భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

Jun 4 2025 2:22 AM | Updated on Jun 4 2025 2:22 AM

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

తుర్కపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ హనుమంతురావు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం నాగాయిపల్లి, గోపాలపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలపురంలో సదస్సును కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. అనంతరం తిరుమలాపురం గ్రామంలో ఈనెల 6న జరగనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దేశ్యానాయక్‌, డీటీ కల్పన, అర్‌ఐ జహంగీర్‌, రఘురామారావు, సర్వేయర్‌ శ్రీనివాస్‌, పుండరీకం, చరణ్‌ సింగ్‌, తేజశ్విని, కార్యదర్శ బాలరాజు, నాయకులు ధనావత్‌ శంకర్‌నాయక్‌, చాడ భాస్కర్‌రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సోన్నాయిల రఘు, రైతులు, మాన్‌సింగ్‌, రహిమత్‌ షరీష్‌, పెద్దులు, మెరుగు కృష్ణ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement