దేశ రాజధాని ఢిల్లీతో పాటు హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం వేకువజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున దాదాపు నాలుగున్నర గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం.