
ఫ మూసీకి వరద ప్రవాహం
టెన్త్లో ఫెయిలైన విద్యార్థుల దత్తత
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. విద్యార్థి తప్పిన సబ్జెక్ట్ల్లో సంబంధిత ఉపాధ్యాయులు వారిని దత్తత తీసుకుని ప్రతి రోజూ ఆన్లైన్లో విషయ బోధన, ప్రధానమైన అంశాల గురించి వివరిస్తారని వెల్లడించారు. ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ల ద్వారా హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఎంఈఓలు తగు సూచనలు చేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.