అర్థరాత్రి పలు బస్సులపై రాళ్లతో దాడి | Unknown persons attack buses with stone | Sakshi
Sakshi News home page

Sep 7 2013 9:26 AM | Updated on Mar 21 2024 6:14 PM

హైదరాబాద్ శివారులో అర్థరాత్రి పలు బస్సులపై రాళ్ల దాడి జరిగింది. హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగులగొట్టారు. రాజోలుకు వెళుతున్న సాయి వెంకటరమణ ట్రావెల్స్‌ బస్సుపై రాళ్లదాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. హయత్‌నగర్‌లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement