breaking news
Birla Planetarium Director Devi Prasad Duari
-
580 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం
కోల్కతా: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం పునరావృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో ఈ చంద్రగ్రహణం చక్కగా కనిపిస్తుందని కోల్కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దురై శనివారం తెలిపారు. సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని వివరించారు. ఇలాంటి గ్రహణం 580 సంవత్సరాల క్రితం.. అంటే 1440 ఫిబ్రవరి 18న చోటుచేసుకుందని వివరించారు. మళ్లీ ఇలాంటిదే చూడాలంటే 2669వ సంవత్సరం ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలన్నారు. -
ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!
580 ఏళ్లలో సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం భారతకాలమానం ప్రకారం నవంబరు 19(కార్తీక పౌర్ణమి)న మధ్యాహ్నం 12.48 గంటలకు కనిపించనుంది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది అని ఎంపీ బిర్లా ప్లానిటోరియం పరిశోధన & అకడమిక్ డైరెక్టర్ డెబిప్రోసాద్ దుయారీ తెలిపారు. పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. గ్రహణం కాలవ్యవధి 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. ఇది 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనది అని మిస్టర్ దుయారీ తెలిపారు. మళ్లీ 648 ఏళ్ల తర్వాత చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న పాక్షిక చంద్రగ్రహణం సంభవించిందని, మళ్లీ అద్భుతాన్ని ఫిబ్రవరి 8, 2669న చూడవచ్చని ఆయన చెప్పారు. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అప్పుడు చంద్రునిలో 97 శాతం భూమి నీడతో కప్పబడి ఉంటుంది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఉండనుంది. ఫ్రాస్ట్ మూన్ ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. (చదవండి: Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది) -
21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’
కోల్కతా: ఈనెల 21న∙సూర్యగ్రహణం సంభవించనుంది. భారత్లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా కనిపిస్తాడు. గ్రహణంవేళ సూర్యుడిచుట్టూ ఉంగరం ఆకృతిలో వెలుగు కనిపించడమే రింగ్ ఆఫ్ ఫైర్. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణమే ఉంటుంది. రాజస్తాన్లోని ఘర్సానాలో ఉదయం 10.12 గంటలకు ప్రారంభమై.. 11.49 గంటలకు వలయాకార రూపు దాల్చి, 11.50 గంటలకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ముగుస్తుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ వెల్లడించారు. రాజస్తాన్లోని సూరత్గఢ్, అనూప్గఢ్, హరియాణాలోని కురుక్షేత్ర, సిర్సా, రథియా, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, చంబా, చమోలీ, జోషిమఠ్ల్లో ఆ నిమిషం పాటు ఆ రింగ్ ఆఫ్ ఫైర్ను వీక్షించవచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 26న కనిపించినంత స్పష్టంగా ఈ సారి రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించదని దురై తెలిపారు. ఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.48 గంటల వరకు, చెన్నైలో ఉదయం 10.22 గంటల నుంచి మధ్యాహ్నం 1.41 గంటల వరకు, బెంగళూరులో ఉదయం 10.13 గంటల నుంచి మధ్యాహ్నం 1.31 గంటల వరకు పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. -
నేడు ‘మినీ మూన్’
కోల్కతా: పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కనిపించే చంద్రుడు మామూలు పరిమాణం కన్నా చిన్నగా కనిపిస్తాడని కోల్కతాలోని బిర్లా ప్లానెటోరియం డెరైక్టర్ దేవీ ప్రసాద్ దురై తెలిపారు. 15 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ పరిణామాన్ని ‘మినీ మూన్’గా పిలుస్తారు. సాధారణంగా భూమికి 3,84,000 కి.మీ. దూరంలో చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. కానీ శుక్రవారం ఈ దూరం 4,06,350 కి.మీ.కు చేరటం వల్ల చిన్నగా కనబడుతుందని దురై తెలిపారు. రాత్రి పాక్షికంగా చిన్న చంద్రుడిని గుర్తించవచ్చన్నారు.