బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన | Farmers stage dharna in front of Bank | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

Sep 19 2015 4:50 PM | Updated on Oct 1 2018 2:09 PM

పంట రుణాలను వసూలు చేయటాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక ఎస్‌బీహెచ్ శాఖ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.

దుబ్బాక (మెదక్) : పంట రుణాలను వసూలు చేయటాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక ఎస్‌బీహెచ్ శాఖ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేసినప్పటికీ రుణాలను వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ వారితో మాట్లాడారు.

కొన్ని సాంకేతిక కారణాలతోనే కొందరు రైతుల నుంచి మాత్రమే పంట రుణాల అసలు, వడ్డీలను వసూలు చేస్తున్నామని తెలిపారు. వసూలు చేసిన వడ్డీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement