-
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
అందుకే సహనం కోల్పోయా.. దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని.. తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.శనివారం ఆయన హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. అసభ్యకర పదాలతో దూషించారని పేర్కొన్నారు.కాగా, శాసనసభలో శుక్రవారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. హైదరాబాద్లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. -
భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు: ప్రశాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిన్నటి(శుక్రవారం) వరకు జరిగినవి బడ్జెట్ సమావేశాలు కావు, అవి బుల్డోస్ చేసే వాటిలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీలో జీరో ఆవర్ మొత్తానికే రద్దు చేశారు. కేవలం 6 రోజులే సమావేశాలు సాగాయి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై చర్చనే జరగలేదు. నాకు అవకాశమే ఇవ్వలేదు. అన్యాయంగా నేను మాట్లాడకుండా నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఏరోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారు. మార్షల్స్ను పెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి పంపించారు. .. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు, హావభావాలు మొత్తం చూసి నాకు బాధేసింది. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషను సైతం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాలది పైచేయి అవుతుంటే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసి, చర్చను మరుగున పడేశారు. ఈ సభ మొత్తం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ణు తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, మమ్మల్ని బెదిరించటంతోనే సరిపోయింది... నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. జాబ్ క్యాలండర్లో స్పష్టత లేదు. రైతు భరోసా నిధుల మాటే లేదు. జాబ్ క్యాలండర్కు చట్టబద్దత ఏది? రుణమాఫీ అంశం క్లారిటీ లేదు. మైక్ ఇవ్వరు, అడిగితే మార్షల్స్ను పెట్టి ఎత్తిపడేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఆయన అంటున్నారు. భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు. అసెంబ్లీ లో మహిళ ఎమ్మెల్యేలు కంట తడి పెట్టుకున్నారు. ఏం మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారని డిప్యూటీ సీఎం అన్నారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చానని సబితా ఇంద్రారెడ్డి బాధపడుతూ చెప్పారు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. -
వదిలిపెట్టం, అవసరమైతే ఢిల్లీకి..: అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: గత రెండు రోజుల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారాయన. పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలతో సహా సందేశం ఉంచారాయన.పోరాటం మాకు కొత్త కాదు ✊ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతంవదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0— KTR (@KTRBRS) August 3, 2024నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్కు హరీష్రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. .. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను’’ అని లేఖలో అన్నారు. -
ఏయ్.. తోలు తీస్తా కొడకల్లారా.. బయట కూడా తిరగనివ్వ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్లో ఉందని, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందాం.. అంటూ నాగేందర్ కూడా వారితో బాహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్ఎస్ సభ్యులను వారి పార్టీ, కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. ఖండించిన అక్బరుద్దీన్ సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచి్చ. దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని, సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశా>రు. బీఆర్ఎస్ సభ్యులు కూడా అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్ఛరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయి తే, తాను మాట్లాడింది హైదరాబాద్ నగర మాండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనటం కొసమెరుపు. మాట్లా డేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ను బీఆర్ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
బజారుభాషతో రేవంత్ పైశాచిక ఆనందం
సాక్షి, హైదరాబాద్: జాబ్ కేలండర్పై చర్చించాలని అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారినవారితో బజారుభాషలో తిట్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాడిస్ట్ సీఎం రేవంత్ అందరినీ ఉసిగొల్పుతూ దిగజారుడు..దివాలాకోరుతనంతో వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. శాసనసభలో ఇది చీకటిరోజు అని, అధికార పక్షం బజారుభాష వినలేక సభ నుంచి బయటకు వచ్చేశామన్నారు. బోగస్ జాబ్ కేలండర్ పేరిట మోసగిస్తున్న కాంగ్రెస్ నాయకులను యువత ఎక్కడికక్కడ నిలదీసి కొట్టాలన్నారు.గన్పార్కు అమరుల స్తూపం వద్ద కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు హైదరాబాద్ అశోక్నగర్కు వచి్చన రాహుల్గాంధీ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని డ్రామా చేశారన్నారు. దమ్ముంటే రాహుల్గాంధీ, రేవంత్ అశోక్నగర్కు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచి్చనట్టు రుజువు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ రాజీనామా చేస్తామని చెప్పారు. రేవంత్ మగాడైతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావాలంటూ సవాల్ చేశారు. మార్పు పేరిట నిరుద్యోగులను మభ్య పెట్టిన రేవంత్ను తన్ని తరమడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. జాబ్ కేలండర్పై అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం పారిపోయినందునే గన్పార్క్ వద్ద నిరసన తెలుపుతున్నామన్నారు. శాసనసభ చరిత్రలో బ్లాక్ డే: హరీశ్రావు అసెంబ్లీ చరిత్రలో ఇది బ్లాక్ డే అని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా సభా నాయకుడే తిట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ రౌడీïÙటర్ భాషతో కన్నతల్లులను అవమానించేలా మాట్లాడుతున్నాడని, ఉద్యమ సమయంలోనూ ఇలాగే మాట్లాడాడని చెప్పారు. హైదరాబాద్ ఏమైనా ఆయన జాగీరా అని ప్రశి్నస్తూ, దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాబ్ కేలండర్పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన చిత్తు కాగితంలా ఉందన్నారు. అశోక్నగర్కు సమయం, తేదీ చెబితే..తామూ వస్తామని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడిన దానం నాగేందర్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. పోస్టులు పెంచాలని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలతో... జాబ్ కేలండర్పై చర్చించాలంటూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది. అయితే దానం వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించక పోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశ మందిరం నుంచి మూకుమ్మడిగా బయటకు వచ్చారు. లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచి్చన హామీని ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. దీంతో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ గన్పార్కుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో గన్పార్కు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్కు నుంచి వెళ్లాలని పోలీసులు కోరినా బీఆర్ఎస్ నేతలు నిరాకరించడంతో కేటీఆర్, హరీశ్రావు సహా ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని తెలంగాణ భవన్కు నేతలను తరలించే క్రమంలో గన్పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పలువురు నిరుద్యోగులు కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
ధరణి పేరుతో పెద్దాయన దగా చేశారు
సాక్షి, హైదరాబాద్: ధరణి పేరుతో పెద్దాయన రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. 2020లో తెచ్చిన ఈ పోర్టల్ వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయా రన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ‘తెలంగాణ భూ హక్కులు–సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన లఘుచర్చలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆ పెద్దమనిషి చేసిన పాప ఫలితాన్ని తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రిగా 1973లో పీవీ నరసింహారావు భూపరిమితి చట్టం తెచ్చి భూస్వాముల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారన్నారు. 2006లో వైఎస్.రాజశేఖరరెడ్డి తొలిసా రిగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూ ములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ గిరిజనులు వైఎస్ పట్టా భూములుగానే చెప్పుకుంటున్నార న్నారు. ఎవరి సూచనలు, అభిప్రాయా లను తీసుకోకుండా పెద్దాయన, ఆయన తొత్తుగా ఉన్న ఓ అధికారి కూర్చొని చేసిన చట్టం ధరణి అని...ఇప్పటికీ 1.18 లక్షల భూ ఫిర్యాదులు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు.ధరణి పేరుతో పేదల దగ్గరి నుంచి గత ప్రభుత్వం లాక్కొన్న ఆస్తులను తిరిగి పేదలకు పంచుతామని, మాయమైపోయిన లక్షల ఎకరాలను అర్హులైన వారికి ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ నవాబ్ నాటి దోపిడీని తలపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను దోపిడీ చేసిందన్నారు. «ధరణి.. ఓ విప్లవం: పల్లారాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేయాలనే కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసు కొచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అందరితో చర్చించిన తర్వాతే ధరణి తెచ్చారని, నాలుగు గో డల మధ్య తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బీలో చేరిస్తే, అందులో కూడా 10 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పారు. వివిధ కారణాల వల్ల కొన్ని భూము లు నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.రైతుల ఆత్మహత్యలు, హత్యలకు ధరణే కారణం: సీతక్కధరణి ఎంతో అద్భుతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చెబుతుండగా మంత్రి సీతక్క కలగజేసుకున్నారు. ధరణి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు, హత్యలు పెరిగాయని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తుంగలో తొక్కారని, దీంతో పేదలు భూముల్లో ఫాంహౌస్లు వెలిశాయని చెప్పారు. భూమిని ఎవరు సాగుచేస్తున్నారో తెలిపే కాలమ్ను తొలగించారని విమర్శించారు.సోమేశ్కుమార్ మాయలో కేసీఆర్ పడ్డారు: కూనంనేని ధరణితో గ్రామాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్ప డిందని, ప్రజలకు పనికి రాని ఈ పోర్టల్ను రద్దు చేయడం సరైందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమేశ్కుమార్ మాయలో పడిన కేసీఆర్ ధరణితో ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగించారని చెప్పారు. కాంగ్రెస్ చేపట్టే సంస్కరణల్లో కాస్తు కాలమ్ పెట్టాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు.అవినీతిపరుల పేర్లు ఎందుకు చెప్పడం లేదు: మహేశ్వర్రెడ్డి ధరణితో లక్షల ఎకరాల భూములు మాయమ య్యాయని, రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించిందని, ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు బయటపె ట్టడం లేదని బీజేపీ పక్షనేత మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ధరణితో లాభపడ్డ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ధరణి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు.వక్ఫ్ భూములను పరిరక్షించిన వైఎస్: అక్బరుద్దీన్ ఒవైసీ అనేక లోపాలతో తీసుకొ చ్చిన ధరణి పోర్టల్ కారణంగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిందని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందని ఎంఐఎం పక్షనేత అక్బరు ద్దీన్ ఒవైసీ అన్నారు. ధరణి తో ఎంతోమంది అక్రమంగా ప్రభుత్వ, పేదల భూములను తమ పేరిట చేసుకున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపాలని కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వక్ఫ్ భూముల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని, ఆయన గొప్ప నేత అని అక్బరుద్దీన్ గుర్తు చేసుకున్నారు. రెండోసారి వక్ఫ్బోర్డు భూములను సర్వే చేయించింది వైఎస్ అని చెప్పారు. -
జాబ్ క్యాలెండర్ బోగస్.. బీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. నిరుద్యోగులను మభ్యపెట్టలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ బోగస్.. ఉద్యోగాలు లేవు. తెలంగాణ యువత కాంగ్రెస్కు బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందంటూ కేటీఆర్ ధ్వజమ్తెతారు. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేసినా కానీ కనీసం రెండు నిమిషాలు కూడా మైకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. యువతను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న కేటీఆర్. రాహుల్గాంధీ, రేవంత్ అశోక్నగర్కు వస్తే యువత తరిమేస్తుందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి.. ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీని అధికారంలో తెచ్చే వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం(ఆగస్టు2) ఢిల్లీలో అర్వింద్ మీడియాతో మాాట్లాడారు. నాకు సమర్థత ఉందని నేను అనుకుంటున్నా. కానీ అధిష్టానం గుర్తించాలి. రుణమాఫీ మొత్తం పూర్తయ్యే వరకు ఆగి మాట్లాడితే బాగుంటుంది. కేసీఆర్ పాలనలో అసెంబ్లీ జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీలో అందరూ మాట్లాడుతున్నారు.గతంలో కొందరు కన్ను మిన్ను కానకుండా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని అనేకసార్లు కేసీఆర్ జైల్లో పెట్టారు. రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు కేసీఆర్పై చర్యలు తీసుకోవడం లేదు అని అర్వింద్ ప్రశ్నించారు. -
కేసీఆర్ ఆబ్సెంట్తో అసెంబ్లీలో కిక్కులేదు: రాజగోపాల్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల సభలో తమకు కిక్కు రావడం లేదని, కేసీఆర్ వస్తే మజా వస్తదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం(ఆగస్టు2) రాజగోపాల్రెడ్డి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షనేత హోదా కేటిఆర్, హరీశ్లలో ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఆగం అవుతుందన్నారు. ‘హరీశ్ రావు వర్కర్ ..కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్కు అవగాహన లేదు. విద్యుత్ మీద డిస్కషన్లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. కేసిఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. ఆయన ఊహల్లో బతుకుతుండు అని రాజగోపాల్రెడ్డి సెటైర్లు వేశారు. -
కోదండరామ్కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
రేవంత్.. యూఎస్ వెళ్లాక సీఎం కుర్చీకి ఎసరే: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సీఎం అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలి. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పాయింట్ వద్ద కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ.. మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు.హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి. హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. నా జీతం నుంచి నాలుగు లక్షలు వారికి ఇచ్చాను. హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం రేవంత్ ఇంటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుకున్నారు. కాగా, నిన్న ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి చర్యలు జరిపిన విషయం తెలిసిందే.కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవలే తాను తిరిగి బీఆర్ఎస్లో చేరుతానంటూ బండ్ల కామెంట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి.. బండ్లతో చర్చ జరిపారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం పార్టీలోకి వస్తున్నట్టు సమాచారం. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్..తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదాతొమ్మిది రోజుల పాటు సాగిన శాసన సభ సమావేశాలు32ప్రశ్నలు సమాధానాలు ఇచ్చిన శాసన సభ...8ప్రశ్నలకు సమాధానం రాలేదని తెలిపిన స్పీకర్ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపనున్నా మంత్రులు23 జులై నుంచి ఆగస్టు 2వరకు జరిగిన శాసన సభ65 గంటల 33 నిమిషాలు సాగినా శాసన సభ132 ప్రసంగాలు సభలో ఎమ్మెల్యేలు చేసినట్లు స్పీకర్ ప్రకటనగవర్నమెంట్ రెజల్యూషన్ 1, 5 బిల్లు ఆమోదం, 2 షాట్ డిస్కషన్, 3 మోషన్స్ పై చర్చ జరిగినట్లు ప్రకటనశాసన సభలో ఒక ప్రభుత్వ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపిన స్పీకర్👉హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నాంహైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్లను ఏర్పాటు చేస్తాంమూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాంత్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తాం👉 ధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారు: మంత్రి సీతక్కధరణి తెచ్చి రైతుల్లో భయం కల్పించారుధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం చేశారుభూములు అమ్ముకున్న వారికి తిరిగి పట్టాలు ఇచ్చారుబీఆర్ఎస్ నాయకులు తమ పేరు మీద భూములు రాసుకుని రైతు బంధు ఎంజాయ్ చేశారుములుగుకి వస్తే తప్పులను నిరుపిస్తాపేద రైతుల హత్యలు, అత్మ హత్యలకు ధరణే కారణంగత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ తప్పులను సరిద్ధిద్దలేదుఇప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారుపేదల అసైన్డ్ ల్యాండ్ గుంజుకున్నారువందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్లు కట్టుకున్నారురైతుల ఆవేదన తొలగించేలా, భూముల పై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాంత్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు ఆడుగుతున్నారురైతులకు భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తీస్తున్నాం👉మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్దేశంలో పేదవాడికి అండగా ఉన్నది ఇందిరమ్మ మాత్రమే.భూ రికార్డులను డిజిటలైజ్ చేసింది కూడా వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.2006లో వైఎస్సార్ పోడు భూములకు పట్టాలిచ్చారు.భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసింది.ధరణి పేరుతో బీఆర్ఎస్ దగా చేసింది.తెలంగాణ ప్రజల ఆస్తులను సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టారు.కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి ఉంది.బీఆర్ఎస్ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారింది.సింగపూర్ కంపెనీకి తెలంగాణ భూములను కేసీఆర్ తాకట్టు పెట్టారు.సాదాబైనామాల కరెక్షన్ కోసం 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ధరణిలో ఆ ఆప్షనే లేదు.ఏదైనా ఒక సర్వే నెంబర్లో కొంత భూమిపై వివాదం ఉంటే మొత్తం సర్వే భూమిపై ఆంక్షలు పెట్టారు.ధరణి చట్టం మూడు తలలతో మొదలై 33 తలలతో అవతరించింది.కలెక్టర్లు అప్రూవల్ చేసిన అప్లికేషన్లు మళ్ళీ చూడాలనుకున్నా కలెక్టర్లకు యాక్సెస్ ఇవ్వలేదు.కేసీఆర్ ఎవరి మాట వినలేదు, నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు చెప్పి చూశాను..పట్టించుకోలేదు.కేసీఆర్, ఓ అధికారి కూర్చొని ధరణిని నడిపించారుకారణాలు లేకుండా గతంలో అప్లికేషన్ రిజక్ట్ చేసేవారు. 👉సివిల్ కోర్టు సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదంఅసెంబ్లీలో కాగ్ రిపోర్ట్..2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందిసాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారు(పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం)1983 - 2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటిపై 1లక్ష 73వేల కోట్లుమొదటి అంచనా వ్యయం 1 లక్ష కోట్లు నుండి 2 లక్షల కోట్లకు పెరిగింది.ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉందిఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయి.వాటా అత్యధికంగా ఉన్నాయికాళేశ్వరం మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలు తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులుకార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి ఇబ్బంది15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్న గత ప్రభుత్వంగత సంవత్సరం బడ్జెట్లో పన్నెతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారుఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58శాతం, ఎస్టీలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదుఖర్చు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారి మళ్లించారుసొంత ఆదాయం కంటే.. రుణాలపై ఎక్కువగా ఆధారపడిందిఇప్పుడున్న రుణాలు తీర్చేందుకు రానున్న పదేళ్లలో 2లక్షల 86వేల కోట్లు సమీకరించాల్సి ఉంటుందిఇచ్చిన రుణాలను జప్తు చేసిన రెవెన్యూ రుణాలను ఎక్కువ చేసిన చూపిన ప్రభుత్వం2022 మార్చి నాటికి హెల్త్ డిపార్ట్మెంట్పై కాగ్ రిపోర్ట్.జిల్లా ఆసుపత్రులలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు లేవు.మందుల అవసరాలపై రెండు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేయాల్సి ఉన్నా.. 2015,19లో మాత్రమే సమీక్ష చేసారు.ఆసుపత్రులలో అవసరమైన మేరకు మందులను అందుబాటులో ఉంచడం లేదు.2017-18 ప్రధాన మంత్రి మాతృ వందన కింద వచ్చిన 65 కోట్ల నిధులు 2022 జూన్ నాటికి ఉపయోగించకపోవడంతో నిధులు కేంద్ర ఖాతాలోనే ఉన్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్..మొన్న అసెంబ్లీలో జరిగిన వీడియోలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.ఇది దుర్మార్గపు చర్య.ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..పార్లమెంట్ పరిధిలో ఎవరైనా ఫోటోలు వీడియోలు తీస్తే కఠిన చర్యలు ఉన్నాయి.ఒకరోజు జరిగిన ఘటనపై ఫోటోలు వీడియోలు తీస్తే వెంటనే డిలీట్ చేయించారు.పార్లమెంటు పరిధిలో ఫోటోలు వీడియోలు నిషేధం ఉన్నాయి. కేటీఆర్ కామెంట్స్..సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు.పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు కూడా లోపల విజువల్స్ చూపించటం లేదు.మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేస్తే ఎలా?పార్లమెంట్లో వీడియో లు, ఫోటోలు తీస్తున్నారు.అక్కడ జరిగే నిరసనలు జరిగేవి అన్ని చిత్రీకరిస్తున్నారు.ఒక్కసారి గమనించాలి. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..అసెంబ్లీ విషయంలో మంత్రి సీతక్కపై మార్ఫింగ్ వీడియోలు ప్రచారం జరిగాయి.మంత్రి సీతక్క మార్ఫింగ్ వీడియోలపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ప్రతిపక్షం చెప్పాలి. 👉మార్ఫింగ్ వీడియోలపై స్పీకర్ సీరియస్👉మార్ఫింగ్ వీడియోలు చేస్తే కఠిన చర్యలు👉అసెంబ్లీలో వీడియోలు మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తుంది.కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఉండే విచారణ చేస్తున్నాం.కొత్త చట్టాలపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతున్నాం.ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి చట్టాలపై ఆ అభిప్రాయాలు తెలిపాయి.సైబర్ క్రైమ్ అరాచకాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తేవడానికి వెనుకాడబోము.సైబర్ క్రైమ్ అరాచకాలు తారాస్థాయికి పోయాయి.సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోల ప్రచారం చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి.కేటీఆర్ అడిగినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం.సభా ప్రాంగణంలో సభను అప్రతిష్టపాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.లా అండ్ ఆర్డర్కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం.క్రిమినల్ చట్టాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కామెంట్స్..సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ కొన్ని సూచనలు చేస్తున్న.ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలికొత్తగా ఏర్పడిన జిల్లాలో కోర్టులకు సొంత భవనాలు లేవుఅద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరంనియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవుకేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలికోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందిగత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలిఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్..కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రాజ్యమేలుతున్నారు.పోలీసు వ్యవస్థ పాత సీసాలో పాత సారా టైప్ నడుస్తోంది.బీఆర్ఎస్ వదిలేసిన చెప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్లు పెడుతోంది.ఎన్ని ప్రభుత్వాలు మారిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమాలకు అడ్డంకులు చెప్పలేదు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా సుందర విజ్ఞాన కేంద్రంలో ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే అనుమతి తీసుకోవాలని అంటున్నారు.అరెస్టులు భారీగా జరుగుతున్నాయి అక్రమంగా లోపల వేస్తున్నారు.రాజ ద్రోహం కింద... దేశద్రోహం అని పేరు మారింది అంతే.కేంద్రం చట్టాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.సామాన్య కార్మికులు పేదవాళ్లు ధర్నాలు చేసే అవకాశం లేదు..ముఖ్యమంత్రి సామాన్య కార్యకర్తలకు, పేదవాళ్లకు అవకాశం కల్పించాలి.హరగోపాల్ లాంటి వాళ్ళు కార్యక్రమాలు పెడితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మంత్రి పొన్నం కామెంట్స్..సభలో రన్నింగ్ కామెంట్రీ ఆపాలి.సోషల్ మీడియాలో కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు, వస్తున్న ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలి..రవాణా శాఖ మంత్రిగా మొన్న కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు..కొంతమంది కావాలనే వీడియోలు క్రియేట్ చేసి మహిళలను అవమానిస్తున్నారు..అలాంటి వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి..నిన్న నేను మాట్లాడుతుంటే కావాలని వీడియో ఎడిట్ చేసి వైరల్ చేశారు.గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వందల మంది మీద కేసుకు కేసులు పెట్టారు..నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు..ఒక గిరిజన మహిళా మంత్రి శాసన సభలో మాట్లాడిని దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు..నిన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ నాతో మాట్లాడుతుంటే దానిని అసభ్యంగా ఎడిట్ చేశారు .బావ స్వేచ్ఛ ఉండాలి.. కానీ ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా ఉంటే ఎట్లా..సభలో జరిగిన అంశాలను కించపరిచి అవమానపరిచే విధంగా వీడియోలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి..కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రంలో ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.బాధితులకు త్వరగా న్యాయం జరగాలి.👉అసెంబ్లీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది.ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు.సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి..అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి..ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారుఅసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు.హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి.హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు.నా జీతం నుంచి 4 లక్షలు ఇచ్చాను వాళ్లకు.హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు ప్రెస్ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. 👉తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేడు తొమ్మిదో రోజు కాగా, ఈ సెషన్కు ఇదే చివరిరోజు కూడా. ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు.👉నేటి సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు.👉ఇక, నిన్న అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నేడు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.👉మరోవైపు.. నిన్న అసెంబ్లీ వద్ద నిరసనల కారణంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, నేడు బీఆర్ఎస్ నేతలు సభకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. -
వర్గీకరణ అమల్లో ముందుంటాం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందు భాగాన నిలబడి అమలు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్కుమార్నూ సభ నుంచి బహిష్కరించింది. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్ను ఢిల్లీకి పంపాం.న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదన విని్పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం..’అని సీఎం పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించాలని అన్ని పక్షాలను కోరారు. రాజ్యాంగ ధర్మాసనానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ల కల నెలవేరింది: రాజనర్సింహఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల కల నెరవేరిందని, ఇది చారిత్రక దినమని అన్నారు. వర్గీకరణ అంటే మరో వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు.వర్గీకరణకు వైఎస్సార్ మద్దతిచ్చారు కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మంద కృష్ణమాదిగను జైల్లో పెట్టించింది కేసీఆరే అన్నారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. మాదిగ బిడ్డ స్పీకర్ అవడంతో కేసీఆర్ సభకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్కుమార్, మందుల సామ్యూల్ కూడా మాట్లాడారు. సుప్రీం తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ స్వాగతించారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేశారని తెలిపారు.ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా తీర్పును స్వాగతించారు. కంభంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎల్పీ నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కను నియమిస్తే, ఆయన నాయకత్వంలో పనిచేయలేక సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం లభించిందన్నారు. ‘తీర్పునకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినందుకు దళిత జాతుల పక్షాన ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన సీఎం రేవంత్రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.బీఆర్ఎస్ మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తోంది: హరీశ్రావు అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండవులదేనని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని.. అయితే అధికార పక్షం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కడంపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ పారీ్టకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ 2014 నవంబర్ 29న వర్గీకరణ వెంటనే చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి వెళ్లి కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారని గుర్తుచేశారు.అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనదని, ఎన్నో త్యాగాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు అరి్పంచిన సంగతి మన కు తెలుసని అన్నారు. అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్రోహం చేసిందని చెప్పా రు.గాంధీభవన్ దగ్గర పెట్రోల్ పోసుకుని కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఏదిఏమైనా ఇది చాలా సంతోషకరమైన సందర్భమని, దశాబ్దాల కల నెరవేరిన రోజని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు
గద్వాల రూరల్: ‘అసెంబ్లీలో పాతమిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్లు మీడియా కథనాలు రాయడం సరైంది కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు’అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో కలసి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్రెడ్డితో మంతనాలు చేయడంతో పాటు ఆయనతో కలసి అల్పాహారం చేశారు.అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నెట్టెంపాడు, ర్యాలంపాడు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నారని పేర్కొ న్నారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన అవకాశాలుంటాయని, పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని చెప్పారు. గద్వాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డి పార్టీ మారారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. అనంతరం ఆయన కృష్ణమోహన్రెడ్డిని తన వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు. -
మళ్లీ అట్టుడికిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడా శాసనసభ అట్టుడికింది. బీఆర్ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పదేపదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అక్కడే బైఠాయించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ అసెంబ్లీ కొనసాగినంత సేపూ తమ సీట్ల వద్ద నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.తమకు మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్ను కోరారు. ప్రతిపక్షం నిరసనను అధికార పక్షం పట్టించుకోలేదు. గందరగోళం మధ్యే కీలకమైన స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి, చర్చ చేపట్టారు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు సభ నిర్వహణకు సహకరించాలంటూ పలుమార్లు బీఆర్ఎస్ సభ్యులను కోరారు. నల్లబ్యాడ్జీలతో వచి్చ..గురువారం బీఆర్ఎస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీ లతో శాసనసభకు వచ్చారు. సభ ప్రారంభం కాగానే సబితను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టారు. సబితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరి నా స్పీకర్ అనుమతించలేదు.అదే సమయంలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రికి స్పీకర్ సూచించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ పోడి యం వద్దకు దూసుకెళ్లారు. ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం అహంకార పూరిత వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సభ గందరగోళంగా ఉండగానే.. సీఎం రేవంత్ ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై ప్రకటన చేశారు. ఆ సమయంలో కాసేపు శాంతించిన విపక్ష సభ్యులు తర్వాత మళ్లీ నిరసన మొదలుపెట్టారు. గందరగోళం మధ్య చర్చ ఎలా?: అక్బరుద్దీన్ సభలో గందరగోళం కొనసాగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకున్నారు. సభలో ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్పష్టత ఇచ్చే హక్కు వారికి ఉంటుందని రూల్ పొజిషన్ లేవనెత్తారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలని, లేదా వారిని సస్పెండైనా చేయాలని సూచించారు.ఇంత గందరగోళం మధ్య కీలకమైన అంశాలపై చర్చ సరికాదని స్పష్టం చేశారు. సభను దారిలో పెట్టాల్సిన బాధ్యత సభాపతికి, సభా నాయకుడికి ఉంటుందన్నారు. సభను వాయిదా వేసి విపక్ష, అధికారపక్ష సభ్యులతో మాట్లాడటం సాంప్రదాయమని.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సభ కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. సభను అదుపులో పెట్టేందుకు తాను ఉదయం నుంచీ ప్రయతి్నస్తూనే ఉన్నానని చెప్పారు. తర్వాత కూడా నిరసనలు, నినాదాల మధ్యే సభ కొనసాగింది. తనిఖీల నుంచి తరలింపు దాకా.. గురువారం ఉదయం అసెంబ్లీకి వచి్చన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ప్లకార్డులు ఏవైనా తెస్తున్నారా అని ఆరా తీశారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సభ ప్రారంభానికి పది నిముషాల ముందే నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. సభ ముగిశాక అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు ధర్నాకు దిగారు.సుమారు అరగంట పాటు ఆందోళన చేయగా.. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనం బయటికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు కలి్పంచుకుని.. కేటీఆర్, హరీశ్రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, విజయుడు, మాణిక్రావు, మర్రి రాజశేఖర్రెడ్డి తదితరులను వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి అందరినీ బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్కు తరలించారు. నేడు కూడా ఆందోళనకు నిర్ణయం శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో.. తమ మహిళా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తామని.. ఇందుకోసం మాట్లాడే చాన్స్ ఇవ్వాలని పట్టుబడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తాను సీఎం నుంచి క్షమాపణ కోరుకోవడం లేదని.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని పేర్కొన్నారు. స్పీకర్కు తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. -
సీఎం కుర్చీ విలువను తగ్గించారు
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో సీఎం స్థానంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూశాం. మహిళా శాసనసభ్యులు నిలబడి మైక్ అడిగితే గతంలో సీఎంలు స్పందించేవారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా సీఎం సహా, అధికార పక్షం రాక్షసానందం పొందుతోంది. స్పీకర్ మనసు మారుతుందేమోనని గంటల కొద్దీ నిల్చున్నాం. మహిళా ఎమ్మెల్యేలను కించ పరిచినా సభ స్పందించలేదు. సీఎం కుర్చీ విలువను రేవంత్ తగ్గించారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.అక్కలు అంటూనే పంగనామాలు‘ఆడబిడ్డలను అవమానించడం సీఎంకు నిత్యకృత్యంగా మారింది. రేవంత్ను నమ్ముకున్న రాహుల్గాంధీ బతుకుని సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా? సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును రేవంత్ ప్రస్తావించడం సరికాదు. నేను రేవంత్ను నడిబజారులో నిలబెట్టలేదు, రాజ్భవన్లో కూర్చోబెట్టాను. గతంలో నన్ను చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచింది కాంగ్రెస్ కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఈ సీఎం మాత్రం అక్కలు అంటూనే పంగనామాలు పెడుతున్నారు.గతంలో పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీలు మారారు. సీఎం రేవంత్ సహా అసెంబ్లీలో ఇప్పుడున్న వారిలో ఎంత మంది పార్టీలు మారలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మమ్మల్ని టార్గెట్ చేయడం ఎందుకు? టీడీపీ రేవంత్ సీఎం పదవి లాక్కున్నా భట్టికి బాధ లేదు. మాకు సీఎం క్షమాపణ చెప్పడం ముఖ్యం కాదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం నుంచి సమాధానం కోసం శుక్రవారం సభలో పట్టుబడతాం. మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. శాసనసభలో మహిళల గౌరవాన్ని కాపాడాలి..’ అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మాపై వ్యాఖ్యలు బాధాకరం: సునీత‘నాలుగున్నర గంటలు సభలో నిల్చున్నా పాలకపక్షం స్పందించక పోగా హేళన చేసింది. జూనియర్ ఎమ్మెల్యేలు మాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో నా తరఫున నర్సాపూ ర్ ప్రచారానికి వచ్చిన రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్లే నాపై మూడు కేసులు నమోదయ్యాయి. సమాచారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకం అన్నట్లుగా కాంగ్రెస్ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు..’ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. సీఎం ఓ వైపు ఇందిర, సోనియా పేర్లు చెపుతూ మరోవైపు మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారని కోవా లక్ష్మి విమర్శించారు. చట్ట సభల్లో్లనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు.తాలిబన్ సంస్కృతికి వారసుడిలా సీఎం: మాజీ మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డిసీఎం రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో తాలిబన్ సంస్కృతికి వారసుడిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో సహచర ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకానంద, మర్రి జనార్దన్రెడ్డి, డాక్టర్ సంజయ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఎమ్మెల్యేలు సబిత, సునీతా లక్ష్మా రెడ్డిపై ఆయన వ్యాఖ్యలు జుగుప్సా కరమన్నారు.పూటకో పార్టీ మారిన రేవంత్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో రేవంత్కు తగిన శాస్తి జరుగు తుందని హెచ్చరించారు. సబిత, సునీతపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని జగదీశ్రెడ్డి విమర్శించారు. రేవంత్పై ఉన్న కోపాన్ని భట్టి విక్రమార్క సబితపై చూపించారన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మాట్లాడతామని చెప్పారు. -
అక్కలను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ ఎస్ నేతలు అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, కావాలనే సభను స్తంభింపజేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను తాను సొంత అక్కలుగానే భావించానని.. కానీ వారు దొర పన్నిన కుట్రలో బందీ అయ్యారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనమే తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను నేను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసింది. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. అప్పుడు నమోదైన కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. తన కోసం ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఆమె ఎప్పుడైనా చెప్పారా? నన్ను నమ్ముకున్న సీతక్క, సురేఖ అక్క ఇద్దరూ మంత్రులై ముందు వరుసలో ఉన్నారు.సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా రాజకీయాలుబీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో సీతక్కను అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్ను ఇక్కడ చూపిస్తే సభా గౌరవం పోతుంది. అలా మీమ్స్ పెట్టిన వాళ్లను చెప్పుతో కొట్టాలి. వారు ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్టు కాదా? సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా.. ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్న నీచులు వారు. సొంత చెల్లిల్ని ఏడాదిపాటు జైల్లో ఉంచినా ఫర్వాలేదు. మా జోలికి రాకండి అన్నవిధంగా వారి వ్యవహారశైలి ఉంది. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు. నా చెల్లెలు జైల్లో ఉంటే నేను రాజకీయాల కోసం బజార్లో తిరిగే వాడిని కాదు. నేను అక్కను అవమానించే నీతిలేని వాడిని కాదు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు.కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది..ఎస్సీ వర్గీకరణపై అందరూ పండుగ చేసుకుంటుంటే.. బీఆర్ఎస్ వాళ్లకు అదేమీ పట్టడం లేదు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేయడానికి వచ్చినట్టుగా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉంది. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయింది. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. కేసీఆర్ కూడా దీనిపై మాట్లాడితే బాగుండేది. ఇంత కీలక అంశం సభలో చర్చకు వస్తున్నప్పుడు స్వయంగా కేసీఆర్ చర్చలో పాల్గొంటే బాగుండేది. స్పీకర్ దళితుడు కాబట్టే ఆయన ముందు కింద కూర్చోకూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు..’’అని రేవంత్ పేర్కొన్నారు. అసలు కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీయే రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. హరీశ్రావుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ భూమిపూజకు అందరూ రావాల్సిందిగా రేవంత్ కోరారు. -
ఇందిరమ్మ పాలనంటే ఇదేనా?: సబిత
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారని.. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదు.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడ్డా మైక్ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పినా మాట్లాడనివ్వలేదు. శాడిస్ట్లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తమంటుంది. నోటి మాటల్లో కాదు నిజంగా చేసే దమ్ముందా?’’ అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాలుగు గంటలు నిలబడ్డా కనీసం మాకు మైక్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించటం బాధగా ఉంది. ఇద్దరు మహిళ మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? మేము మాట్లాడి రెండు రోజులు అవుతుంటే ఎందుకు స్పందించటం లేదు.మహిళా మంత్రులు బాధ్యత కాదా?’’ అంటూ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తనను నమ్ముకున్న అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్ధేశించి)మంత్రులయ్యారని.. వారిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నానని తెలిపారు. వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉందని, సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దని సీఎం పేర్కొన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదని, మైక్ ఇస్తే శాపనార్ధాలు, లేకుంటే పోడియం ముందుకు.. వాళ్ల పనే అంత అంటూ మండిపడ్డారు. తనను అయిదేళ్ల పాటు సభలోకి రానివ్వలేదని, వచ్చినా మార్షల్స్ను పెట్టి బటయకు గెంటారని గుర్తు చేశారు.చెల్లి జైల్లో ఉంటే బజార్ల రాజకీయాలు చేసే నీచుడిని కాదని సీఎం తెలిపారు. మంత్రి సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా సొంత అక్కల్లాగే భావించానని అన్నారు. అయితే ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళితే.. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారన్న సీఎం.. దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలని సూచించారు.కాగా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమనించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను టార్గెట్ చేసిన రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. రేవంత్ను కాంగ్రెస్లోకి తానే ఆహ్వానించానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్, స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు.