'ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత రఘువీరా, బొత్సకు లేదు' | Ravela Kishore Babu takes on Raghuveera reddy, Botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత రఘువీరా, బొత్సకు లేదు'

Oct 5 2014 10:06 AM | Updated on Mar 23 2019 8:59 PM

'ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత రఘువీరా, బొత్సకు లేదు' - Sakshi

'ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత రఘువీరా, బొత్సకు లేదు'

టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ బొత్సలకు లేదని ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.

కడప: టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ బొత్సలకు లేదని ఆ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. వారిద్దరికి ఏ అర్హత ఉందని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లాలో జన్మభూమి - మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కడప నగరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశాల్లో ఉన్నవారికి, చనిపోయిన వారికి కూడా పింఛన్లు అందించారని విమర్శించారు. పింఛన్కు అర్హులైన వారి జాబితాను వెబ్సైట్లో పెడతామన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్ వస్తుందని రావెల హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement