► సమీక్షా సమావేశంలో
► అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
విజయవాడ: ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో పెద్దయెత్తున నిధులు విడుదల చేస్తున్నా అధికారులు వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎ.బాబుఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ. 1.40కోటికిపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే ఆ నిధులను ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా ఇన్నోవెంట్ ఫండ్స్ ద్వారా 11 ఆసుపత్రుల్లో సివిల్, వైద్య పరికరాల కోసం విడుదల చేసిన నిధుల వ్యయంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం కనీస బాధ్యతగా గుర్తెరిగి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో ఉన్న ఆవిష్కరణ నిధులు కింద వివిధ పనులు చేపట్టేందుకు నిధులు అందుబాటులో ఉంటాయని వాటిని ఆస్పత్రుల అభివృద్ది కోసం ఖర్చు చేయటానికి ప్రతిపాదనలు కోరినట్లు చెప్పారు. ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అందుకు అనుగుణంగా నిధులను విడుదల చేశామన్నారు. జిల్లా స్థాయిలో విడుదల చేసిన నిధులను జిల్లా పర్చేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హాస్పటల్స్ పర్యవేక్షకులు, సమన్వయశాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి నిధులను ఖర్చు చేయాలని గతంలో స్పష్టం చేశామన్నారు. ఆసుపత్రులు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తే వాటిని ఏపీఎంఐసీకి ఎలా బదిలీ చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
11 ఆసుపత్రులకు నిధులు మంజూరు
మచిలీపట్నం ఆసుపత్రి సర్వీసెస్ కింద రూ. 26లక్షలు, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజికి 2 ఆపరేషన్ టేబుల్స్, ఇతర పనుల కోసం రూ. 23 లక్షలు, విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్లో 24 పనుల కోసం రూ. 47.57లక్షలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నం జిల్లా హాస్పటల్లో 9 పనుల కోసం రూ.13.88లక్షలు, గుడివాడ ఏరియా హాస్పటల్లో 9 పనుల కోసం రూ. 7.5లక్షలు, అవనిగడ్డ, మైలవరం పీహెచ్సీ, నూజివీడు ఏరియా ఆస్పత్రులలో 9 పనుల కోసం రూ.14 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశామని కలెక్టర్ వెల్లడించారు.
తిరువూరు ఏరియా ఆసుపత్రిలో 9పనుల కోసం రూ.6లక్షలు, నందిగామ ఏరియా ఆస్పత్రిలో 8 పనుల కోసం రూ. 5లక్షలు, ఉయ్యూరు పీహెచ్సీలో 7 పనుల కోసం రూ.1.76 లక్షలు విడుదల చేశామన్నారు. ఈ పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ ఎం. జగన్మోహన్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పర్యవేక్షకులు ఆర్.శశాంక్, కేంద్ర సర్వీస్కు చెందిన జిల్లా డెవలప్మెంట్ అధికారి అనంతకృష్ణ, ప్రభుత్వాస్పత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
నిధులున్నా ఆసుపత్రుల అభివృద్ధిలో అలక్ష్యమా?
Published Sun, Apr 24 2016 4:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement