వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే తాను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. కొద్ది రోజుల్లో విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకపాలనను అంతమొందించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఆయన నాయకత్వాన్ని సమర్ధించేందుకే పార్టీలోకి వచ్చానని చెప్పారు. అంతేగాని తనకు సీటు ఇస్తారనే ఆలోచనతో పార్టీలోకి రాలేదని తెలిపారు.
Jul 4 2017 6:36 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement