచంద్ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతుండటంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. తన ఆశలన్నీ భీమా సినిమాపైనే పెట్టుకున్నాడు. కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 8న రిలీజ్ కానుంది. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్గా నటించారు. అలా చెప్పుకోవడం ఇష్టముండదు తాజాగా ఓ షోకి హాజరైన గోపీచంద్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు చాలామందిని చదివిస్తున్నావు.. ఎందుకని బయటకు చెప్పుకోవడం లేదు అని యాంకర్ అడిగాడు. అందుకు హీరో స్పందిస్తూ.. నాకలా చెప్పుకోవాలని ఉండదు. ఎవరైతే బాగా చదువుతారో వారికి సాయం చేద్దామనుకుంటాను. కొంతమందికైతే ఆ చదివించేది నేనేనని కూడా తెలియదు అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా వస్తుందా? అన్న ప్రశ్నకు.. కచ్చితంగా ఓ సినిమా చేస్తామని చెప్పాడు. కానీ అదెప్పుడు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. చదవండి: ఇప్పటికే మూడు ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి.. అయినా కోలుకోలేని స్థితిలో.. -
Bhimaa HD Photos: గోపీచంద్ ‘భీమా’ మూవీ స్టిల్స్
-
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
ట్రెండ్కి తగ్గట్లే 'భీమా' ట్రైలర్.. కాకపోతే ఆ విషయమే?
తెలుగు హీరోల్లో కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే మాట చాలా కాలమైంది. ఇలాంటి వాళ్లలో గోపీచంద్ ఒకడు. సిక్స్ ఫీట్ కటౌట్తో పాటు హీరోకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయి ఒక్క హిట్ తప్ప. దీంతో ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. అలా 'భీమా' చిత్రంతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'భీమా' ఫస్ట్ లుక్, టీజర్ అవి చూస్తే ఇది యాక్షన్ సినిమా అని అర్థమైంది. తాజాగా ట్రైలర్తో ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఓ ఊరు, అందులో విలన్స్, హీరో పోలీస్, కొన్ని సమస్యలు వస్తాయి. హీరో వాటిని ఎలా ఎదిరించాడు? ఈ కథలో ఇంకో గోపీచంద్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. మరి ఇద్దరు గోపీచంద్లా? లేదా ఒకడే ఇద్దరా అనేది సినిమా వస్తే తెలుస్తోంది. ట్రైలర్ పరంగా చూస్తుంటే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు డివోషనల్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో ఉంది. అయితే ట్రైలర్లోనే చాలావరకు స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. దీనిబట్టి చూస్తుంటే సినిమాలోనూ ఫైట్ సీన్స్, స్లో మోషన్ షాట్స్ లాంటివి గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయితే 'భీమా'లో దీన్ని మించి ఏముంటుందనేది చూడాలి. అలానే ఇది హిట్ కావడం గోపీచంద్ కి చాలా అవసరం కూడా! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్
బల్లికురవ: ఆత్మహత్యాయ్నతం చేసిన ఓ యువకుడి ప్రాణాలను వలంటీర్ కాపాడాడు. ప్రాథమిక చికిత్స చేసి సకాలంలో ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో శనివారం జరిగింది. కుంచాల సుభాషిణి, కనకారావు దంపతుల కుమారుడు గోపీచంద్ (17) ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. కనకారావు ఐదేళ్లుగా గ్రామంలో లేడు. సుభాషిణి తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉంటూ తనకున్న పొలంతోపాటు కుమారుని సాయంతో గొర్రెలను మేపుతోంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు అనారోగ్యం బారిన పడ్డాడు. గోపీచంద్ గొర్రెల కాపలాకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో అతడిని సుభాషిణి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపీచంద్ ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని గమనించిన తల్లి వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అక్కడే ఉన్న సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేశ్బాబు..గోపీచంద్ పురుగుమందు తాగినట్లు గుర్తించాడు. బీఎస్సీ నర్సింగ్ చదివిన వలంటీర్.. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి తాగిన పురుగు మందును కక్కించాడు. మెరుగైన చికిత్స కోసం 35 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుందని భావించి మరొకరి సహాయంతో బైక్పైనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందడంతో గోపీచంద్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. యువకుడి ప్రాణాలను కాపాడిన వలంటీర్ను గ్రామ సచివాలయ కార్యదర్శి షేక్.బాజీ, ఎంపీడీవో హనుమారెడ్డి, ఈవోఆర్డీ దాసరి సుమతి అభినందించారు. -
గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఎప్పుడంటే?
రామబాణం తర్వాత మాచో స్టార్ గోపీచంద్ చేస్తున్న చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. అతనికి జంటగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు గోపీచంద్ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. గతేడాది నటించిన రామబాణం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపిచంద్కు కలిసొచ్చే పోలీస్ పాత్ర గోపీచంద్ 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్స్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర..! See you all in Cinemas with #BHIMAA this Mahashivratri🔱 pic.twitter.com/aeu1jYQIB2 — Gopichand (@YoursGopichand) January 29, 2024 -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement