breaking news
Built industry
-
బిల్ట్ కష్టాలు
మూడున్నరేళ్ల క్రితం మూతపడిన కాగితపు గుజ్జు పరిశ్రమ ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా పారిశ్రామిక ప్రోత్సాహక విధానం కింద రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2015 డిసెంబరు 14న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 25 శాతం టారిఫ్కే మూడు మెగావాట్ల కరెంటును సరఫరా చేస్తారు. సాధారణ ధర కంటే తక్కువకు బిల్ట్కు కరెంటును ఇవ్వడం వల్ల సబ్సిడీ గరిష్టంగా రూ.9 కోట్లు ఉంటుంది. కాగితపు గుజ్జుకు ముడి సరుకుగా వినియోగించే జామాయిల్, వెదురు కలపను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ సబ్సిడీపై సరఫరా చేస్తుంది. వరంగల్ నుంచి అలువాల సదాశివుడు/ధర్మపురి శ్రీనివాస్ : బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కాగితపు గుజ్జు పరిశ్రమ పునరుద్ధరణ ప్రక్రియ అంతు లేని కథగా కొనసాగుతోంది. ఈ పరిశ్రమ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు బిల్ట్ పరిశ్రమ తెరుచుకోలేదు. ప్రభుత్వ పరంగా ఆశించిన చొరవ లేకపోవడంతో బిల్ట్ యాజమాన్యం స్పందిండంలేదు. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన తొమ్మిది వేల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎవరూ పట్టించుకోకనే.. విద్యుత్, ముడి సరుకులకు సంబంధించి గరిష్ట సబ్సిడీ రూ.30 కోట్లు మించకుండా ఏడేళ్లపాటు కొనసాగుతుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. 2015 డిసెంబ రులో ఈ జీఓ వెలువడగా మూడు నెలల్లో బిల్ట్ను పునరుద్ధరించాల్సి ఉంది. ప్రభు త్వ ఉత్తర్వులపై స్పందించిన బిల్ట్ యాజ మాన్యం ఒకేసారి ప్రభుత్వంతో చర్చలు జరిపి చేతులు దులుపుకుంది. పరిశ్రమ పునరుద్ధరణ జరగాలంటే.. పెండింగ్ వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యా ల విషయంలో కోత విధించక తప్పదని యాజమాన్యం స్పష్టం చేయగా.. కార్మికు లు అంగీకరించారు. కానీ ప్రభుత్వం, బిల్ట్ వైపు నుంచి ఎవరూ ముందుకు రాలే దు. దీంతో పునరుద్ధరణ అటకెక్కింది. మూడున్నరేళ్లుగా ఆందోళన మూడున్నరేళ్లుగా బిల్ట్ ఉద్యోగులు,∙కార్మికులు ఆందోళన చేస్తున్నా ఇటు ప్రభుత్వం వైపు నుంచి గానీ అటు బిల్ట్ యాజమాన్యం వైపు నుంచి గానీ స్పందన రావడం లేదు. ప్రారంభం నుంచి మూసివేత వరకు.. జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో 1975లో ఆంధ్రప్రదేశ్ పారి శ్రామిక అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వ ర్యంలో ఆంధ్రప్రదేశ్ రేయాన్స్ పేరుతో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. 1981లో ఈ పరిశ్రమ లో ఉత్పత్తి మొదలైంది. అనంతరం దీన్ని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ పరి శ్రమలో ఉత్పత్తి అయిన కాగితపు గుజ్జును గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేస్తుండేది. బిల్ట్ కంటే బహిరంగ మార్కెట్ లో కాగితపు గుజ్జు తక్కువ ధరకు లభిస్తుం డడంతో 2014 ఏప్రిల్లో గ్రాసిమ్ సంస్థ కాగితపు గుజ్జు కొనుగోలును నిలిపివేసిం ది. మార్కెట్ లేకపోవడంతో 2014 ఏప్రిల్ 6వ తేదీన బిల్ట్ యాజమాన్యం పరిశ్రమలో కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దీనిపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కరువైంది. -
‘చలో హైదరాబాద్’కు పోలీసుల బ్రేక్
* బిల్ట్ కార్మికులను రాజధానికి వెళ్లకుండా నిలిపివేసినఖాకీలు * రాత్రి ఒంటి గంట వరకు రోడ్డుపైనే కార్మికులు కమలాపురం : బిల్ట్ పరిశ్రమ మూతపడకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు బయల్దేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు బయల్దేరిన తమను పోలీసులు అడ్డుకోవడమేమిటని కార్మికులు మండిపడ్డారు. ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. కమలాపురం నుంచి కార్మికులు హైదరాబాద్ వెళ్లేందుకు 5 బస్సులను అద్దెకు మాట్లాడగా.. మంగళవారం రాత్రి 10 గంటలకు బస్సులు కమలాపురం చేరుకున్నాయి. కార్మికులు రాత్రి బస్సు ఎక్కి బయల్దేరుతున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చి బస్సులకు అడ్డం తిరిగి నిలిపివేశారు. దీంతో నాయకులు కార్మికులు అవాక్కయ్యారు. బస్సులు వెళ్లేందుకు అనుమతి లేదని, వెంటనే ఇక్కడి నుంచి కార్మికులు వెళ్లిపోవాలని మంగపేట ఎస్సై ముష్కం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా కార్మిక సంఘాల నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్కు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బస్సులు ఖాళీగా తిరిగి వెళ్లిపోగా కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా తొమ్మిది నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఎన్నుకుంటే నాయకులు నట్టేట ముంచారని పలువురు ఆరోపించారు. అసెంబ్లీ చర్చల్లో ఖాయిలాపడుతున్న పరిశ్రమలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చర్చిస్తుంటే.. బిల్ట్పై మాత్రం జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న తమపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరికాదని వాపోయూరు. పోలీసు నిర్బంధం ప్రయోగించడంలో యూజమాన్యం హస్తం ఉందని కూడా మండిపడ్డారు. ఇందుకు స్థానికంగా ఉన్న కొందరు బిల్ట్ అధికారులను వాడుకుంటోందని ఆరోపించారు.