
నేలరాలిన సుమాలను గుండెకు హత్తినవాడు!
ఇరవయ్యవ శతాబ్దపు రుషిగా సాహితీలోకం గౌరవించిన వ్యక్తి డా.బోయి భీమన్న. ఆయన కవి, తాత్వికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు.
బోయి భీమన్న వర్ధంతి నేడు
ఇరవయ్యవ శతాబ్దపు రుషిగా సాహితీలోకం గౌరవించిన వ్యక్తి డా.బోయి భీమన్న. ఆయన కవి, తాత్వి కుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. వివిధ సాహితీ ప్రక్రియలతో 70కి పైగా పుస్తకాలను రచించారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన రచించిన ‘పాలేరు’ నాటికను 1940ల్లో గ్రామగ్రామాన ప్రదర్శించారు. ఆ నాటిక ఇచ్చిన స్ఫూర్తితో దళితులు ఉన్నత విద్యనభ్య సించి తరువాతి తరాలకు స్ఫూర్తి నిచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత సీఎం డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ‘పద్మ భూషణ్ డా॥బోయి భీమన్న సాహిత్యపీఠం’ స్థాపించింది. సాహిత్యపీఠం తరఫున ఏటా చేపడుతోన్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు బోయి భీమ న్న 9వ వర్ధంతి సభను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృ తికశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు డా.రాళ్లబండి కవితాప్రసాద్, విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పాత్రి కేయులు సతీష్చందర్, భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి హైమవతీ భీమన్న, కవి తిరునగరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
గంధర్వ లోకపు పాటలు!
భీమన్న వర్ధంతి సందర్భంగా ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ భీమన్న పద్యాలు, పాటలు ఆలపిస్తారు. పద్మభూషణ్ డా.బోయి భీమన్న పాటలు ఎలా ఉంటాయో ఒక సంఘటన తెలియజేస్తుంది! ఒక టీవీ చానల్ నిర్వహించే పాటల పోటీ కార్య క్రమంలో న్యాయనిర్ణేత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఒక బాలిక పాట పాడుతోండగా లేచి నిల్చున్నారు! ఎందుకలా ? ఏంకర్ అడిగాడు! జాతీయగీతాలు విన్నప్పుడు ఎందుకు నిల్చుంటామో అందుకే నిల్చున్నాను. కొన్ని పాటలు హిమాలయాలంత ఎత్తున ఉంటాయి! కొన్ని, అంతకు మించిన ఎత్తులో ఉంటాయి. ఇప్పుడు విన్నపాట హిమాలయాలపై ఎత్తులో ఉన్న గంధర్వలోకం నుంచి వచ్చింది అన్నారు కీర వాణి! ఆ పాట 1936లో బోయి భీమన్న రాశారు. చిత్తరంజన్ స్వరపరచగా ఆయన సోదరి శాంతాచారి ఆలిండియా రేడియో కోసం అప్పట్లో పాడారు.
- బిట్రా ప్రణవి, బెంగళూరు