
తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రం అభివృద్ధి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆలయంలోని వివిధ విభాగాలు, శాఖల అధికారులతో బుధవారం కొండపై గల అతిథిగృహంలో సమావేశం అయ్యారు. ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. పెండింగ్ పనులు, జరగాల్సిన అభివృద్ధిపై చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులతో పాటు వివిధ పనులకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.రూ.230 కోట్లతో నివేదిక రూపొందించి ఈనెల 6న తిర్మలాపూర్లో జరిగే సభలో సీఎంకు అందజేస్తామన్నారు. ఆలయానికి త్వరలోనే ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ విప్ దృష్టికి పలు అంశాలు
కొండపైన సుమారు 4,000 వాహనాలకు పార్కింగ్, బాలాలయం ప్రదేశంలో నిత్యకల్యాణ మండపం, రంగమండపం, దేవస్థానం పరిధిలో గదుల నిర్మాణం, కొండపైన 1,000 మందికి సరిపడా డార్మిటరీ హాళ్లు, వృద్ధుల కోసం లిఫ్టుల ఏర్పాటు, దుకాణ సముదాయం, టెంపుల్ సిటీపై వేద పాఠశాల, ఆలయ పరిసరాల్లో సోలార్ విద్యుత్ వంటి ఉండాలని ప్రభుత్వ విప్ దృష్టికి ఈఓ తీసుకెళ్లారు. ఈ అంశాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఐలయ్య పేర్కొన్నారు. అంతకుముందు ఆలయ అభివృద్ధి, పెండింగ్ పనులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఆలయ అధికారులు దయాకర్రెడ్డి, రామారావు, వివిధ విభాగాలు, శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ రూ.250 కోట్లతో భక్తులకు సౌకర్యాలు
ఫ త్వరలోనే ట్రస్టు బోర్డు ఏర్పాటు
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య