విమాన ప్రయాణికుల రద్దీ 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో 17% వృద్ధి చెందింది. విమానయాన సంస్థలు 95.65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 85.08 లక్షలు. తాజా గణాంకాల ప్రకారం.. ఇండిగో 38.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అయితే కిందటి నెలలో సంస్థ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. అంటే కొంత క్షీణత నమోదయ్యింది. ఇండిగోలో 36.99 లక్షల మంది ప్యాసెంజర్లు ప్రయాణించారు. ఇక దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్వేస్ (15.8 శాతం), స్పైస్జెట్ (14.2 శాతం), ఎయిర్ ఇండియా (13.5 శాతం) ఉన్నాయి. ఈ మూడు సంస్థల మార్కెట్ వాటా జూలైలో పెరగడం గమనార్హం.