Black color
-
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్లో పెట్టారు శారద. ఆ పోస్ట్పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
సెల్టోస్ ఎక్స్లైన్ వెర్షన్లో బ్లాక్ కలర్
న్యూఢిల్లీ: కియా తన సెల్టోస్ ‘ఎక్స్లైన్ వెర్షన్’లో బ్లాక్ కలర్ వేరియంట్ను తెచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కలర్ వేరియంట్లో కేవలం ఎక్ట్సీరియర్లో మాత్రమే కాకుండా ఇంటీరియర్లో కూడా కొన్ని మార్పు లు చేశారు.సెల్టోస్ ఎక్స్ లైన్ క్యాబిన్ బ్లాక్, స్ల్పెండిడ్ సేజ్ గ్రీన్ 2టోన్ కాంబినేషన్లో వేర్వేరు రంగులను కలిగి ఉంది. రియర్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ ఎగ్జాస్ట్, వెనుక బంపర్పై ఫ్రంట్, ఔటర్ రియర్ మిర్రర్లు, టెయిల్ గేట్ గార్నిష్ తో సహా మరికొన్ని మార్పులు చేశారు.‘‘ఇప్పటి వరకు గ్రే కలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండే సెల్టోస్ అతి తక్కువ సమయంలో 5 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా ఉంది. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని బ్లాక్ కలర్ ఆప్షన్లో తీసుకొచ్చాము’’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ తెలిపారు. -
2023లో మగువలు మెచ్చిన చెప్పులు.. ‘బ్లాక్ కలర్ వావ్’
మగువలు అందంగా, స్టైలిష్గా కనిపించేందుకు తాము ధరించే దుస్తులతో పాటు పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. మనం ధరించే పాదరక్షలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెబుతుంటారు. మరి 2023లో మగువలు మెచ్చిన పాదరక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ హీల్స్ ఈ సంవత్సరం బ్లాక్ హీల్స్ .. పాదరక్షల ఫ్యాషన్లో అగ్రస్థానంలో నిలిచాయి. బ్లాక్ హీల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి తేలికగా ఉంటూ, అస్సలు ఇబ్బంది కలిగించవు. చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ సంవత్సరం బ్లాక్ కలర్ హీల్స్ను చూసిన మగువలు ‘బ్లాక్ కలర్ వావ్’ అంటూ తెగ మురిసిపోయారు. బూట్లు మగువల కోసం రూపొందించిన బూట్లు ట్రెండ్లో ఉన్నాయి. పాదాలు మొదలుకొని మోకాలి వరకు లేదా తొడల వరకూ ఉండే ఈ బూట్లు ఫ్యాషన్ మార్క్గా నిలిచాయి. శీతాకాలంలో ఈ బూట్లు చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. చలి నుంచి రక్షణ కల్పిస్తాయి. డ్రెస్లు, జీన్స్, స్కర్ట్లపై బూట్లు చక్కగా అమరిపోతాయి.ఈ ఏడాది షైనీ బూట్స్ ట్రెండ్లో ఉన్నాయి. లోఫర్స్ లోఫర్స్ అన్ని సీజన్లలోనూ సూటవుతాయి. ఈ ఏడాది లోఫర్స్ ఎంతో ఆదరణ పొందాయి. లోఫర్స్.. జీన్స్, డ్రెస్లపై స్మార్ట్ లుక్ను ఇస్తాయి. లోఫర్స్తో పొడవు సాక్స్ల ట్రెండ్ నడుస్తోంది. చాలామంది మగువల షూ రాక్లో తప్పనిసరిగా ఒక జత లోఫర్స్ కనిపిస్తాయి. కిటన్ హైహీల్స్ ధరించకుండా స్టైలిష్గా కనిపించాలనుకుంటే అందుకు కిటన్ హీల్ మంచి ఎంపిక అని చెబుతుంటారు. కిటన్ హీల్స్ ఈ సంవత్సరం మగువలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చాలామంది చెబుతుంటారు. గ్లాస్ హీల్స్ పారదర్శక పాదరక్షలు అంటే గ్లాస్ హీల్స్ ఈ సంవత్సరం ఫ్యాషన్లో నిలిచాయి. పైన పారదర్శక బెల్టులు కలిగిన ఈ పాదరక్షలు ఈ సంవత్సరం హై హీల్స్లో ఉత్తమమైనవిగా పేరొందాయి. ఇవి ధరించినవారు స్టైలిష్గా కనిపిస్తారని చాలామంది చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. -
రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?
విశాఖ సాగరతీరం అంటే బంగారు వర్ణంతో కనిపించే ఇసుక తిన్నెలు.. సముద్రపు నీటితో శుద్ధి చేశారా? అన్నంతగా స్వచ్ఛతను తలపించే ఒంపులు తిరిగిన చిన్న చిన్న ఇసుక దిబ్బలు.. వాటిని ఎంత సేపు చూసినా, వాటిపై మరెంత సేపు సేద తీరినా తనివి తీరని అనుభూతిని పొందుతారు పర్యాటక ప్రియులు. అలాంటి విశాఖ బీచ్ ఇటీవల తన సహజ సౌందర్యానికి భిన్నంగా కనిపిస్తోంది. సుందర సాగరతీరం ఒంటికి మసి పూసుకున్నట్టు అగుపిస్తోంది. ఔరా! ఇది మన విశాఖ బీచేనా? అనిపించేలా రూపు మారిపోయింది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది. ఎందుకిలా? కొద్ది రోజుల క్రితం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఈ పరిణామమే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇసుక నలుపు రంగును పులుముకుంటోం ది. ఈ పరిస్థితికి సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, పోర్టులో బొగ్గు లోడింగ్, అన్లోడింగ్తో పాటు ఇనుప రజను వంటివి కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నగరంపైకి నైరుతి గాలులే వీస్తాయి. విశాఖ నగరానికి నైరుతి దిశలోనే అనేక పరిశ్రమలున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. ఇవన్నీ సముద్రం అడుగున ఉంటాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు కడలి కల్లోలంగా మారుతుంది. దీంతో దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా అప్పటివరకు తీరంలో గోధుమ, బంగారు వర్ణంలో ఉన్న ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఈడ్పుగంటి ధనుంజయరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం బీచ్లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. -
నలుపు మెరుపులు
గగనాంతర రోదసిలో దూసుకుపోతున్నా.. ఇలాతలంలో ఇంతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పదిమందిని మెప్పించే మేధస్సు ఉన్నా.. మేని ఛాయను బట్టే మర్యాద ఇచ్చే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తెలుపులో ఉన్నవారిని వలపు తీగలని పొగిడే నోళ్లు.. నలుపు నారాయణుడు మెచ్చునన్న సంగతి మరచి వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వివక్షకు చెక్ పెడుతూ ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే కాన్సెప్ట్ సిటీలో షురూ అయింది. ఒంటి రంగు బంగారు వన్నెలో తళుకులీనినా.. నీడ మాత్రం కనిపించేది నలుపులోనే. యుగయుగాల చరిత్రలోకి తొంగి చూస్తే నలుపు రంగుకు మించిన అందం లేదని తెలుస్తుంది. నారాయణుడు నలుపు.. పార్వతీదేవి నలుపు. త్రేతాయుగంలో రాముడు నీలిమేఘ శ్యాముడు. ద్వాపరానికి వస్తే శ్రీ కృష్ణుడిదే కాదు. ద్రౌపది మేనిఛాయ కూడా నలుపే. ఒకప్పుడు ఒంటిపై నిగనిగలాడిన నలుపు.. ఇప్పుడు కంట్లో నలుసులా మారుతోంది. పురాణకాలంలో ఈ రంగుపై కనిపించని వివక్ష.. నవీనయుగంలో మాత్రం కట్టలు తెంచుకుంది. మగువలు ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. రంగునుబట్టే సమాజం వారికి గౌరవాన్నిస్తోంది. ఈ రుగ్మతను తగ్గించే సంకల్పంతో మొదలైందే ‘డార్క్ ఈజ్ బ్యూటిఫుల్’ క్యాంపెయిన్. చెన్నై టు హైదరాబాద్.. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ కాన్సెప్ట్ ఇండియాలో చెన్నై నుంచి మొదలైంది. కవితా ఇమ్మాన్యుయేల్ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ ‘బ్లాక్ బ్యూటీ’, నటి నందితాదాస్ సపోర్ట్తో మనసులకు పట్టిన నలుపును తుడిచేందుకు పనిగట్టుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్కు పాకిన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ సిటీ స్త్రీల్లో సరికొత్త ఉత్సాహం నింపే ప్రయత్నంలో ఉంది. చామనఛాయా చిత్రాలు.. ఫ్యాషన్ షో, సినీ ఇండస్ట్రీ, ఉద్యోగం...ఇలా ఏ రంగాల్లోనైనా కాస్త రంగు త క్కువగా ఉండే అమ్మాయిలకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి. తెలివికి రంగుతో సంబంధం లేదనే కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డార్క్ అండ్ బ్యూటీఫుల్ ఫొటో ఎగ్జిబిషన్కు శ్రీకారం చుట్టింది హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ. ఈ కానె ్సప్ట్ వివరించి ఎంట్రీలను ఆహ్వానించింది. ఫేస్బుక్ ద్వారా సరికొత్త థీమ్తో మొదలైన క్యాంపెయిన్కు వివిధ రంగాలకు చెందిన మహిళల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ష్యాషన్, మీడియా, సినిమా, ఐటీ.. ఇలా తాము ఎంచుకున్న మార్గంలో సక్సెస్ సాధించిన పలువురు మగువలు క్యాంపెయిన్లో పాలుపంచుకుంటున్నారు. యాంకర్ ఝాన్సీ, డిజైనర్ అర్చన రావ్, ఆర్టిస్టు ప్రియాంక ఏలే వంటి 50 మంది ప్రముఖులు ఉత్సాహంగా ముందుకువచ్చారు. ఇలా స్పందించిన వారి ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. వాటిని ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. వారిలో ఉన్న ధీమాతో పాటు వారు సాధించిన విజయాలనూ ఫొటో ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 20 వరకు కొనసాగనుంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సాధారణంగా అమ్మాయిలంటేనే వివక్ష కొనసాగుతున్న రోజులివి. ఆడ శిశువు అనగానే కడుపులోనే అంతమొందిస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీన్ని దాటి నేలపైకి వచ్చినా అమ్మాయి తెల్లగా, బుర్రగా ఉంటే సరి. నలుపు రంగు వస్తే సమాజంలో నెగెటివ్ ఆలోచన ధోరణి పెరుగుతోంది. దీన్ని నివారించడమే డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్దేశం. ఈ కాన్సెప్ట్ను వివరించి ఎంట్రీలను ఆహ్వానించాం. చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. వారు సాధించిన విజయాలను వివరిస్తూ ఏడు రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. - కాళీ సుధీర్, హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యురేటర్ స్టే బ్యూటిఫుల్.. అందమనేది చూసే దృష్టి కోణంలో ఉంటుంది. నలుపు అందం కాదనే వారు నా దృష్టిలో కళ్లుండీ చూపులేనివారే. న్యాయాన్యాయాలకు పర్యాయ పదాలుగా వాడే ఫెయిర్, అన్ఫెయిర్ అనే పదాలను ఒంటి రంగులకు వాడటమే మేని ఛాయలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. రంగు వ్యక్తిలో కనిపిస్తుందే కానీ వ్యక్తిత్వాన్ని చూపదు. అందుకే స్టే అన్ఫెయిర్, స్టే బ్యూటిఫుల్ నినాదంతో మొదలైన డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్కు మరింత ప్రచారం కల్పించాలి. నా వరకైతే అయామ్ అన్ఫెయిర్, అయామ్ బ్యూటిఫుల్. - ఝాన్సీ, యాంకర్ - త్రిగుళ్ల నాగరాజు -
రంగు మారిన కేసీఆర్ కాన్వాయ్
-
రంగు మారిన కేసీఆర్ కాన్వాయ్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రంగు మారింది. ప్రస్తుతం ఉన్ననలుపురంగు కాన్వాయ్....తెలుపు రంగులోకి మారింది. మూడు వాహనాలను అధికారులు శుక్రవారం సీఎం కాన్వాయ్లోకి తెచ్చారు. భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణిని సాధారణంగా నలుపు రంగులోనే వినియోగిస్తుంటారు. అయితే నలుపు రంగు వాహనాలు తనకు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. దాంతో కాన్వాయ్ని తెలుపు రంగులోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న మూడు బ్లాక్ ఫార్చున్ కార్ల రంగును మార్చారు. కాగా తెలంగాణ రాష్ట్రం శాంతిగా ఉండాలని కేసీఆర్ నిర్ణయంతో పోలీసుల వాహనాలను కూడా తెలుపు రంగులోకి మార్చారు. -
తెలుపే కావాలి:కేసీఆర్
* కాన్వాయ్ రంగుపై కేసీఆర్ సూచన * నలుపు అచ్చిరావడం లేదని భావిస్తున్న సీఎం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నలుపురంగు కాన్వాయ్(వాహన శ్రేణి)ని వినియోగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దాన్ని తెలుపు రంగులోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత కాన్వాయ్లో టీఎస్ శ్రేణిలో 6666 నెంబరుతో నలుపు రంగు ఫార్చ్యునర్ కార్లు ఉన్నాయి. భద్రతా కారణాలరీత్యా వీవీఐపీల వాహన శ్రేణిని సాధారణంగా నలుపు రంగులోనే వినియోగిస్తుం టారు. అయితే నలుపు రంగు వాహనాలు అచ్చిరావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. కాన్వాయ్ని తెలుపు రంగులోకి మార్చాలని అభిలషిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు సూచించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే సీఎం కాన్వాయ్లోని వాహనాల రంగును మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్లకే రంగు మార్చుతారా లేక కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారా అన్నది తేల్చాల్సి ఉంది.