‘ఒక్కరూపాయికే జీ+1 బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌’ | Sakshi
Sakshi News home page

‘ఒక్కరూపాయికే జీ+1 బిల్డింగ్‌ రిజిస్ట్రేషన్‌’

Published Fri, Jul 19 2019 3:23 PM

మున్సిపల్‌ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్‌ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్‌ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది.