కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన కొండ్రెడ్డి(65) ద్విచక్రవాహనంలో గ్రామంలో నుంచి రోడ్డుపైకి రాగా, గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండ్రెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


