breaking news
Comprehensive details
-
కెనడా కొలువులు కష్టమే
ఒట్టావా: మెరుగైన ఉద్యోగావకాశాల కోసం కెనడా వలస వెళ్లాలనుకునే భారతీయ నిపుణులకు కొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి. కెనడా తన ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇమిగ్రేషన్ విధానంలో భారీ మార్పులు ప్రకటించింది. పర్మినెంట్ ఇమిగ్రేషన్ ప్రోగ్రాంకు అభ్యర్థి అర్హతను పర్యవేక్షించే కీలకమైన కాంప్రెహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టం (సీఆర్ఎస్)లో మార్పులు చేశారు. కెనడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం అభ్యర్థులు ఇకపై ఉద్యోగ ఆఫర్పై అదనపు పాయింట్లు పొందరు. ఈ మార్పులన్నీ 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటికే పూల్లో ఉన్న ఉద్యోగార్థులతో పాటు అందులోకి కొత్తగా ప్రవేశించే అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని కెనడా ప్రకటించింది. మోసాలను తగ్గించడానికే తాజా చర్యలపై కెనడా ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజన్షిప్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడారు. తమ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిపుణులైన ప్రతిభావంతులను శాశ్వత నివాసులుగా కెనడా వచ్చేలా ప్రోత్సహిస్తూనే మోసాలను తగ్గించడమే వాటి లక్ష్యమని తెలిపారు. ‘‘వలసలు కెనడా విజయానికి మూలస్తంభంగా ఉన్నాయి. సమర్థులు, తెలివైన వారిని కెనడాకు స్వాగతించడానికి కట్టుబడి ఉన్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉద్యోగాలు, గృహాలతో పాటు వారి అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది’’అన్నారు. ప్రభావం ఎవరిపై?: జాబ్ ఆఫర్పై అదనపు సీఆర్ఎస్ పాయింట్లను తొలగించడం వల్ల ప్రస్తుతం కెనడాలో తాత్కాలికంగా పనిచేస్తున్న వారిపై ప్రభావం పడుతుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టం ద్వారా శాశ్వత నివాసాన్ని కోరుకునే వారిపైనా ఈ మార్పులు ప్రభావం చూపుతాయి. ఇప్పటికే శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చే సుకోవడానికి ఆహ్వానించిన అభ్యర్థులను మా త్రం కొత్త నిబంధనలు ప్రభావితం చేయవు. ప్రస్తుతం ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) కింద పీఆర్ కోసం దరఖాస్తు సమరి్పంచిన వారికీ వర్తించవు. ఫ్లాగ్పోలింగ్పై నిషేధం: కెనడాలోని తాత్కా లిక నివాసితులు ఇకపై దేశం వీడి మళ్లీ తిరిగి రా వడానికి కూడా ఇకపై అనుమతి ఉండదు. ఇమిగ్రేషన్ స్థితిని మార్చడానికి సరిహద్దు వద్ద నిర్వహించే ఫ్లాగ్పోలింగ్ను కెనడా నిషేధించింది. ఇమిగ్రేషన్ పత్రా ల రద్దు, సవరణకు సంబంధిత అధికారులకు అధికారమిచ్చారు. ఈ మార్పులు కూడా 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఏమిటీ ‘ఎక్స్ప్రెస్ ఎంట్రీ’? ఇది ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రాం. కెనడాలోని పలు సంస్థలు స్థానికంగా సరైన అభ్యర్థి దొరక్కపోతే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటారు. ఈ లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఎంఐఏ) ఆధారంగా ఉద్యోగం పొంది శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే ఐటీ ఉద్యోగులకు అదనపు పాయింట్లు అందుతాయి. సీఎస్ఆర్ స్కోర్లో అదనంగా 50 నుంచి 200 పాయింట్లు పొందుతారు. ఈ విధానంలో అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని పూల్లోకి ప్రవేశించవచ్చు. రౌండ్లలో ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని కెనడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దరఖాస్తు అందాక శాశ్వత నివాసం (పీఆర్) ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కొత్త మార్పుల ప్రకారం ఇకపై ఈ అదనపు పాయింట్లుండవు. వయసు, విద్య, భాషా నైపుణ్యం, ఇతర ప్రమాణాల ఆధారంగా మాత్రమే మూల్యాంకనం చేస్తారు. అంటే అభ్యర్థుల మధ్య పోటీ పెరుగుతుంది. -
భూ బాగోతంపై కలెక్టర్ సీరియస్
పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం బాధ్యుల గుండెల్లో రైళ్లు నక్కపల్లి: మండలంలోని అమలాపురంలో సుమారు రూ. 12 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పరిహారం స్వాహా చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై డొంక కదులుతోంది. ఈ వ్యవహరం బయటకు పొక్కి పత్రికల్లో రావడంతో జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ బాగోతాన్ని కలెక్టర్ యువరాజ్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. సుమారు 90 ఎకరాల ప్రభుత్వ భూమికి అడ్డగోలుగా రికార్డులు తారుమారుచేసి ఆన్లైన్ చేయడం, వన్-బీ రికార్డులు తయారీ వెనుక ఏయే అధికారుల ప్రమేయం ఉంది.. ఏ నాయకులు ఒత్తిడి చేశారు.. ఎవరిపేరున రికార్డులు తారుమారుచేశారు.. ఈ తతంగమంతా ఎప్పుడు జరిగిందనే వివరాలు తక్షణమే అందజేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వివరాల సేకరణలో తహసీల్దార్ ఈ బాగోతంపై నక్కపల్లి తహసీల్దార్ గంగాధర్రావు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. కార్యాలయంలో ఉన్న పాత రికార్డులు అడంగళ్లు పరిశీలించి నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం, సబ్డివిజన్ రికార్డు లేకుండా 53 ఎకరాల ప్రభుత్వ భూమికి 39 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు తయారుచేశారు. వన్-బీలో ఈ భూమిని అతుకుబడిగా నమోదు చేశారు. అతుకుబడి అంటే రెవెన్యూ పరిభాషలో ప్రభుత్వ భూమిని పేదలకు డీఫాం పట్టాలు ఇవ్వడమని అర్థం. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటేనే ఇలా అతుకుబడిగా అడంగళ్లో నమోదుచేసి పట్టాలు జారీ చేస్తారు. కానీ రికార్డుల్లో పేర్కొన్న వారెవరూ సాగులో లేరు. వారిపేరున ఎటువంటి పట్టాలు జారీ కాలేదు. అయినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అక్రమాలకు పాల్పడి రికార్డులు తారుమారు చేసి వెబ్ల్యాండ్లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారం పోర్టల్ లాగిన్ తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఈ బాగోతంలో నలుగురైదుగురు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తహసీల్దార్ ఆధీనంలో ఉండే డిజిటల్ కీ ఉపయోగించి వెబ్ల్యాండ్ పోర్టల్ లాగినై ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా తహసీల్దార్ సమక్షంలోనే జరగాలి. కానీ తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం ఈ డిజిటల్ కీ ఎవరి దగ్గరపడితే వారిదగ్గరే ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు వెబ్ల్యాండ్ పోర్టల్ లాగినై మామూళ్లు ఇచ్చిన వారి భూముల వివరాలు ఆన్లైన్ చేసేవారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కూడా డిజిటల్ కీను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కార్యాలయంలో గోప్యంగా ఉండాల్సిన అడంగళ్లు, ఎఫ్ఎంబీలు, ఎస్ఎఫ్ఏలు బయట వ్యక్తుల వద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. కార్యాలయం సమయానికి అందుబాటులో లేని రికార్డులను బ్రోకర్లు, వీఆర్వోల కుటుంబ సభ్యులు క్షణాల్లో తేగలుతున్నారంటే ఈ కార్యాయంలో కీలక రికార్డుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. గతంలో పనిచేసిన క్షేత్రస్థాయి అధికారుల మంచితనం.. లేదా బలహీనతలను ఆసరగా తీసుకుని కొంతమంది సిబ్బంది ఈ విధమైన అక్రమాలకు పాల్పడేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని చోట్ల రికార్డుల తారుమారు ఇటువంటి రికార్డుల తారుమారు ఒక్క అమలాపురంలోనే కాకుండా డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడులలో కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు మరో రెండు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. డీఫాం పట్టాలనేవి సెంటు భూమిలేని నిరుపేదలకు మంజూరు చేస్తారు. కానీ అమలాపురం, వేంపాడు, రాజయ్యపేట, డీఎల్ఫురం తదితర గ్రామాల్లో భూస్వాములకు కూడా పట్టాలిచ్చారు. వారి ఆక్రమణల్లో వందలాది ఎకరాలున్నట్లు ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహరంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి పాత రికార్డులన్నీ పరిశీలిస్తే మండల స్థాయి అధికారులతోపాటు పలువురు రైతులు, భూస్వాముల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తహసీల్దార్ గంగాధర్రావు ఈ బాగోతాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వెబ్ల్యాండ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దళారులకు అవకాశం లేకుండా లబ్ధిదారుల పనులు నేరుగా తానే పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అమలాపురం బాగోతం వెనుక పూర్తి వివరాలు సేకరించి నివేదికను కలెక్టర్కు పంపుతామని తహసీల్దార్ తెలిపారు.