న్యూఢిల్లీ : తెలంగాణ, రాయలతెలంగాణ అంశాలపై చర్చలతో ఢిల్లీ వేడెక్కింది. ప్రధాన మంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎంపిలు, ప్రధాన ప్రతిపక్షమైన బిజేపి నేతలు ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అనుసరించవలసి వ్యూహం, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
కోర్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేరుగా నార్త్బ్లాక్కు చేరుకున్నారు. జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ షిండేతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయమే వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ ఎంపిలు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. పది జిల్లాల తెలంగాణ మాత్రమే కావాలని కోరారు. మరోవైపు తెలంగాణ జెఏసీ నేతలు కోదండరామ్ నాయకత్వంలో బిజేపి నాయకురాలు సుష్మాస్వరాజ్ను కలిశారు. రాయలతెలంగాణకు అంగీకరించవద్దని వారు ఆమెను కోరారు.రాయలతెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తిలేదని ఆమె వారికి హామీ ఇచ్చారు. పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇంకోవైపు రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషిస్తున్న జిఓఎం సభ్యుడు జైరామ్ రమేష్ బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడును కలిసి రాయలతెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించమని నచ్చచెబుతున్నట్లు తెలిసింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చిస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశం కూడా తెలంగాణ బిల్లుపైనే చర్చిస్తుంది. తెలంగాణపై కేంద్ర మంత్రులు తలా ఒక మాట మాట్లాడటం, గందరగోళాన్ని సృష్టించడం విమర్శలకు దారి తీస్తోంది. ఒక రాష్ట్రాన్ని విభజించే అంశాన్ని స్పష్టంగా తెలియజేయకుండా కేంద్రం ఇంత గోప్యంగా ఉంచడాన్ని పలువురు నేతలు తప్పుపడుతున్నారు.
తెలంగాణపై చర్చలతో వేడెక్కిన ఢిల్లీ
Published Thu, Dec 5 2013 1:41 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్కు సపోర్ట్గా నిలిచిన విశ్వక్ సేన్
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
రాజ్కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
snake bite: పట్టిన పామే కాటేసింది
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
తప్పక చదవండి
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement