Central London
-
లండన్లో కాల్పుల కలకలం!
-
లండన్లో కాల్పుల కలకలం!
లండన్: సెంట్రల్ లండన్లో శుక్రవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించి, స్టేషన్ను మూసేశారు. అలాగే, ముందు జాగ్రత్తగా పక్కనున్న బాండ్ స్ట్రీట్ స్టేషన్నూ మూసివేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని, ఇప్పటికే వచ్చిన వారు రోడ్లపై తిరగకుండా, ఏవైనా భవనాల్లోకి వెళ్లిపోవాలనీ, స్థానికులు కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మొత్తం ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ లోపే అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మరిన్ని భద్రతాబలగాలు కూడా మోహరించాయి. అయితే, తనిఖీల అనంతరం కాల్పులకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.38 గంటలకు తమకు కొందరు ఫోన్లు చేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చేమోనన్న అనుమానంతో చర్యలు చేపట్టామని వివరించారు. -
‘హిందూజా’ చేతికి చారిత్రక లండన్ భవనం
లండన్: సెంట్రల్ లండన్లోని చారిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ భవనం లాంఛనంగా హిందూజా గ్రూప్ వశమైంది. ఇప్పటికే భవనానికి సంబంధించిన తాళాలు హిందూజా గ్రూప్ చేతికి వచ్చేశాయి. హిందూజా గ్రూప్ ఈ పురాతన భవనాన్ని 5 స్టార్ హోటల్గా, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్గా అభివృద్ధి చేయనున్నది. అలాగే ఇందులో ప్రైవేట్ ఫంక్షన్ రూమ్స్, స్పా సెంటర్స్, ఫిట్నెస్ కేంద్రాలు వంటి తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నది. బ్రిటిష్ పార్లమెంట్కు, బ్రిటన్ ప్రధాని నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ భవనం.. 5.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవున్న ఏడు అంతస్థుల కారిడార్లు కలిగి ఉంది. హిందూజా గ్రూప్.. స్పానిష్ ఇండస్ట్రియల్ కంపెనీ ఓహెచ్ఎల్డీతో కలిసి ఈభ వనాన్ని 250 ఏళ్లకు గానూ లీజ్ పద్ధతిలో బ్రిటన్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఈ భవనంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భవన నిర్మాణం 1906లో పూర్తయ్యింది. ఇందులో 1,100 రూమ్స్ ఉన్నాయి.