కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం  కర్నూల్‌-సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను  లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్‌ క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలెట్‌ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top