వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది. రాజమండ్రిలో జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెంలో వైఎస్ జగన్ రోడ్ షో ఆరంభమైంది. కొవ్వురు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. జగన్కు అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. జనభేరి యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు నాయకులు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.
Mar 17 2014 10:18 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement