రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. సోమవారం ఉదయం జననేత 281వ రోజు పాదయాత్రను గుర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్, అనందపురం క్రాస్ మీదుగా గరికవలస వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. గరిక వలసలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతారు.