తణుకులో కోవిడ్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

తణుకులో కోవిడ్‌ కలకలం!

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 1:23 AM

తణుకులో కోవిడ్‌ కలకలం!

తణుకులో కోవిడ్‌ కలకలం!

తణుకు అర్బన్‌: కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న తణుకుకు చెందిన వృద్ధురాలికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పట్టణంలోని పైడిపర్రుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వచ్చాక గత మూడు రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. ఈ నెల 27న తణుకులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో రాజమండ్రికి తరలించగా అక్కడ చేసిన ర్యాపిడ్‌ కిట్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యసేవలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ యాత్రలకు పైడిపర్రు నుంచి 15 మంది వరకు వెళ్లారని ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. కోవిడ్‌ పాజిటివ్‌ అన్న సమాచారంతో బుధవారం ఉదయం మున్సిపల్‌ శానిటరీ అధికారులు పైడిపర్రులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ విషయంపై వైద్య శాఖ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ గీతాబాయిని వివరణ కోరగా కోవిడ్‌ లక్షణాలున్న వృద్ధురాలికి తణుకులో ఎలాంటి పరీక్షలు చేయలేదని, ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పరీక్షకు సంబంధించిన రిపోర్టు గురువారం వస్తుందని చెప్పారు. మునిసిపల్‌ అధికారులు శానిటేషన్‌ చేయించారు తప్ప.. వైద్యశాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, అవగాహన కల్పించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టని యంత్రాంగం

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందనే సంకేతాలు ఉన్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్‌ పరీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో అందుబాటులో లేవు. పరీక్షలు, సంబంధించిన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్‌ కేసు నమోదు కాకుండానే పరీక్షలు నిర్వహించే కిట్‌లు, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వార్డుల్లో బెడ్స్‌ అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్‌ వంటి ఏర్పాట్లు చకచకా చేశారు. కడప ప్రాంతంలో కూడా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయనే వార్తలు రాగా.. తణుకు నుంచి మహానాడుకు టీడీపీ శ్రేణులు వెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రచారం

పైడిపర్రులో ప్రత్యేక శానిటేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement