-
1,082 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు
-
1,082 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు
లాత్వియా: మరో కొత్త సాహోసేపేత చాలెంజింగ్ క్రీడ మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి ఓ వ్యక్తి డ్రోన్ ద్వారా వెయ్యి అడుగులకంటే ఎత్తులో నుంచి దూకేసి రికార్డు సృష్టించాడు. లాత్వియాలో ఈ రికార్డు ఆవిష్కృతమైంది. ప్రస్తుతం యూట్యూబ్లో అడుగుపెట్టిన ఈ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఎరోన్ అనే 28 ప్రొఫెల్లర్ డ్రోన్తో లాత్వియాలోని ఓ డ్రోన్ కంపెనీ ఈ సాహసం నిర్వహించింది. డేర్డెవిల్ జంప్ చేసిన స్కై డైవర్ ఇంగస్ ఆగస్ట్కల్న్స్ ఈ వివరాలు తెలియజేస్తూ తనను డ్రోన్ చాలా తేలికగా పైకెత్తిందని, టెక్నాలజీ సహాయంతో డ్రోన్ కంపెనీ తన ఇన్నోవేషన్ను రుజువు చేసుకుందని చెప్పాడు. డ్రోన్పై నుంచి ప్యారా చూట్ తెరుచుకునే వరకు కూడా తాను కిందపడిపోతున్నప్పుడు చాలా స్వేచ్ఛగా అనింపించిందంటూ జంపింగ్ అనంతరం తన అనుభవాన్ని వివరించాడు. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరిన్ని డ్రోన్లు తయారు చేసి అగ్ని ప్రమాదాలు, తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించేలా అందుబాటులోకి తెస్తామంటూ సదరు కంపెనీ తెలిపింది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం తొలుత ఓ నీటి మడుగు దగ్గరికి డ్రోన్లను తీసుకెళ్లారు. అంతకంటే ముందు ఒక పెద్ద టెలిఫోన్ టవర్పై డైవింగ్ చేసే వ్యక్తిని ఉంచారు. అనంతరం రిమోట్ సహాయంతో డ్రోన్ను ఆపరేట్ చేసి టవర్పైకి తీసుకెళ్లగా అప్పుడు టవర్పై ఉన్న డైవర్ ఇంగస్ దానికి వేలాడదీసిన తాడును పట్టుకున్నాడు. ఆ వెంటనే డ్రోన్ అతడిని దాదాపు 1,082 అడుగుల పైకి తీసుకెళ్లగా అక్కడి నుంచి దూకి మధ్యలో ప్యారాచూట్ ఓపెన్ చేసి సురక్షితంగా కిందికి దిగాడు. మే 12న అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2,75,000మంది వీక్షించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement