-
ఎనుముల వారి పాలనలో ఎన్ని ఎకరాలు అమ్ముతారు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీ వేదికగా వాడీ వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మంత్రులు.. మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బడ్జెట్ కేటాయింపులు... కాంగ్రెస్ పాలనపై హారీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారని వ్యాఖ్యలు చేశారు.గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘గత సంవత్సరం బడ్జెట్ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్గా క్యాలెండర్గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్నగర్లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను.👉భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?.👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్మెంట్పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్గా క్యాలెండర్గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్నగర్లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
కూల్చే పనిలో కాంగ్రెస్.. అమ్మే పనిలో బీజేపీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవాచేశారు. కొత్త పరిశ్రమలు పెట్టరు.. ఉన్న పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.కొత్త పరిశ్రమలు కావాలని అడగరు ... ఉన్న పరిశ్రమలను ఉంచాలని అడగరు.కూల్చే పనిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ... తూకానికి అమ్మే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం.మంటికైనా ఇంటోడే కావాలని ఊరికే అనలేదుఈ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యంతెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షలు ఈ పార్టీలకు పట్టవు.జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరుఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడ్తరు.బీజేపీ నుండిఎనిమిది మంది ఎంపీలుఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు తెరిచి దీని గురించి మాట్లాడరు.కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించరు.… pic.twitter.com/ov56JVLvsv— KTR (@KTRBRS) March 21, 2025 -
బడే భాయ్.. చోటే భాయ్ ఇద్దరూ ఒక్కటే!
సూర్యాపేట: కేంద్రంలో బడేభాయ్ మోదీ, రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, రేవంత్ అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు.ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్కు పర్సంటేజీలపైనే దృష్టి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. రైతులకు రావాల్సిన రూ.37 వేల కోట్లు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఖాతాల్లో టింగు టింగు అంటూ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని చెప్పారు.చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది.. అలాగే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. సమావేశానికి ముందు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : కేటీఆర్
సాక్షి,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘వచ్చే ఏడాది పాదయాత్ర బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడేమే లక్ష్యం. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం’ అని ధీమా వ్యక్తం చేశారు.మరోసారి కేసీఆరే సీఎంఅంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు.రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి.ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను నంబర్ వన్ చేశారు కేసీఆర్.ఎస్ఎల్బీసీలో విషాదం.. చేపల కూర తింటున్న మంత్రులు ఎస్ఎల్బీసీలో విషాదం జరిగితే మంత్రులు చేపల కూర తింటున్నారు. ఓ మంత్రి నీళ్లు, వాటర్ కలిశాయని అంటున్నారు. గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్పై ద్వేషంతో జిల్లాలో పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఇది. చెరువులు నింపితే బోర్లు ఎందుకు ఎండిపోతాయి. రేవంత్కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఒక్క మాట మాట్లాడదు. ఏం మాట్లాడకముందే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీని గాంధీభవన్ అన్న మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకునే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. -
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. -
‘సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అంటూ మండిపడ్డారు. అంచనాలు భారీగా ఉన్నా, కేటాయింపుల అమల్లో మాత్రం ‘సారీ’ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ‘అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన.అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపైనుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది.అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది.ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని తెలంగాణ బడ్జెట్ నిరూపించింది. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారు. 2024-25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారు. అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మించి అత్యుత్సాహంతో లెక్కలను ప్రకటించింది. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరం.2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోంది.ఇలా ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారు. రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి గురించి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పేరుకైనా లేదు. గత బడ్జెట్లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి.. లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారు. (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని) ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు. అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుంది.అప్పుల విషయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. వ్యవసాయానికి 72,659 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పారు. అందులోనే రైతు రుణమాఫీ యాడ్ చేశారు. కనీసం ఆ రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఈసారి రుణమాఫీ ఊసు లేకుండానే.. వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారు. ఏ ఆకాంక్షలతోనైతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో.. వారి ఆకాంక్షలను తుంగలో తొక్కారు. కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణం. కౌలురైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చెప్పింది చేయకుండా.. చేయనిది చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు.విద్యారంగానికి 2025-26 బడ్జెట్లో కేవలం.. 7.5% నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో.. 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు.ఇది తెలంగాణ విద్యార్థులను నిట్టనిలువునా మోసం చేయడమే. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఎక్కడకు పోయిందో బడ్జెట్ లో చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధుల్లోనూ కేటాయింపులు సగానికిపైగా తగ్గాయి. హామీల్లో అన్నిరకాల పింఛన్లను రూ.4వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు కనీస పింఛన్లు కూడా ఇవ్వడం లేదు. ఈసారి కూడా వీటిపై ఊసులేదు. ఇది చాలా దారుణం.రాష్ట్రంలో వైద్యం పడకేసింది. కనీస వసతుల్లేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా వైద్యరంగానికి బడ్జెట్ పెంచలేదు. ఇది పేదలకు కనీస వైద్యం అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడటంగానే భావించాలి. సమగ్ర సర్వే పేరిట.. బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్ లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసింది. ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పినా.. అమలులో అతీగతీ లేదు.వివిధ కార్పొరేషన్లకు కూడా నిధులను విడుదల చేయకుండా.. వాటిని పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మార్చారు. మొత్తం 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్లో..2.26 లక్షల కోట్ల బడ్జెట్ (74%) ఖర్చుగా.. (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు) కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా (మౌలికవసతులు, ఉద్యోగాలు, దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టుల మీద) ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయం.రాష్ట్ర అభివృద్ధి కుంటుపడితే, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతోంది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. రాష్ట్ర అభివృద్ధికి ఆగిపోతోంది. గత బడ్జెట్ లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించింది.* అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోంది. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్ ను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
‘ ప్రపంచ మీడియా హైదరాబాద్కు రావడం ఇష్టం లేదా?’
హైదరాబాద్: తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ వంటి నగరంలో అందాలు పోటీలు నిర్వహించాలని భావిస్తుంటే, దానికి కేటీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటన్నారు. అందాల పోటీలు నిర్వహించే సత్తా తెలంగాణకు లేదని కేటీఆర్ భావిస్తున్నాడా? అని ప్రశ్నించారు.‘ప్రపంచ మీడియా హైదరాబాద్ కు రావడం కేటీఆర్ కు ఇష్టం లేదా?, అందాల పోటీ లకు ప్రభుత్వం నామినల్ గా ఖర్చు పెడుతుంది. : ఈ కార్ రేసింగ్ వేరు...అందాల పోటీలు వేరు. ప్రభుత్వం డబ్బులు ఎలా ఉపయోగించామనేదే ఇంపార్టెంట్. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది.ప్రభుత్వం తరఫున ఉత్తమమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు.అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని పొన్నం తెలిపారు. -
ఓం భూం.. బుష్..: తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ ను కాంగ్రెస్ మించిపోయిందంటూ ధ్వజమెత్తారు. అంతా ‘ఓం భూం.. బుష్’ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.ఆరు గ్యారెంటీలపై ఆశలు వదలుకునేలా బడ్జెట్ తీరు. గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణం. అభయ హస్తం కాదు....మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదు. వృద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేసిన బడ్జెట్. విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది. రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి.. గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్ తో గోబెల్స్ ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ కు పోలికా?, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే...డొల్ల అని తేలిపోయింది’ అన్నారు... ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే..కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు..ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.... అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు.ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే... అబద్దాలు...అంకెల గారడీ...6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం... అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.హమీలను పూర్తిగా గాలికొదిలేశారు..అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న హామీలను పూర్తిగా గాలికొదిలేసినట్లు ఈ బడ్జెట్ తో తేటతెల్లమైంది. మహిళలకు నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. వ్రుద్దుల పెన్షన్ పెంపును ప్రస్తావించకుండా వారిని గాలికొదిలేసింది. నేటి బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే...కాంగ్రెస్ తిరోగమమన పాలనకు నిలువుటద్దం ఈ బడ్జెట్ అని తేలిపోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదు.కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదుబడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా....ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెటట్ లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదు ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు.వైద్య రంగం అస్తవ్యస్తం..గత ఆర్ధిక సంవత్సరంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ లో కోత విధించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు ఊసు లేదు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయిస్తే.... తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకపోవడం సిగ్గు చేటు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించింది. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.బీసీ కులాల సంక్షేమం ఏది?కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ... బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ ఆసుపత్రుల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచకుండా పేద రోగులను గాలికొదిలేసింది. ఎన్నికల్లో విద్యకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కేటాయింపులను చూస్తే పొంతనే లేదు. వ్యవసాయ రంగాన్ని విస్మరించారు..వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. రైతు సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు... రైతు రాబందు రాజ్యంగా మార్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయడం దుర్మార్గం. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. అయినప్పటికీ బడ్జెట్ లో ఆ ఊసే ప్రస్తావించకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతు కుటుంబాలను దారుణంగా వంచించింది. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం ఇస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం.... వాటికి కేటాయింపులు జరపకపోగా సిగ్గు లేకుండా అబద్దాలను వల్లించడం దారణం.అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడంబడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది. ఆదాయ, వ్యయాలను చూస్తుంటే అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా కాంగ్రెస్ పాలన మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకురావడాన్ని చూస్తుంటే..... అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాళా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో, అవినీతి, దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది.కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
ఆరు గ్యారంటీలు గోవిందా.. బడ్జెట్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కు రావాలి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.తులం బంగారం ఎక్కడ?.ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు. పెండింగ్ నగరంగా హైదరాబాద్..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీళ్లు వదిలారు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ వేళ.. బీఆర్ఎస్ పార్టీ అనూహ్య నిరసనకు దిగింది. ఎండిన వరికంకులతో ఆ పార్టీ సభ్యులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు.ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు. ముందుచూపు లేని దున్నపోతు ప్రభుత్వం ఇది. ప్రాజెక్టులలో నీరు ఉన్నా వదలడం లేదు. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీరు వదిలారు. కేసీఆర్పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోచేస్తున్నారు. 400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండబెట్టారు. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? అని కేటీఆర్ అన్నారు. అని కేటీఆర్ మండిపడ్డారు. -
ఆ రెండేళ్ల కథ ఏంది రేవంత్?
ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుకోవడానికి రెండేళ్లు పడుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ఆయనకు పెద్దగా ఉపకరించేదిగా కనిపించడం లేదు. పైగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుళ్ల పాలన గురించి అనవసరంగా ప్రస్తావించారు. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించి ఉండాల్సింది. బీఆర్ఎస్ పాలనను(BRS Party Rule) తుప్పుతో వర్ణించిన రేవంత్ వదిలిచేందుకు పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్లు పడుతుందని, వైఎస్సార్, చంద్రబాబుల పాలనల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే రేవంత్ చంద్రబాబుకు సన్నిహితుడన్న ముద్ర కలిగి ఉండటం. కాబట్టి ఆయన ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించాలని అనుకుని వైఎస్సార్ పేరును కలిపారా? అనే ప్రశ్న తలెత్తకమానదు. 👉చంద్రబాబు నాయుడు 1994లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి. ఆ తరువాత ఎన్టీఆర్ను కూలదోసి సీఎం అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్కు రెండేళ్లు పట్టిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పదలిచారా?. చంద్రబాబు పాలన అంత అధ్వాన్నంగా ఉందని బహిరంగంగా చెప్పడానికి ఆయన ఇష్టపడతారా?. ముఖ్యమంత్రలు తమ అధికార అవధిలో కొన్ని కొన్ని విధానాలు పాటించడం సహజం. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనో, లేక మరో రకంగానో వైఎస్ పాలన సాగలేదు. వైఎస్ అధికారం దక్కిన వెంటనే చంద్రబాబు పట్టించుకోని జలయజ్ఞం పనులు చేపటారు. హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తోసహా పలు అభివృద్ది పనులు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు అందులో అత్యంత కీలకమైంది. అంతేతప్ప చంద్రబాబు ప్రభుత్వ తీరుతెన్నులపై మాట్లాడుతూ కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ సాధ్యపడదని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేవారు. రాజశేఖరరెడ్డి మాత్రం సీఎం అయిన వెంటనే అమలు చేసి చూపించారు. 👉గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వ్యవస్థ ఎటూ టేకప్ చేస్తుంటుంది. అది వేరే విషయం. వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekar Reddy) టైమ్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఎక్కువగా ఇచ్చింది. దాని వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. దానివల్లే 2009లో కూడా ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే ఆయన అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. వీరెప్పుడూ వైఎస్ పాలనను తప్పు పట్టలేదు. ఈలోగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, దాని వల్ల ఎదురైన పరిణామాలు ప్రధానంగా రాజకీయాలను ఆక్రమించాయి. 2014లో విభజన జరిగిపోయింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యారు. విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 👉కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అప్పట్లో అనేవారు. కేసీఆర్ కూడా అరవై ఏళ్ల సమైక్య పాలనలో లోపాలు అంటూ ఎత్తి చూపుతుండేవారు. వీరిద్దరూ ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఎక్కువ వాటిని అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అందువల్ల ఆయన రెండోసారి పెద్దగా ఇబ్బంది లేకుండా గెలవగలిగారు. ఏపీలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన రెండేళ్లు ఏమిఖర్మ.. ఐదేళ్లపాటు అదే పాట పాడేవారు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్ను తిట్టడానికి ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ఇంతలో ఓటుకు నోటు కేసు రావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదలి హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోయారు. అది అప్పటి కథ. చంద్రబాబు హామీలు నెరవేర్చక పోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైనా ఒకటి, రెండు సందర్భాలలో గత ప్రభుత్వం అంటూ మాట్లాడారేమో కాని, ఎక్కువ భాగం తను ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకోవల్సిన చర్యలపైనే దృష్టిపెట్టారు. తద్వారా ఆరు నెలలలోనే అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారు. వాగ్దానాలు అమలుకు రెండేళ్లు తీసుకోలేదు. మధ్యలో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ ఏపీని నిలబెట్టారు. కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులకు రెండో టర్మ్లో పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది పనులు చేశారు. ఈ ప్రభుత్వాలలో ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని వాటిని సరిదిద్దడానికి రెండేళ్లు పడుతుందని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. కేసీఆర్ రెండో టర్మ్ కూడా గెలిచి 2023లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నిటిని ఏడాది లోపు అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, రైతు బంధు, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి వంటివి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర అమలు చేసే యత్నం చేశారు.. ఇంకా అనేకం పెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలకు ఏడాదికి రూ.2500, స్కూటీల పంపిణీ, పెన్షన్ను రూ.నాలుగు వేలు చేయడం, దళితులకు రూ.పది లక్షల స్కీమ్ మదలైనవి ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి నిధులు అవసరం. మరీ ఎక్కువగా హమీలు ఇచ్చామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తుప్పు వదలించుకోవడానికి పదేళ్లు పడుతుందని చెప్పడం ద్వారా సమస్యను డైవర్ట్ చేయడం ఒక లక్ష్యం అయితే, మరో టర్మ్ కూడా తనను ఎన్నుకోవాలని చెప్పడం మరో లక్ష్యంగా కనిపిస్తుంంది. 👉2024లో ఎన్నికైన చంద్రబాబు కూడా నిత్యం జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతుండడం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెబితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్(Super Six Promises) అంటూ ఊదరగొట్టింది. వాటిని అమలు చేయకుండా ఏవేవో కథలు చెబుతూ, జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను వాస్తవాల నుంచి మళ్లించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని రేవంత్ చెప్పడం లేదు. ఇందులో చంద్రబాబు కూడా కష్టపడుతున్నారని చెప్పదలిచారో, లేక రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం చేయదలిచారో తెలియదు. పరిపాలనపై పట్టు రావడానికి ఇంకా సమయం కావాలని రేవంత్ చెబుతున్నారు. పదిహేను నెలల పాలన తర్వాత ఆయన ఆ మాట అనడం ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అసలు సమస్య పాలనపై పట్టు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోవడం, నిధులు లేకపోవడం , ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వస్తున్నదేమోనన్న భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన వాగ్దానాలకు ఎగనామం పెడుతూ, వాటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అంటూ అరాచకాలు సృష్టించడానికి, గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విద్వంసకర పాత్ర పోషిస్తోంది. హామీల అమలు యత్నంలో చంద్రబాబు కన్నా రేవంత్ కాస్త బెటర్. కానీ ఇద్దరూ గతం తవ్వుతూ కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసీఆర్ రానట్లేనా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(Kalvakuntla Chandrashekar Rao) దూరంగా ఉండనున్నారా?. బడ్జెట్ ప్రసంగంతో పాటు సమావేశాలకూ ఆయన దూరంగా ఉంటారా?. దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని ఆయన తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్ఎస్ శ్రేణుల హడావిడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం(Governor Speech) రోజున కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంతో ఈసారి సెషన్ ఆసక్తికరంగా జరగవచ్చనే చర్చ నడిచింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆయన సెషన్ దూరంగానే ఉంటారని తెలుస్తోంది. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులు నిన్న కేసీఆర్కు బహిరంగ లేఖ ఒకటి రాశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు విన్నవించాలని.. లేకుంటే ఎర్రవెల్లి ఫామ్హౌజ్ వద్ద నిరసనలు చేపడతామని అందులో హెచ్చరికలు జారీ చేశారు కూడా.కేసీఆర్ చివరిసారిగా కిందటి ఏడాది బడ్జెట్ సమావేశాలకు హారజయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతా డొల్ల’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు కూడా. -
ప్రియాంకా.. స్కూటీలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. స్కూటీల ఆకారంలో ఉన్న ప్లకార్డులతో సభ ఆవరణకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.‘ప్రియాంకగాందీ.. స్కూటీలు ఎక్కడ?’అంటూ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు నినాదాలు చేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడుతూ కల్యాణమస్తులో భాగంగా తులం బంగారం ఇవ్వలేమన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పనిచేస్తోందన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ సమస్యలకు కేంద్రంగా మార్చుతోందని శాసనమండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. స్టేషన్ఘన్పూర్ సభలో తామిచ్చిన హామీలు అమలు చేయలేమని స్వయంగా వారే ఒప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
కరువు రైతులను ఆదుకొనే పూర్తి బాధ్యత సీఎందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు కాంగ్రెస్ తెచ్చిందని.. రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎండిన ప్రతీ ఎకరాకు రూ. 25 వేల చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ముంచుకొస్తున్న కరువు ముప్పుపై ముందే హెచ్చరించినా, తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వం చెవికి ఎక్కలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చని పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ జరగక, పెట్టుబడి సాయం అందక ఇప్పటికే అల్లాడుతున్న రైతులకు పంటలు ఎండిపోవడం గోరు చుట్టు మీద రోకటి పోటులా ఉందన్నారు. ఆర్థిక శక్తిని ఆగం చేస్తున్నారు ఆర్థికశక్తిగా ఎదిగిన తెలంగాణను ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని, రాష్ట్రంలో పాలనకు బదులుగా పీడన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. హైడ్రా పేరిట వసూళ్లు, మూసీ సుందరీకరణ పేరిట పేదలపై పగ, ఫార్మాసిటీ పేరిట భూముల దందా జరుగుతోందన్నారు. ఫోర్త్సిటీ పేరిట ముఖ్యమంత్రి కుటుంబం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ట్రిపుల్ఆర్ పేరిట పేదల భూముల ఆక్రమణ జరుగుతోందన్నారు. గతంలో మద్యం వద్దు అంటూ నినదించిన రేవంత్...ఇప్పుడు ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి,హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది.దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాంవన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’అని అన్నారు. బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపుఅంతకుముందు..కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా.రాహుల్ గాంధీకి పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో కృతజ్ఞత సభ పెట్టండి’అంటూ బీసీ సంఘాల నాయకులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ కులగణన సర్వేపై రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీని. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం.50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి.ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం.పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం.పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్న మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం.దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే.కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది.కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాంలెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది.పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే.ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు.కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటు చేయండి’అని సూచించారు. -
బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి అరెస్ట్
హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్శిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే వీరికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించి వారితో పాటు నిరసనకు దిగారు. దాంతో మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆపై అసెంబ్లీకి పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. పోలీస్ వాహనం దిగకుండా మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు పోలీస్ వాహనంలో ఎందుకు తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తల్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాలనపై పట్టుకు మరికొంత సమయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘అందరినీ సమన్వయం చేసుకుంటూ.. సుపరిపాలన అందిస్తే పాలనపై పట్టు సాధించినట్లు.. నేను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. దీనికి మరికొంత సమయం పడుతుంది. పాలనపై నాకు ఇంకా పట్టురా లేదని కొందరు అంటున్నారు. పాలనపై పట్టు అంటే ఏంటి? ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, ఓ ఇద్దరు అధికారులపై కేసులు పెట్టి జైలుకు పంపించడమా?’’ అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.యువతకు భవిష్యత్తు ఇవ్వడానికే..రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథ కాన్ని తీసుకువచ్చినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన యువత.. ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిస లుగా మారుతున్నారు. ఇదో పంజాబ్, కేరళ మాదిరిగా మారుతోంది. అలాకాకుండా యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. రూ.6 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రాయితీ పద్ధతిలో ఆర్థిక సహకారం అందిస్తాం. ఇది పార్టీ పథకం కాదు.. పూర్తిగా ప్రజలు, అర్హులైన నిరుద్యోగులకు అమలు చేసే పథకం. పూర్తిగా ప్రజల పథకం’’ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు అమలు చేశామని, పథకాలు, సంస్కరణలు తీసుకువచ్చాని రేవంత్ చెప్పారు.అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపం..రాష్ట్రంలో బీసీ జనాభా 56.36శాతం ఉందని కుల సర్వే ద్వారా తేల్చామని, వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గినా, అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించం. దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇసుక విక్రయంతో రోజువారీ ఆదాయం రూ.3 కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 నుంచి 6.6శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి..’’ అని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుంచి రూ. 4లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని.. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది వరకు లబ్ధి కలిగిస్తామని, నిజమైన నిరుద్యోగులకే పథకం అందిస్తామని వివరించారు.నిరుద్యోగ యువత కాళ్లపై నిలబడేలా..: భట్టిగత ప్రభుత్వం దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా గ్రూప్–1 నియామకాలు చేపట్టలేదని.. తాము కేవలం ఏడాదిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడేలా, సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేలా స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రాజీవ్ యువ వికాసాన్ని తీసుకువచ్చారని భట్టి పేర్కొన్నారు. లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించి, సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు. -
కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘నైతిక విలువలపై అసెంబ్లీలో చిలుక పలుకులు పలికిన సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో బజారు భాష మాట్లాడారు. రాజ కీయాల్లో హద్దు దాటకూడదని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించాం. మేం కూడా రేవంత్ బట్టలు విప్పితే.. ఆయన బయట తిరగలేడు. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల సంగతులు, సాగర్ సొసైటీలు, మైహోమ్ భుజ వ్యవహారాలను మేం మాట్లాడగలం. ఢిల్లీలో ఆయన గోడలు దూకిన విషయాలు చెప్పగలం. రేవంత్ దాటిన ‘రేఖలు, వాణిలు, తార’ల గురించి.. ఎక్కువగా మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెట్టగలం..’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి తాము నోరు విప్పితే ఆయనకు ఇంట్లో తిండి కూడా పెట్టరని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లాబీలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం అప్పుడు గుర్తుకురాలేదా? తనపై 15 కేసులు పెట్టిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజాస్వామ్య విలువలు, కుటుంబం ఇప్పుడు గుర్తుకువస్తున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మాపై అసహ్యకరమైన ఆరోపణలు చేసి సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లలను రాజకీయాల్లోకి లాగిన రోజు మాకు కుటుంబాలు లేవా? మీకు విలువలు లేవా? ప్రస్తుతం తన భార్యాబిడ్డల గురించి మాట్లాడుతున్న రేవంత్కు.. మాకు కూడా కుటుంబాలు ఉంటాయనే విషయం గుర్తుకురాలేదా?’’అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరేమిటో తెలుసని, బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో మూటల లెక్కలూ ఉన్నాయేమో! ‘‘ఈ ఏడాది రూ.70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ అప్రూవర్గా మారి నిజం ఒప్పుకున్నారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం, కోవిడ్ సంక్షోభం వంటివేవీ ఇప్పుడు లేకున్నా సీఎం రేవంత్ విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్. రాష్ట్ర అప్పులపై రేవంత్ చెప్తున్న కాకి లెక్కల్లో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్లకు ఇచి్చన మూటల లెక్కలు కూడా ఉన్నాయేమో’’అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్కు గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదని మండిపడ్డారు. భూముల అమ్మకంపై సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాలన చేతకాదనే మాటలను నిజం చేస్తున్నారు.. ‘‘తెలంగాణకు నాయకత్వ లక్షణాలు లేవు, పాలన చేతకాదనే సమైక్యాంధ్ర పాలకుల మాటలను రేవంత్ నిజం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలు విచక్షణతో మాకు పగ్గాలు అప్పగించారు. కాబట్టే పునాదులు గట్టిగా పడ్డాయి. లేదంటే తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయేది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సీఎం రేవంత్ రహస్య మీటింగ్లపై కాంగ్రెస్, బీజేపీ స్పందించడం లేదని.. ఆ ఆరోపణలు అవాస్తవమైతే రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా–ఈ రద్దుపై విచారణ జరిపిస్తాం.. ఫార్ములా–ఈ రేసును తప్పుబడుతున్న రేవంత్ ప్రభుత్వం.. రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు పెడుతోందని కేటీఆర్ నిలదీశారు. ‘‘ఫార్ములా–ఈ’ను ఏకపక్షంగా రద్దు చేయడంతో ప్రభుత్వానికి జరిగిన నష్టంపై మా ప్రభుత్వం వచి్చన తర్వాత విచారణ జరిపిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడితే.. వారు జర్నలిస్టులే కాదంటూ, బట్టలు విప్పుతానంటూ సీఎం దూషణకు దిగుతున్నారు. గాడ్సే మూలాలు కలిగిన రేవంత్ జాతిపిత లాంటి కేసీఆర్పై చిల్లరగా మాట్లాడుతూ అభినవ గాడ్సేలా తయారయ్యారు’’అని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎంఐఎం విషయంలో తమ వైఖరిపై పునరాలోచించుకుంటామని చెప్పారు. -
చట్టసభలు ఒక్కరివి ఎలా అవుతాయి?
శాసనసభలో ప్రతిపక్షం తరపున ప్రసంగించేటప్పుడు వ్యూహాత్మకంగా ఉండాలి. అధికార పక్షం డైవర్ట్ చేసే అవవకాశం ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ్లకంట జగదీశ్ రెడ్డి అధికార కాంగ్రెస్ వేసిన ట్రాప్లో పడినట్లు అనిపిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి ఈ సెషన్ వరకు సస్పండ్ చేశారు. నిజానికి ఇందులో జగదీశ్ రెడ్డి చేసిన పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది. సభ ఎవరిది అన్న ప్రస్తావన తెచ్చి అందరిది అని, అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ ఉన్నారని, అది ఆయన సొంతం కాదని జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆధారంగా మంత్రులు శ్రీధర్ బాబు, తదితరులు పెద్ద రగడ సృష్టించారు.స్పీకర్ను, అందులోను దళిత నేతను అవమానించారంటూ ఆక్షేపిస్తూ, జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఉండాల్సింది. తాను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడుతున్న సంగతిని ఆయన మర్చిపోయారు. ఆ స్పీచ్లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగించారు. ఆ క్రమంలో ఒకసారి మంత్రి కోమటి రెడ్డి అడ్డుపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జోక్యం చేసుకుని జగదీశ్ రెడ్డి ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన సంవాదంలో జగదీశ్ రెడ్డి తన మానాన ఉపన్యాసం కొనసాగించకుండా తాను ఏమి తప్పు చేశానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతానని అన్నారు. అక్కడే ఆయన పొరపాటు చేసినట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అవుతోందని, పిట్టకథలతో ఆయా అంశాలు వివరిస్తూ జగదీశ్ రెడ్డి మాట్లాడారు. నాలుగు బర్రెల కథ అంటూ ఒక స్టోరీ చెప్పినప్పుడు చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ సూచించారు. తాను చర్చను పక్కదారి పట్టించ లేదని, ఒక్క అక్షరమైనా పక్కదోవ పట్టించినట్లు తేల్చాలని, సభలో ఉండమంటే ఉంటా.. పొమ్మంటే పోతా.. అంటూ ఆవేశంగా తన చేతిలో ఉన్న నోట్స్ను బల్లపైకి విసిరారు. నిజానికి జగదీశ్ రెడ్డి ఇంత ఆగ్రహం చెందాల్సిన అవరమే కనిపించదు. జగదీశ్ రెడ్డి స్పీకర్ను బెదిరిస్తున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సలహా ఇచ్చారు. అప్పుడైనా ఈయన సర్దుకుని ఉండాల్సింది.స్పీకర్ జోక్యం చేసుకుని మీరు సీనియర్ సభ్యులు, పదేళ్లు మంత్రిగా పనిచేశారు. సహనంగా ఉండాలని, సంప్రదాయాలను పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ మాట జగదీశ్ రెడ్డికు మరింత కోపం తెప్పించిందట. తాను ఏ సంప్రదాయాన్ని ఉల్లంఘించానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతా అని ఆయన అన్నారు. అప్పుడు తనను ప్రశ్నించడమే సంప్రదాయ విరుద్ధమని ప్రసాదకుమార్ జవాబు ఇచ్చారు. అప్పుడైనా జగదీశ్ రెడ్డి సంయమనం పాటించి తన స్పీచ్ కంటిన్యూ చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఈ సభ అందరిది అని, సమాన హక్కులు ఉంటాయని, పెద్దమనిషిగా స్పీకర్ ఉంటారని, మీ సొంతం కాదని అనడం వివాదంగా మారింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది.స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు అయితే ఏకంగా స్పీకర్ను జగదీశ్ రెడ్డి దూషించారని విమర్శించారు. నిజానికి జగదీశ్ రెడ్డి దూషించిందేమీ లేదు. నీ సొంతం కాదు అనడం అభ్యంతరం అయితే అవ్వవచ్చు. అందులో దూషణ ఏమీ లేదు. కాని అధికార పక్షం ఆయా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం జరుగుతుంటుంది. గతంలో స్పీకర్ పై కాగితాలు విసిరిన కారణంగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ల సభ్యత్వమే రద్దు చేసిన విషయాన్ని అధికార పక్షం గుర్తు చేసింది. ఈ దశలో అయినా జగదీశ్ రెడ్డి వెనక్కి తగ్గి సారీ చెప్పేస్తే అయిపోయేది. ఆయన అలా చేయలేదు. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వక తప్పలేదు. దీంతో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వాదనను ఎఫెక్టివ్గా వినిపించే అవకాశాన్ని జగదీశ్ రెడ్డి కోల్పోయారు. ఆ తర్వాత సభ నుంచి సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేయడం, తదుపరి అదే ప్రకారం సెషన్ అంతటికి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఈ మాత్రానికి సెషన్ అంతా సస్సెండ్ చేయడం కూడా అంత సమంజసం కాదు. జగదీశ్ రెడ్డి తప్పుగా మాట్లాడారని అనుకుంటే ఒక రోజు సస్సెండ్ చేసి ఉంటే సరిపోయేది. తప్పు చేయలేదని, హరీష్ రావు కేటీఆర్లు అన్నప్పటికి, పరిస్థితిని బట్టి మసలుకోకపోతే వారికే నష్టం జరుగుతుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఉండడానికి ఇలాంటి ఘటనలను వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అది కరెక్టో, కాదో తెలియదు కాని, ఈ మొత్తం వ్యవహారంలో జగదీశ్ రెడ్డి చేసింది పెద్ద తప్పు కాకపోయినా సెషన్ అంతా సస్పెండ్ అవడం, కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడినట్ల అయిందనిపిస్తుంది. ఇలాంటివి ఉమ్మడి ఏపీలోనూ అనేకసార్లు జరిగాయి. ప్రత్యేకించి అధికారపక్షం వారు విపక్ష సభ్యులు బాగా మాట్లాడుతున్నప్పుడు వారి భాషణలో ఏదైనా ఒక్క పదం దొరికితే, దానిమీదే రచ్చ చేసి మొత్తం చర్చను డైవర్ట్ చేస్తుంటారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరా హోరీగా చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. టీడీపీ హయాంలో ప్రతిభా భారతి స్పీకర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో కుతూహలమ్మ డిప్యూటి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. వెంటనే అధికారపక్షం దళిత, మహిళ కార్డులను బయటకు తీసి విపక్షాన్ని ఇరుకున పెట్టడానికి యత్నిస్తుంది. విపక్షం కూడా అలా ప్రయత్నం చేస్తుంటుంది కాని, వారికి తక్కువ అవకాశాలు లభిస్తాయి. జగదీశ్ రెడ్డి కాస్త సంయమనంగా వ్యవహరించి ఉంటే, కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్కి అవకాశం ఉండేది కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు కూడా విపక్ష సభ్యుడిపై ఇంతటి సీరియస్ చర్య తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి సంకేతం పంపించలేదు. నిజానికి ఈ సభ అందరిది అన్నది వాస్తవమే. - కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవాహారాల వ్యాఖ్యాత -
‘తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు బీజేపీకే నష్టం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన, టీడీపీతో పొత్తు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే ఎవరో బాగా తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో చిట్బాట్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూటమి గురించి బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయవద్దు. జనసేన, టీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ నష్టం జరుగుతుంది. అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతోంది. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుతోందన్నారు.రాజాసింగ్ కామెంట్స్ స్పందిస్తూ..‘తెలంగాణ ప్రజలకు పాత ఇనుప సామాను అంటే అందరికీ తెలుసు. పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. రాజాసింగ్ తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకులు. ప్రధాని మోదీకి ఇక్కడ ఏం జరుగుతుందో పిన్ టూ పిన్ రిపోర్ట్ వెళ్తుంది. అధిష్ఠానం అంతా గమనిస్తోంది. పార్టీకి మంచి జరిగేది నలుగురిలో చెప్పాలి.. చెడు జరిగేది అధిష్ఠానం చెవిలో చెప్పాలి.పార్టీ ప్రెసిడెంట్గా ఈటల, అరవింద్, రామచందర్ రావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఎవరో ఒకరు అవుతారు. అధ్యక్షుడితో పాటు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పెడితే బాగుంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేకంగా ఇంచార్జ్లను పెట్టాలి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రక్షాళన చేస్తారని వినిపిస్తోంది. అదే జరిగితే కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి మంత్రి పదవులు పోతాయి అంటున్నారు అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
రేవంత్.. నువ్వు దాటిన రేఖలు బయట పెట్టాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాసిప్స్ బంద్ చేసి.. గవర్నరెన్స్పై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు. కుటుంబాలు మాకు లేవా? అని ప్రశ్నించారు. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది. రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు. 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి. పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?.నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు. మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు. కేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మల్లికార్జునఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు?.బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ను ఎందుకు ఖండించటం లేదు. రాజాసింగ్ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి.గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి. కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా?. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా?. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న మాకు ఎవరు ఏంటో అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాం’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు..
Telangana Assembly Session Updates..తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం: సీఎం రేవంత్శాసనసభలో సీఎం రేవంత్ కామెంట్స్..కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నాంతెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాంపొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదుఏపీలో కూడా ఇదే పేరుతో యూనివర్సిటీ ఉంది.అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నాం.తెలుగు వర్సిటీ ఆయన పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించాం.రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు.బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతాం.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ పేరును కూడా మార్చుకున్నాం. ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వంబిల్లులను ప్రవేశపెట్టేముందుకు స్పీకర్ అనుమతి కోరిన మంత్రి శ్రీధర్బాబుఅసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లుఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం 👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్..శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందిశాసనసభ గాంధీ భవన్ కాదు.తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్.ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా జీరో అవర్ ప్రారంభిస్తారు?నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది.. మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి?.శాసనసభలో కొత్త సాంప్రదాయం ఏంటి?తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం.సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ.మేము అడిగిన ప్రశ్నను సమాధానం ఇవ్వడం లేదు.శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడవడం లేదు.శాసనసభలో నిబంధనలు పాటించడం లేదు.నిబంధనల ప్రకారం శాసనసభ నడవడం లేదని వాకౌట్ చేసిన ఎంఐఎం20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం: భట్టి2030 నాటికి 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంసౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్పై ప్రభుత్వం ఫోకస్పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంపెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాంరాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందిప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నాంకాంగ్రెస్పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్ గంగుల.. 👉విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్ఎస్ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు. -
కేసీఆర్ పాలనలాగే రేవంత్ పాలన
సాక్షి, హైదరాబాద్: అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం, లిక్కర్ దోపిడీ, అక్రమ భూముల వ్యవహారం, భూముల అమ్మకాలు, అప్పులు చేయడం, అహంకారపూరిత వ్యవహారశైలి గత బీఆర్ఎస్ పాలన తరహాలోనే ఇప్పుడూ ఉందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలుచేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రూ.152 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తుచేశారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు చేయటంలో గత బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్కు తేడా లేదని విమర్శించారు.నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే, కాంగ్రెస్ పారీ్టల వైఖరి వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, డీలిమిటేషన్ను బూచిగా చూపించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో జరిగిన పాపాల చిట్టా విప్పుతా..19, 20 తేదీల్లో బట్టబయలు చేస్తా. ఇప్పటివరకు చెప్పింది ఇంటర్వెల్ వరకే...అసలు సినిమా ముందుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేతుల బెడితే పదేళ్లలో రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. రూ.లక్ష కోట్లు వెనకేసుకున్నారు. అప్పులకు అసలు, మిత్తీ కలిపి ఏడాదిలో రూ.1.53 లక్షల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బే ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేవి..’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో జరిగిన ‘ప్రజాపాలన ప్రగతి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పుల్లోనే పథకాల అమలు ‘కేసీఆర్ పాలించిన ఆ పదేళ్లలో ధనిక రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. ఆనాడు నెలకు అసలు, వడ్డీ కలిపి రూ.500 కోట్ల అప్పు ఉంటే ఈనాడు ప్రతినెలా వడ్డీ రూ.6,500 కోట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేసీఆర్ పాలనలో రూ.8.29 లక్షల కోట్లు అప్పు తేలింది. అయినా అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశాం. ఈ మహాలక్ష్మి పథకంతో నేటికి 150 కోట్ల మంది ఆడబిడ్డలకు గాను రూ.5,005 కోట్లు ఖర్చు చేశాం. 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నాం. అప్పుల పాలైన రాష్ట్రంలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్, 25.35 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణమాఫీకి శ్రీకారం చుట్టాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టులు, పథకాలపై చర్చకు రావాలి ‘కృష్టా, గోదావరి జలాల ప్రాజ్టెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. అందులో రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయి కూలేశ్వరంగా మారింది. తాటిచెట్టులా పెరిగిండ్రు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివి లేదు.. నేను హరీశ్రావుకు సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై చర్చకు రావాలి. 300 టీఎంసీలతో శ్రీరాంసాగర్, 200 టీఎంసీల నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు జూరాల, నెట్టెంపాడు, దేవాదుల, రాజీవ్, ఇందిరాసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి పక్కా శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పారదర్శక పాలనకు అద్దం పడతాయి. కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో సాగునీరు రాకున్నా కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేలా తోడ్పాటు అందించాం. కొనుగోలు చేసిన ప్రతి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. ఈ విషయాలపై విమర్శలు చేస్తున్న హరీశ్రావు, కేటీఆర్ పిల్లకాకులు. కేసీఆర్ను రమ్మన్నా..ఏ ప్రాజెక్టు వద్ద మాట్లాడుదాం రమ్మంటున్నా..’ అని రేవంత్ అన్నారు. జనగామ జిల్లా శివునిపల్లిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు ∙సభకు హాజరైన మహిళలు ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు.. ‘అధికారం పోతే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ ఫామ్హౌస్లో పడుకొని ఉసిగొల్పుతుండు. అందుకే ఫామ్హౌస్లో నుంచి లేచి రమ్మన్నా. రూ.58 లక్షల ప్రజాధనం జీతభత్యాల కింద తీసుకున్నారు. ఏ రంగంలో జీతగాళ్లకైనా పని చేయకుంటే జీతం ఇస్తారా? అపార రాజకీయ అనుభవజు్ఞడైన కేసీఆర్ అ«ధికారం ఉంటే వస్తరు.. లేకుంటే అలిగి పండ్తరా? మీరైతే లక్షల కోట్లు సంపాదించి ఫామ్హౌస్లు, టీవీలు, పేపర్లు పెట్టుకున్నరు. నువ్వు గజ్వేల్, నీ కొడుకు జన్వాడ, నీ అల్లుడు మొయినాబాద్, నీ బిడ్డ శంకర్పల్లిలో ఫామ్హౌస్లు కట్టుకున్నరు. కానీ తెలంగాణ రైతులు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరు క్యాప్సికమ్ పండించి కోట్లు సంపాదించిన తీరు వారికి, నిరుద్యోగ యువతకు చెప్పరా? అధికారం పోగానే దివిసీమ తుపాను బాధితుల కంటే ఎక్కువ ఆందోళనలో కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని హరీశ్రావు అంటున్నడు. జాతిపితకు, కేసీఆర్కు ఏమైనా పోలిక ఉందా? అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా? అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. హరీశ్రావు చెప్పే జాతిపిత ఫామ్హౌస్లో పడుకుంటున్నారు. తెలంగాణ జాతిపితలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్..’ అని సీఎం పేర్కొన్నారు. మా మీద ప్రజలకు కోపం ఎందుకుంటుంది... ‘ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్లే పయనంలో మహిళల అభ్యున్నతికి పాటు పడుతుంటే మాపై ప్రజలకు కోపం ఉందని చెబుతున్నారు. మాపై కోపం ఎందుకు ఉంటుంది? 65 లక్షల మందికి సారెచీర ఇచ్చినందుకా? వెయ్యి సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినందుకా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ తయారీతో శ్రీమంతులు చేసినందుకా? రూ.20,617 కోట్ల పంట రుణమాఫీ చేసినందుకా? రూ.500 బోనస్ ఇస్తూ రైతు భరోసా రూ.12 వేలకు పెంచినందుకా? మీడియా మిత్రులకు ఇళ్లపట్టాలు ఇచ్చినందుకా?..’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న దొంగలకు ఉప్పు పాతర వేస్తా అన్నందుకు దోపిడీ వర్గాలకు నాపై కోపం ఉంటుంది తప్ప ప్రజలకు ఉండదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు: పొంగులేటి ‘గత బీఆర్ఎస్ పాలకులు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు..’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావట్లేదన్నారు. సభలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రామచంద్రునాయక్, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.