-
రిటైర్డు సీజేఐకి 6 నెలల ఉచిత వసతి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేని నివాస వసతిని కేంద్రం సమకూర్చనుంది. సుప్రీంకోర్టు జడ్జీలకు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏడాదిపాటు 24 గంటల వ్యక్తిగత భద్రతా సౌకర్యం ఏర్పాటు చేయనుంది. వీరికి డ్రైవర్ సౌకర్యం, సెక్రటేరియల్ అసిస్టెంట్ను పొడిగించనుంది. న్యాయశాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సవరించిన నిబంధనలతో ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, లేదా న్యాయమూర్తులు విమానాశ్రయాల్లోని లాంజ్లలో ప్రోటోకాల్ ప్రకారం గౌరవమర్యాదలు అందుతాయి. వీరి వాహన డ్రైవర్కు ఇతర ఉద్యోగులకు మాదిరిగా పూర్తి వేతనం, ఇతర అలవెన్సులను సుప్రీంకోర్టు/హైకోర్టు నిధుల నుంచి చెల్లిస్తారు. వీరికి కేటాయించే సెక్రటేరియల్ అసిస్టెంట్ స్థాయి సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీసర్తో సమానంగా ఉంటుంది. రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి/ న్యాయమూర్తులకు వ్యక్తిగత భద్రతతోపాటు వీరి నివాసాలకు ఏడాదిపాటు పూర్తి స్థాయిలో భద్రత సమకూరుస్తారు. రిటైర్డు సీజేఐకి ఢిల్లీలో ఉచిత టైప్–7 భవన వసతిని పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆరు నెలలపాటు కల్పిస్తారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు సందర్భంగా సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. -
AP: ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయం 2 నెలలు పొడిగింపు
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయం మరో 2 నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31 వరకు ఉద్యోగుల వసతిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతులు, హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. -
అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి
హైదరాబాదీ నవాబ్ అరస్తు యార్ జంగ్ అభాగ్యుల పాలిటి అపర ధన్వంతరి ఆయన. రోగులకు వైద్యం చేయడమే కాదు, నిరుపేద రోగులకు తన నివాస ప్రాంగణంలోనే ఉచిత వసతి సౌకర్యాలను సమకూర్చే ఉదారుడు. పంతొమ్మిదో శతాబ్ది చివరికాలంలో హైదరాబాద్లో ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు పరిస్థితిని చక్కదిద్దడంలో నిరుపమానమైన కృషి చేసిన వైద్యుడు నవాబ్ అరస్తు యార్ జంగ్. ఆయన అసలు పేరు అబ్దుల్ హుస్సేన్. హైదరాబాద్లో 1858 జూన్ 10న జన్మించారు. నిజాం రాజ్యంలో తొలి శస్త్రవైద్యుడు ఆయనే. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా వద్ద ప్రధాన వైద్యునిగా, వైద్య సలహాదారుగా పనిచేశారు. మెడికల్ స్కూల్లో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక, హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ప్రాక్టీసు ప్రారంభించారు. కొంతకాలానికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా నియమితుడవడమే కాకుండా, ఆ ఆస్పత్రికి తొలి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ అబ్దుల్ హుస్సేన్ సేవలకు మెచ్చిన ఆరవ నిజాం ఆయనకు ‘అరస్తు యార్ జంగ్’ బిరుదు ఇచ్చారు. నిజాం ప్రభువుకు నమ్మకమైన రాచవైద్యునిగా పనిచేసినా, ఆయన ఏనాడూ సామాన్యులకు దూరం కాలేదు. ఎలాంటి సమయంలోనైనా ఆయన పేదసాదలకు అందుబాటులో ఉండేవారు. నిరుపేద రోగులకు ఉచితంగా చికిత్స చేసేవారు. అవసరమైతే, ఏ వేళలో పిలిచినా రోగుల వద్దకు స్వయంగా వెళ్లేవారు. తన నివాస ప్రాంగణంలో నిర్మించిన ప్రత్యేక గృహాల్లో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వసతి సౌకర్యాలు, ఉచిత భోజనం కల్పించేవారు. ఉన్నత విద్యావ్యాప్తికి అవిరళ కృషి బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంతో పోలిస్తే, ఉన్నత విద్యారంగంలో వెనుకబడి ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నత విద్యావ్యాప్తి కోసం నవాబ్ అరస్తు యార్ జంగ్ అవిరళంగా కృషి చేశారు. ముల్లా మహమ్మద్ భాయ్ తదితర మత పెద్దలతో కలసి యువకులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించే ట్రస్టులకు ఆర్థికంగా చేయూతనందించారు. తన కొడకులందరినీ ఉన్నత చదువులు చదివించారు. వారిలో కొందరిని ఉన్నత చదువుల కోసం బ్రిటన్, అమెరికా తదితర విదేశాలకు సైతం పంపారు. అరస్తు యార్జంగ్ వారసుల్లో పలువురు బ్రిటన్, అమెరికా, కెనడా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. ఆయన వంశానికి చెందిన ఆరు తరాల వారసుల సంఖ్య ప్రస్తుతం దాదాపు వెయ్యికి పైగానే ఉంటుంది. దాతృత్వంలోనూ ఉదాత్తుడు అరస్తు యార్ జంగ్ విరివిగా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా విద్యా కార్యక్రమాలకు, ధార్మిక సంస్థలకు విరాళాలు ఇచ్చేవారు. ‘కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వరాద’నే ఖురాన్ వాక్కుకు అనుగుణంగా ఆయన లెక్కలేనన్ని గుప్తదానాలు చేసినట్లు ప్రతీతి. హుస్సేనీ ఆలం మసీదు నిర్మాణానికి షేక్ మొహసిని, సయ్యద్ తాహెర్ సైఫుద్దీన్లతో కలసి కృషి చేశారు. ఇప్పటికీ ఈ మసీదు వాడుకలో ఉంది. ప్రస్తుతం బుర్హానీ మసీదుగా పిలుస్తున్న ఈ మసీదు, అంజుమన్-ఏ-తహెరీ జమాత్లో భాగంగా ఉంది. దీనిని 2003లో వారసత్వ కట్టడంగా ప్రకటించారు. అరస్తు యార్ జంగ్ 1940 మార్చి 25న మరణించగా, ఈ మసీదు సమీపంలోనే ఆయనను సమాధి చేశారు. - పన్యాల జగన్నాథదాసు
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement